...
...
Next Story

Shahrukh Deepika Leak: దయచేసి ఆ ఫొటోలను షేర్ చేయకండి.. లీక్ అయిన షారుఖ్, దీపికా ఫొటోలపై డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్

Siddharth Anand On Shahrukh Deepika Leak Photos: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'కింగ్' సెట్స్ నుంచి ఫోటోలు లీక్ అవ్వడంపై దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తీవ్రంగా స్పందించారు. అభిమానులు ఆ ఫోటోలను షేర్ చేయవద్దని, సర్‌ప్రైజ్ మిస్ అవ్వొద్దని ఆయన కోరారు.

Published on: May 1, 2026, 19:11:04 IST
Advertisement

Siddharth Anand On Shahrukh Deepika Leak Photos: ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్‌లో 'కింగ్' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో షారుఖ్ ఖాన్‌తో పాటు స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కూడా పాల్గొంటున్నారు. అయితే, సెట్స్ నుంచి వీరిద్దరికీ సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దయచేసి ఆ ఫొటోలను షేర్ చేయకండి.. లీక్ అయిన షారుఖ్, దీపికా ఫొటోలపై డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్
దయచేసి ఆ ఫొటోలను షేర్ చేయకండి.. లీక్ అయిన షారుఖ్, దీపికా ఫొటోలపై డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్

స్ట్రైప్డ్ వైట్ అండ్ బ్లూ షర్ట్‌లో షారుఖ్ ఖాన్ క్లాస్ లుక్‌లో కనిపిస్తుండగా, ఆరెంజ్ కలర్ దుస్తుల్లో దీపికా మెరిసిపోతున్నారు. గర్భవతిగా ఉన్నప్పటికీ దీపికా షూటింగ్‌లో పాల్గొనడం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫోటోలు నెట్టింట హల్చల్ చేయడంతో చిత్ర యూనిట్ అప్రమత్తమైంది.

సర్‌ప్రైజ్ పాడు చేయకండి

లీకైన షారుఖ్, దీపికా ఫొటోలపై దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "అభిమానులందరికీ ఒక విన్నపం.. 'కింగ్' సెట్స్ నుంచి లీకైన ఫోటోలను, వీడియోలను దయచేసి షేర్ చేయకండి. మీ అందరికీ వెండితెరపై ఒక అద్భుతమైన అనుభూతిని అందించడానికి మా బృందం రాత్రింబవళ్లు శ్రమిస్తోంది. ఆ సర్‌ప్రైజ్‌ను సినిమా హాల్‌లోనే చూసి ఆస్వాదించండి. చిత్ర యూనిట్ అధికారికంగా ప్రచార చిత్రాలను విడుదల చేసే వరకు వేచి ఉండండి" అంటూ ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా డైరెక్టర్ సిద్ధాంత్ ఆనంద్ కోరారు.

తండ్రీకూతుళ్ల క్రేజీ కాంబినేషన్

కింగ్ సినిమా టీమ్ కష్టాన్ని గౌరవించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా ఈ కింగ్ సినిమాపై భారీ అంచనాలు ఉండటానికి ప్రధాన కారణం షారుఖ్ ఖాన్ తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటుండటమే.

సిద్ధార్థ్ ఆనంద్ తనదైన స్టైల్‌లో స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్, రాణి ముఖర్జీ, అర్షద్ వార్సీ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

కింగ్ మూవీ షూటింగ్ శరవేగంగా పూర్తి చేసి, 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. లీకుల గొడవ పక్కన పెడితే, షారుఖ్ - దీపికా కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 'కింగ్' సినిమాలో షారుఖ్ ఖాన్‌తో పాటు సుహానా ఖాన్ నటిస్తున్నారా?

అవును, ఈ సినిమా ద్వారా షారుఖ్ ఖాన్ తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి తొలిసారి వెండితెరపై కనిపించబోతున్నారు.

2. షూటింగ్ ఫోటోల లీక్‌పై దర్శకుడు ఏమన్నారు?

సినిమాలోని సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ దెబ్బతినకుండా ఉండేందుకు, లీకైన ఫోటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ అభిమానులను కోరారు.

3. 'కింగ్' సినిమా ఎప్పుడు విడుదలవుతుంది?

ఈ సినిమాను 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ పండుగ సందర్భంగా విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది.

4. ఈ సినిమాలో దీపికా పదుకొణె పాత్ర ఏమిటి?

దీపికా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. తాజా కేప్ టౌన్ షెడ్యూల్‌లో ఆమె షారుఖ్‌తో కలిసి కీలక సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe