...
...
Next Story

OTT Trending: ఓటీటీ రిలీజ్ నుంచే ట్రెండింగ్‌లో సోషల్ క్రైమ్ థ్రిల్లర్- ఇవాళ టాప్ 3లో- 8.4 రేటింగ్- 5 భాషల్లో స్ట్రీమింగ్

Exam The System Exposed OTT Trending On Top 3 Place: పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ పేపర్ లీకేజీలు, నిరుద్యోగ యువత ఎదుర్కొనే ఒత్తిడి నేపథ్యంలో జాతీయ అవార్డు గ్రహీత ఎ. సర్గుణం తెరకెక్కించిన సోషల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'ఎగ్జామ్'. ఓటీటీ రిలీజ్ నుంచే ట్రెండింగ్‌లో ఉన్న ఎగ్జామ్ ఇవాళ టాప్ 3లో ఉంది.

Published on: May 19, 2026, 06:15:54 IST
Advertisement

Top 3 OTT Trending Today: ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాత్రింబగళ్లు కష్టపడి చదివే విద్యార్థుల జీవితాలతో ఆడుకునే పేపర్ లీక్ ముఠాల చుట్టూ ఇప్పడు ఓటీటీ వినోద రంగం దృష్టి సారించింది. మన తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల లీకేజీలు ఎంతటి సంచలనం సృష్టించాయో చూశాం.

సోషల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

ఓటీటీ రిలీజ్ నుంచే ట్రెండింగ్‌లో సోషల్ క్రైమ్ థ్రిల్లర్- ఇవాళ టాప్ 3లో- 8.4 రేటింగ్- 5 భాషల్లో స్ట్రీమింగ్
ఓటీటీ రిలీజ్ నుంచే ట్రెండింగ్‌లో సోషల్ క్రైమ్ థ్రిల్లర్- ఇవాళ టాప్ 3లో- 8.4 రేటింగ్- 5 భాషల్లో స్ట్రీమింగ్

సరిగ్గా ఇలాంటి సామాజికాంశాన్ని నమ్ముకుని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఒక హై-వోల్టేజ్ సోషల్-క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ఆ ఓటీటీ సిరీస్ పేరే 'ఎగ్జామ్: ది సిస్టమ్ ఎక్స్‌పోజ్‌డ్'. జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు ఎ. సర్గుణం పర్యవేక్షణలో రూపొందిన ఎగ్జామ్ తమిళ ఒరిజినల్ ఓటీటీ సిరీస్.

దేశాన్ని ఉలిక్కిపడేలా చేసే స్కామ్ కథాంశంతో..

ఈ ఓటీటీ సిరీస్ ఎగ్జామ్ కథ మొత్తం ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. రహస్యమైన గతాన్ని దాచుకున్న ఆ యువతి, ప్రాంతీయ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ (గ్రూప్స్ పరీక్షలు) పేపర్ లీకేజీలకు పాల్పడే ఒక పెద్ద మాఫియా సామ్రాజ్యంలోకి అడుగుపెడుతుంది.

పరీక్ష వ్యవస్థను శాసిస్తున్న ముఠా

అమాయక విద్యార్థులను దోపిడీ చేస్తూ, పరీక్షా వ్యవస్థను శాసిస్తున్న ఆ ముఠా గుట్టును ఆమె ఎలా రట్టు చేసింది? ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న ప్రాణసంకట పరిస్థితులు ఏంటి? అనే అంశాలను దర్శకుడు అత్యంత ఉత్కంఠభరితంగా ఆవిష్కరించారు. పరీక్షల సమయంలో విద్యార్థులు అనుభవించే మానసిక ఒత్తిడిని, నెట్‌వర్క్ మోసాలను ఇందులో కళ్లకు కట్టారు.

స్టార్ కాస్ట్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్

ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఎగ్జామ్ ఓటీటీ రిలీజ్ అయింది. మే 15 నుంచి ఎగ్జామ్: ది సిస్టమ్ ఎక్స్‌పోజ్‌డ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతోపాటుగా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం వంటి 5 భాషల్లో ఎగ్జామ్ ఓటీటీ ప్రీమియర్ అవుతోంది.

టాప్ 3 ఓటీటీ ట్రెండింగ్‌లో

అయితే, ఓటీటీ రిలీజ్ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ ట్రెండింగ్‌లోకి వచ్చి దూసుకుపోతోంది ఎగ్జామ్: ది సిస్టమ్ ఎక్స్‌పోజ్‌డ్ సిరీస్. ఇక ఇవాళ (మే 19) అమెజాన్ ప్రైమ్ ఇండియన్ టాప్ 10 జాబితాలో 3వ స్థానంతో ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది ఎగ్జామ్: ది సిస్టమ్ ఎక్స్‌పోజ్‌డ్ వెబ్ సిరీస్. అంతేకాకుండా ఐఎమ్‌డీబీ నుంచి పదికి ఏకంగా 8.4 రేటింగ్ సొంతం చేసుకుని సత్తా చాటుతుంది ఎగ్జామ్ ఓటీటీ సిరీస్

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe