బాలీవుడ్ వెండితెరపై తన అద్భుత నటనతో ఎన్నో మరపురాని పాత్రలకు ప్రాణం పోసిన నటి దివ్య దత్తా. అయితే, దశాబ్దాల కాలంగా పరిశ్రమలో నటీనటులకు అంటగడుతున్న కొన్ని 'లేబుల్స్' పట్ల ఆమె ఇప్పుడు తన గళాన్ని వినిపించారు. ముఖ్యంగా 'సపోర్టింగ్ యాక్టర్' (సహ నటులు) అనే పిలుపు తనకు అస్సలు నచ్చదని ఆమె తెగేసి చెప్పారు.
కేవలం నటిని మాత్రమే!

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఓటీటీ నటి దివ్య దత్తా తన కెరీర్ ప్రయాణాన్ని విశ్లేషిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నేను ఒక నటిని, నన్ను అలాగే పిలవాలని కోరుకుంటున్నాను" అని దివ్య దత్తా అన్నారు.
"కొన్ని ఏళ్ల క్రితం వరకు నటీనటులను కేవలం లీడ్, సపోర్టింగ్ అని వర్గీకరించడం వింతగా అనిపించేది. ఇప్పుడు అది సర్వసాధారణమైపోయింది. హీరోతో రొమాన్స్ చేసే హీరోయిన్ పాత్రలు చేయడానికే కాదు.. ప్రాధాన్యత ఉన్న ప్రతి పాత్రలోనూ మెరవాలని నేను అనుకుంటాను" అని దివ్య దత్తా పేర్కొన్నారు.
నాకు నేనే సపోర్ట్
సినిమాలో కేవలం హీరో చుట్టూ తిరిగే పాత్రలు చేయనంత మాత్రాన ఆమె 'సపోర్టింగ్ క్యారెక్టర్' ఎలా అవుతుందని దివ్య ప్రశ్నించారు. "నేను ఇక్కడ ఎవరికీ సపోర్ట్ చేయడానికి రాలేదు. నాకు నేనే సపోర్ట్. అది విలన్ పాత్ర అయినా, కామెడీ అయినా లేదా ఒక చిన్న నిడివి ఉన్న పాత్ర అయినా.. అది కథను మలుపు తిప్పేదిగా ఉండాలని నేను కోరుకుంటాను. నా ఫిల్మోగ్రఫీ చూస్తే.. ప్రతి సినిమాలోనూ నా పాత్ర ఎంతో కీలకమైనదిగా కనిపిస్తుంది" అని దివ్య దత్తా గర్వంగా చెప్పారు.
ఆ ట్యాగ్ వేయించుకోవడం ఇష్టం లేదు..
పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ఉండాలని చాలామంది ఆరాటపడుతుంటారు. కానీ, దివ్య దత్తా మాత్రం భిన్నమైన దారిని ఎంచుకున్నారు. "నేను ఏ కేటగిరీకి చెందుతానో జనానికి తెలియకపోవడమే నాకు ఇష్టం. ఎందుకంటే నాకు ఒక ముద్ర (Image) లేదా ఒక ట్యాగ్ ఉండటం ఇష్టం లేదు. నేను అన్ని రకాల పాత్రలూ చేయాలనుకున్నాను, చేస్తున్నాను కూడా" అని దివ్య దత్తా వివరించారు.
{{/usCountry}}పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ఉండాలని చాలామంది ఆరాటపడుతుంటారు. కానీ, దివ్య దత్తా మాత్రం భిన్నమైన దారిని ఎంచుకున్నారు. "నేను ఏ కేటగిరీకి చెందుతానో జనానికి తెలియకపోవడమే నాకు ఇష్టం. ఎందుకంటే నాకు ఒక ముద్ర (Image) లేదా ఒక ట్యాగ్ ఉండటం ఇష్టం లేదు. నేను అన్ని రకాల పాత్రలూ చేయాలనుకున్నాను, చేస్తున్నాను కూడా" అని దివ్య దత్తా వివరించారు.
{{/usCountry}}కాగా, 1994లో ‘ఇష్క్ మే జీనా ఇష్క్ మే మర్నా’ చిత్రంతో ప్రయాణం మొదలుపెట్టిన దివ్య దత్తా వీరజారా, భాగ్ మిల్కా భాగ్, ఢిల్లీ-6, బద్లాపూర్ వంటి చిత్రాలతో తన నటనలోని వైవిధ్యతను నిరూపించుకున్నారు.
జియో హాట్స్టార్ ఓటీటీలో
దివ్య దత్తా తన తదుపరి ప్రాజెక్టుగా 'చిరయ్యా' అనే పవర్ఫుల్ సోషల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మార్చి 20న జియో హాట్స్టార్ (JioHotstar)లో చిరయ్యా ఓటీటీ రిలీజ్ కానుంది. ఈ ఓటీటీ సిరీస్ భారతదేశంలో 'మారిటల్ రేప్' (వైవాహిక అత్యాచారం) అనే సున్నితమైన అంశం చుట్టూ తిరుగుతుంది.
ఆరు ఎపిసోడ్స్తో ఓటీటీ సిరీస్
శశాంత్ షా దర్శకత్వంలో తెరకెక్కిన ఓటీటీ సిరీస్ చిరయ్యా ఆరు ఎపిసోడ్లుగా రానుంది. ఈ సిరీస్లో కమలేష్ అనే ఇల్లాలు పాత్రలో దివ్య దత్తా నటించారు. తన కుటుంబ గౌరవానికి, తన తోడికోడలు ఎదుర్కొంటున్న వేధింపులకు మధ్య నలిగిపోయే ఒక మహిళ పోరాటాన్ని ఈ సిరీస్లో చూడవచ్చు. ఇందులో సంజయ్ మిశ్రా కూడా కీలక పాత్ర పోషించారు.