నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 30 ఎపిసోడ్ లో ముంబయి ప్రాజెక్ట్ ఓకే కావడంతో క్రాంతిని తెగ పొగిడేస్తాడు విరాట్. చంద్ర కంగ్రాట్స్ చెప్తే క్రాంతి పట్టించుకోడు. క్రాంతికి స్వీట్ తినిపిస్తాడు విరాట్. రఘురాం కూడా వచ్చి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అమ్మానాన్నలకు స్వీట్ తినిపిస్తాడు క్రాంతి. విరాట్ కు కూడా ఇస్తాడు. అదంతా చూసి శాలినికి మండిపోతుంది. క్రాంతి మీటింగ్ కు ఆఫీస్ వెళ్లాలన్నావు కదా అని గుర్తు చేస్తుంది శాలిని.
రాజ్ ఇల్లు

చిన్న గుడిసె లాంటి రాజ్ ఇళ్లు చూసి శ్రుతి, కామాక్షి, శ్యామల షాక్ అవుతారు. రాజ్ పీక పట్టుకునేంత కోపం వస్తుంది శ్రుతికి. ఇంటిని చూడగానే నీ కూతురు కరెంట్ షాక్ తగిలిన కాకిలా అయిపోయిందని కామాక్షితో శ్యామల అంటుంది. ఎవరి తాహతుకు తగ్గట్లు వాళ్ల ఇల్లు ఉంటుంది. లేదంటే పుట్టింటి కట్నంగా పెద్ద ఇల్లు రాసి ఇవ్వండని సరోజా అంటుంది. పోలీస్ స్టేషన్లో కంప్లెయింట్ ఇస్తానని శ్రుతి అంటుంది.
ఇల్లు లోపలి చూసి శ్రుతి, కామాక్షి, శ్యామల మరింత కంగారు పడతారు. టీవీ కూడా లేదా అనుకుంటారు. శ్యామల కూర్చోగానే కుర్చీ విరిగి కిందపడుతుంది. మన గది చూపిస్తానని శ్రుతిని లోపలికి తీసుకెళ్తాడు రాజ్. భోజనం చేయగానే వెళ్లిపోతానని శ్యామల అంటే, కామాక్షి రిక్వెస్ట్ చేస్తుంది.
చంద్ర హ్యాపీ
క్రాంతి ఎప్పట్లా నీలా మాట్లాడుతున్నాడు బావ అని విరాట్ తో హ్యాపీగా చెప్తుంది చంద్రకళ. మన టార్గెట్ ఫస్ట్ టైమ్ రీచ్ అయ్యామని చెప్తుంది. నీ విషయంలో ఎలా రియాక్టయ్యాడో తలుచుకుంటే బాధగా ఉంది. శాలిని కుట్రల గురించి తెలిస్తే కానీ నిన్ను క్రాంతి క్షమించలేడని విరాట్ అంటాడు. మనం సాధించిన ఈ సక్సెస్ కు ట్రీట్ ఇవ్వాలి బావ అని అడిగిన చంద్ర విరాట్ ను హగ్ చేసుకుంటుంది.
విరాట్ సంతకం
శ్యామల పరుగెత్తుకుంటూ వస్తుంది. విరాట్, క్రాంతి ఎప్పటిలాగే మాట్లాడుకుంటున్నారని వదిన చెప్పేసరికి పరుగెత్తుకుంటూ వచ్చానని శ్యామల తెగ సంబరపడిపోతుంది. మీరు ఇలాగే ఎప్పటికీ కలిసి ఉండాలని శ్యామల చెప్తుంది. అన్నయ్య మీటింగ్ కూడా సక్సెస్ ఫుల్ గా జరిగింది. త్వరలోనే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని క్రాంతి ఆఫీస్ నుంచి రాగానే చెప్తాడు. షూరిటీగా విరాట్ సైన్ చేస్తానంటాడు.
కష్టం విలువ తెలిసేలా
{{/usCountry}}శ్యామల పరుగెత్తుకుంటూ వస్తుంది. విరాట్, క్రాంతి ఎప్పటిలాగే మాట్లాడుకుంటున్నారని వదిన చెప్పేసరికి పరుగెత్తుకుంటూ వచ్చానని శ్యామల తెగ సంబరపడిపోతుంది. మీరు ఇలాగే ఎప్పటికీ కలిసి ఉండాలని శ్యామల చెప్తుంది. అన్నయ్య మీటింగ్ కూడా సక్సెస్ ఫుల్ గా జరిగింది. త్వరలోనే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని క్రాంతి ఆఫీస్ నుంచి రాగానే చెప్తాడు. షూరిటీగా విరాట్ సైన్ చేస్తానంటాడు.
కష్టం విలువ తెలిసేలా
{{/usCountry}}చేపల బుట్టలు, చిరిగిన బట్టలు. ఇక్కడ పూటకో రకం తిన్న శ్రుతి, అక్కడ పూట గడవడానికి ఇబ్బంది పడేలా ఉందని శ్యామల చెప్తుంది. శ్రుతి తప్పటడుగు వేసి ఉండొచ్చు కానీ శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు. వాళ్లు ప్రేమగా ఉంటే మనం అక్కున చేర్చుకుందామని జగదీశ్వరి అంటుంది. ఆ అబ్బాయికి కష్టం విలువ తెలిసేలా చేయాలని రఘురాం అంటాడు.
ఈ దోమలు, వాసన పడట్లేదమ్మా వెళ్లిపోదామని శ్రుతి అంటుంది. మన ప్రేమ, ఆప్యాయత తెలిసేలా చేద్దామని తల్లితో రాజ్ అంటాడు. వాడు అప్పుల్లో లక్షాధికారే అని అప్పులోళ్లు వస్తారు. రెండు వేలు చేతిలో పెడుతుంది కామాక్షి, వాడు ఇవ్వాల్సింది రెండు లక్షలు అని అప్పులోళ్లు అంటారు. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.