...
...
Next Story

Nenu OTT Today: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన నేను- శాపంగా మారే ఓపిక- బాస్, భర్త మధ్య నలిగే ఇల్లాలు- గుండె తరుక్కుపోయే సీన్లతో!

Nenu OTT Streaming Today Telugu: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు ఎమోషనల్ డ్రామా సినిమా నేను. ఫిదా ఫేమ్ శరణ్య ప్రదీప్ మెయిన్ లీడ్ రోల్ చేసిన ఈ సినిమా గుండె తరుక్కుపోయే సీన్లతో తెరకెక్కింది. తల్లిగా, భార్యగా, ఉద్యోగిగా ఓ ఇల్లాలు ఎలా నలిగిపోతుందో చూపించారు. ఇలాంటి నేను ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో చూద్దాం.

Published on: May 10, 2026, 10:09:03 IST
Advertisement

Nenu OTT Release Today: ప్రతి వారం ఓటీటీల్లోకి సరికొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటాయి. వాటిలో తెలుగు ఓటీటీ రిలీజ్ అయిన తెలుగు సినిమాలు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఇటీవల కాలంలో అచ్చమైన తెలుగు కథలతో సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇవాళ ఓటీటీలోకి సరికొత్త తెలుగు ఫ్యామిలీ డ్రామా సినిమా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

ముగింపు లేని బాధ్యతల ప్రయాణం

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన నేను- శాపంగా మారే ఓపిక- బాస్, భర్త మధ్య నలిగే ఇల్లాలు- గుండె తరుక్కుపోయే సీన్లతో!
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన నేను- శాపంగా మారే ఓపిక- బాస్, భర్త మధ్య నలిగే ఇల్లాలు- గుండె తరుక్కుపోయే సీన్లతో!

ప్రతి ఇంట్లో ఒక ఇల్లాలు ఉంటుంది.. ఆమెకు అందరి ఇష్టాఇష్టాలు తెలుసు కానీ, ఆమె ఇష్టం ఏంటో మాత్రం ఎవరికీ అవసరం లేదు. సరిగ్గా ఇదే పాయింట్‌తో తెరకెక్కిన తెలుగు చిత్రమే 'నేను'. తెలుగు నటి శరణ్య ప్రదీప్ టైటిల్ రోల్ పోషించిన నేను ఓటీటీలోకి ఇవాళ (మే 10) వచ్చేసింది.

కేవలం ఒక భార్యగా, ఒక తల్లిగా మాత్రమే కాకుండా, ఇంటి బయట ఆఫీసు పనులను కూడా చక్కబెడుతూ.. ఆ క్రమంలో తన అస్తిత్వాన్ని వెతుక్కునే ఒక మహిళ ప్రయాణమే ఈ కథ. భార్య ఓపిక్ శాపంగా మారి భర్త, బాస్ మధ్య నలిగే ఇల్లాలి కథగా ఈ సినిమాను రూపొందించారు. గుండె తరుక్కుపోయే సన్నివేశాలతో ప్రతి మహిళ గురించి ఆలోచింపజేసేలా నేను మూవీ సాగుతుంది.

శరణ్య ప్రదీప్ నటన - చిత్రానికి వెన్నెముక

'ఫిదా' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న శరణ్య ప్రదీప్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, భామాకలాపం 2 వంటి సినిమాలతో ఆకట్టుకుంది. నటిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న శరణ్య ప్రదీప్ నేను మూవీలో తన రియల్ నేమ్ అయిన శరణ్య పాత్రలో జీవించేసింది.

కుటుంబ సభ్యుల అవసరాలు, పని ఒత్తిడి, సమాజం విధించే కట్టుబాట్లు.. వీటన్నింటి మధ్య ఓపికతో నలిగిపోయే సగటు మహిళ భావోద్వేగాలను శరణ్య ప్రదీప్ అద్భుతంగా పండించారు. అరుణాచల మహేష్, శ్రీనివాస్ నాయుడు, ఆర్కే నాయుడు వంటి నటీనటులు తమ పరిధి మేరకు చక్కగా నటించారు. కుషాలిని పులప, జ్యోతి స్వరూప్ పాత్రలు కూడా కథలో కీలక మలుపులుగా నిలుస్తాయి.

దర్శకత్వ ప్రతిభ, సాంకేతిక అంశాలు

శశాంక్ తిరుపతి అందించిన సంగీతం సన్నివేశాలలోని గాఢతను పెంచింది. ఎడిటింగ్ విషయంలో మహేష్ వర్మ పనితీరు మెప్పించింది. "ఒక మహిళ అందరికీ అన్నీ చేస్తుంది.. కానీ ఆమెకు ఏం కావాలి?" అనే చిన్న ప్రశ్న చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.

ఇల్లాలు తన వ్యక్తిగత గుర్తింపును కోల్పోయి యంత్రంలా మారిపోతున్న వైనాన్ని ఈ చిత్రం ప్రశ్నిస్తుంది. రమేష్ పుప్పాల, నిహార్ కపూర్ నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచాయి. ముఖ్యంగా నేటి కాలంలో వర్కింగ్ ఉమెన్ ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణను ఇందులో చాలా లోతుగా చూపించి ఆలోచింపజేసేలా చేశారు.

మహిళకు అంకితం ఇచ్చేలా

ప్రతి మహిళకు అంకితం ఇచ్చేలా మదర్స్ డే (మే 10) సందర్భంగా ఇవాళ నేను ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ ఈటీవీ విన్‌లో నేను ఓటీటీ రిలీజ్ అయింది. ప్రతి వారం వచ్చే ఈటీవీ విన్ ఓటీటీ వీక్లీ సిరీస్ కథా సుధలో భాగంగా నేటి నుంచి నేను ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఈటీవీ విన్ ఓటీటీ

ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోని మహిళల పట్ల కలిగి ఉండాల్సిన గౌరవాన్ని, అవగాహనను, వారి అవసరాలను గుర్తు చేసే ఎమోషనల్ డ్రామా సినిమా నేను ఈటీవీ విన్ ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe