Naveen Polishetty In 5500 Cr Frame: ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో సూపర్ హిట్ హీరోగా పేరు తెచ్చుకుని, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవీన్ పొలిశెట్టి. ఆ తర్వాత వచ్చిన ‘జాతిరత్నాలు’, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి ‘స్టార్ ఎంటర్టైనర్’గా మారిపోయారు.
నవీన్ పోలిశెట్టి సర్ప్రైజ్

కేవలం వెండితెరపైనే కాదు, బయట కూడా ఎక్కడ కనిపించినా తనదైన కామెడీ టైమింగ్తో వంద శాతం వినోదాన్ని పంచడం నవీన్ ప్రత్యేకత. కొంతకాలంగా కొత్త సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నవీన్ పోలిశెట్టి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు.
తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన పాన్ ఇండియా డైరెక్టర్లతో కలిసి ఉన్న ఒక ఫన్నీ వీడియోను షేర్ చేసి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించారు నవీన్ పోలిశెట్టి.
సాధారణంగా స్టార్ హీరోలు పెద్ద దర్శకులతో ఫొటోలు దిగితేనే అదొక సంచలనం అవుతుంది.
డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు
అలాంటిది నవీన్ పొలిశెట్టి ఏకంగా భారతీయ చిత్ర పరిశ్రమను శాసిస్తున్న అగ్ర దర్శకులు, ప్రొడ్యూసర్లను ఒకే ఫ్రేమ్లోకి తెచ్చి, తన మార్క్ కామెడీతో ఆటపట్టించారు. తన జీవితంలోనే అత్యంత ఖరీదైన ఫ్రేమ్ ఇదంటూ నవీన్ పోలిశెట్టి ఈ వీడియోను పంచుకోవడం విశేషం.
రూ. 5,500 కోట్ల ఫ్రేమ్.. ఎవరెవరు ఉన్నారంటే?
ఈ వీడియోలో నవీన్ పొలిశెట్టి తన పక్కన ఉన్న సెలబ్రిటీల పేర్లు చెప్పకుండా, వారు బాక్సాఫీస్ వద్ద సాధించిన కలెక్షన్ల నంబర్లను చెప్తూ వినోదాన్ని పండించారు. మొదటగా రజనీకాంత్ ‘కూలీ’ సినిమా డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ను చూపిస్తూ ‘500 కోట్లు’ అని లెక్కేశారు.
ఆ వెంటనే ‘కాంతార’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో సంచలనం సృష్టించిన రిషబ్ శెట్టిని చూపిస్తూ ‘800 కోట్లు’ అన్నారు. అంతటితో ఆగకుండా, మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ ఎర్నేనిని ‘2 వేల కోట్ల నిర్మాత’ అని, పక్కనే ఉన్న క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ను ‘2 వేల కోట్ల దర్శకుడు’ అని అభివర్ణించారు నవీన్ పోలిశెట్టి.
నవ్వు ఆపుకోలేకపోయిన ప్రశాంత్ నీల్
{{/usCountry}}ఆ వెంటనే ‘కాంతార’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో సంచలనం సృష్టించిన రిషబ్ శెట్టిని చూపిస్తూ ‘800 కోట్లు’ అన్నారు. అంతటితో ఆగకుండా, మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ ఎర్నేనిని ‘2 వేల కోట్ల నిర్మాత’ అని, పక్కనే ఉన్న క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ను ‘2 వేల కోట్ల దర్శకుడు’ అని అభివర్ణించారు నవీన్ పోలిశెట్టి.
నవ్వు ఆపుకోలేకపోయిన ప్రశాంత్ నీల్
{{/usCountry}}నవీన్ పొలిశెట్టి ఒకదాని తర్వాత ఒకటి ఇలా వందల, వేల కోట్ల లెక్కలు చెబుతుండటంతో పక్కనే ఉన్న ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ నవ్వు ఆపుకోలేకపోయారు. కెమెరా వైపు చూడలేక వెనక్కి తిరిగేసి గట్టిగా నవ్వేశారు. ఈ క్రేజీ ఫ్రేమ్లో టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా కనిపించారు.
వీళ్లందరి బాక్సాఫీస్ స్టామినాను టోటల్ చేసి, ఇదంతా కలిపి ‘రూ. 5500 కోట్ల ఫ్రేమ్’ అని నవీన్ పంచ్ వేయడంతో అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ‘నవీన్ ఎంటర్టైన్మెంట్కు తిరుగులేదు’ అంటూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.
త్వరలోనే కొత్త సినిమా అప్డేట్
నవీన్ పొలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ సినిమాలో సంక్రాంతి బరిలో నిలిచి మంచి హిట్టే అందుకుంది. అయితే, ఇటీవల నవీన్ పోలిశెట్టికి జరిగిన ఒక చిన్న ప్రమాదం వల్ల కొంతకాలం షూటింగులకు బ్రేక్ పడింది. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చిన నవీన్, ఈ ఫన్నీ వీడియో ముగింపులో అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పారు.
"నా కొత్త సినిమా అప్డేట్ను చాలా త్వరలోనే మీ ముందుకు తెస్తాను" అని నవీన్ పొలిశెట్టి తన పోస్టులో స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ఈ రూ. 5,500 కోట్ల ఫ్రేమ్లోని దర్శకుల్లో ఎవరితోనైనా నవీన్ తదుపరి సినిమా ఉండనుందా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.