నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 15 ఎపిసోడ్ లో గుడిలో పెళ్లి ఏర్పాట్లు చేసేస్తాడు జల్ రాజ్. పెళ్లి బట్టలు డబుల్ అద్దెకు ఇచ్చారని రాజ్ తల్లి సరోజా అంటుంది. అప్పుడే శ్రుతి వస్తుంది. నాకు ఎవరూ లేరని శ్రుతికి చెప్పా కదా, నువ్వు నా పక్కన ఉండటం సేఫ్ కాదని తల్లిని పంపిస్తాడు రాజ్.
కొడుకులను కలిపేలా

శ్రుతిని తీసుకొచ్చిన డబ్బును తీసుకుంటాడు రాజ్. ఆ వెంటనే పక్కన ఉన్న తల్లి దగ్గరకు వెళ్లి చేతుల్లో రూ.2 లక్షలు పెడతాడు రాజ్. మరోవైపు విరాట్, క్రాంతిలను కలిపేందుకు రఘురాం ఐడియా వేస్తాడు. పాత జ్ణాపకాలు గుర్తు చేయాలని అనుకుంటాడు. పాత ఫొటో ఆల్బమ్స్ కావాలని జగదీశ్వరిని అడుగుతాడు. విరాట్, క్రాంతిని రమ్మని కామాక్షికి చెప్తాడు రఘురాం.
శాలిని ప్లాన్
చంద్రకళను బయటకు పంపించాలని శాలిని కావాలనే కిచెన్ లోకి వెళ్లి పనసపొట్టు కూర కింద పడేస్తుంది. పనసకాయలు తెచ్చేందుకు చంద్ర మార్కెట్ కు వెళ్తుంది. విరాట్, చంద్ర రాగానే పైన ఉన్న సూట్ కేస్ ఇవ్వమంటాడు రఘురాం. అన్నదమ్ముల స్పెషల్ ఫొటోరా ఇది. ఎంతో సరదాగా ఉండేవాళ్లు. ఈ ఫొటో చూస్తే అవన్నీ కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ఇలా అన్నదమ్ముల బంధం గురించి మాట్లాడుకుంటారు. అలాంటి రోజులు మళ్లీ వస్తే బాగుండని విరాట్ వెళ్లిపోతాడు.
శ్రుతి పెళ్లి
మరోవైపు గొప్పంటి అల్లుడిని కాబోతున్నానని సంబరపడిపోతుంటాడు రాజ్. కానీ శ్రుతి భయపడుతుంది. అమ్మకు తెలియకుండా పెళ్లి చేసుకుంటున్నందుకు మనసులో ఏదో గాబరాగా ఉందని శ్రుతి చెప్తుంది. ఇంతదాకా వచ్చాక ఆలోచించి ఆగడం సరికాదు. నువ్వు కోరుకున్న లైఫ్ దక్కాలంటే కొన్ని వదిలేసుకోవాలని రాజ్ చెప్తాడు. ఇప్పుడు అమ్మతో మాట్లాడతానని శ్రుతి అంటుంది. కానీ ఫోన్ మర్చిపోయి వస్తుంది. పెళ్లి అయితే మీ అమ్మ మనల్ని యాక్సెప్ట్ చేస్తుందని పీటల మీద కూర్చోబెడతాడు రాజ్.
క్రాంతిలో ద్వేషం
అక్కడ సరోజాను చూసి ఎందుకు దాక్కుంటున్నావ్ ఇక్కడికి రా అని పిలుస్తుంది శ్రుతి. ఆమెను ఎక్కడో చూశా ఎవరు? అని అడుగుతుంది శ్రుతి. అమ్మ, అమ్మ లాంటిది. కొత్త వంట మనిషి అని రాజ్ కవర్ చేస్తాడు. ఈ పెళ్లిని శాలిని మనిషి మధు వీడియో తీస్తాడు. మరోవైపు క్రాంతి ఎక్కడ మారిపోతాడో అని శాలిని కంగారు పెడుతుంది. విరాట్ పై ద్వేషాన్ని నూరి పోస్తూనే ఉంటుంది. ఈ మాటలు బయట ఉన్న విరాట్ వింటాడు.
{{/usCountry}}అక్కడ సరోజాను చూసి ఎందుకు దాక్కుంటున్నావ్ ఇక్కడికి రా అని పిలుస్తుంది శ్రుతి. ఆమెను ఎక్కడో చూశా ఎవరు? అని అడుగుతుంది శ్రుతి. అమ్మ, అమ్మ లాంటిది. కొత్త వంట మనిషి అని రాజ్ కవర్ చేస్తాడు. ఈ పెళ్లిని శాలిని మనిషి మధు వీడియో తీస్తాడు. మరోవైపు క్రాంతి ఎక్కడ మారిపోతాడో అని శాలిని కంగారు పెడుతుంది. విరాట్ పై ద్వేషాన్ని నూరి పోస్తూనే ఉంటుంది. ఈ మాటలు బయట ఉన్న విరాట్ వింటాడు.
{{/usCountry}}చంద్ర వదిన వచ్చాకే అన్నయ్య మారిపోయాడని క్రాంతి అంటాడు. నువ్వు కూడా ముందు వదిన భజన చేశావు కదా అని క్రాంతితో శాలిని అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.