2025 ఏడాదికి వీడ్కోలు పలుకుతూ ప్రపంచమంతా కొత్త సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఘట్టమనేని వారింట పాత జ్ఞాపకాలు పలకరించాయి. మాజీ నటి, సూపర్ స్టార్ మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ 2025 ఏడాదికి సంబంధించిన అత్యంత మధురమైన క్షణాలను ఒక 'రీల్' రూపంలో సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ప్రియాంక చోప్రాతో నమ్రత చిల్ అవుట్!

ఈ వీడియోలో మహేశ్ బాబు, గౌతమ్, సితారలతో కూడిన ఫ్యామిలీ ఫోటోలతో పాటు కొన్ని అరుదైన చిత్రాలు అభిమానులను కట్టిపడేస్తున్నాయి. ఈ రీల్లో అందరినీ ఆకర్షించింది మాత్రం గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. మహేశ్ బాబు భారీ చిత్రం 'వారణాసి'లో ప్రియాంక నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే నమ్రత, ప్రియాంకల మధ్య మంచి స్నేహం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి సరదాగా దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. అలాగే, నమ్రత తన సోదరి శిల్పా శిరోద్కర్, దగ్గుబాటి రానా భార్య మిహీకా బజాజ్లతో దిగిన సెల్ఫీలు కూడా ఇందులో ఉన్నాయి.
శ్రీలంక వెకేషన్ నుంచి గణపతి పూజ వరకు..
శ్రీలంక వంటి విదేశీ విహారయాత్రలు, ఇంట్లో జరుపుకున్న వినాయక చవితి వేడుకలు, ఇటీవల జరుపుకున్న క్రిస్మస్ సెలబ్రేషన్స్.. ఇలా 2025 ఏడాది జరిగిన విశేషాలన్నీ ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మహేశ్ బాబు గారాల పట్టి సితారను ముద్దు పెట్టుకుంటున్న ఫోటోలు ఎంతో భావోద్వేగంగా ఉన్నాయి.
ఇదే సమయంలో తమ ముద్దుల కుక్క 'నోబు' మరణాన్ని గుర్తుచేసుకుంటూ నమ్రత పెట్టిన ఫోటో అభిమానుల కళ్లు చెమర్చేలా చేసింది. ఇలా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం సూపర్ స్టార్ ఫ్యామిలీ వెకేషన్కు వెళ్లింది. అందుకు మహేష్ బాబు ఫ్యామిలీ ఇప్పటికే హైదరాబాద్ను వీడింది.
సోమవారం ఎయిర్పోర్ట్లో మహేశ్ బాబు, నమ్రత, సితార, గౌతమ్ కెమెరాలకు చిక్కారు. ఎప్పటిలాగే మహేశ్ సింపుల్ లుక్లో కనిపించగా, తండ్రిని అనుకరిస్తూ సితార వేసుకున్న టీ-షర్ట్, జీన్స్, హ్యాట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది.
రాజమౌళి ‘వారణాసి’ అప్డేట్
{{/usCountry}}సోమవారం ఎయిర్పోర్ట్లో మహేశ్ బాబు, నమ్రత, సితార, గౌతమ్ కెమెరాలకు చిక్కారు. ఎప్పటిలాగే మహేశ్ సింపుల్ లుక్లో కనిపించగా, తండ్రిని అనుకరిస్తూ సితార వేసుకున్న టీ-షర్ట్, జీన్స్, హ్యాట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది.
రాజమౌళి ‘వారణాసి’ అప్డేట్
{{/usCountry}}ఇదిలా ఉంటే, సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వారణాసి’ (Varanasi) తో బిజీగా ఉన్నారు.
నవంబర్లో రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్గా జరిగిన ‘గ్లోబ్ట్రోటర్’ ఈవెంట్లో వారణాసి టైటిల్ను అధికారికంగా ప్రకటించారు. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు 1200 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం 2027 సంక్రాంతికి విడుదల కానుంది.