నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 2 ఎపిసోడ్ లో.. నిద్రపోతున్న శ్రుతిని రాజ్ రొమాంటిక్ గా చూస్తాడు. అయ్య బాబోయ్ టెంప్ట్ అయిపోతున్నానని రాజ్ అనుకుంటాడు. అప్పుడే నిద్రలో ఉన్న శ్రుతి తన చేయి, కాలును రాజ్ పై వేస్తుంది. ఇంత బరువు ఉన్నావేంటీ? అని రాజ్ పక్కకు నెట్టేస్తాడు.
విరాట్ కు ముద్దు

రేయ్ జల్ రాజ్ నా లైఫ్ ని గుడిసెలోకి తెచ్చావ్ కదా రా. లగ్జరీ కార్లో తిరిగే నన్ను చేపల కంపులో పడుకోబెడతావా? అని నిద్రలో శ్రుతి కలవరిస్తుంది. దీంతో అక్కడి నుంచి రాజ్ పారిపోతాడు. మరోవైపు చంద్రకళ పొద్దున లేచి విరాట్ కు ముద్దు పెట్టి శోభనం గది నుంచి బయటకు వెళ్తుంది. శ్యామల, కామాక్షి కాఫీ తాగుతారు. ఇక అన్ని పనులు మనమే చేయాలని కామాక్షి అంటుంది.
చంద్ర సిగ్గు
చంద్రకళ బయట తులసి కోటకు పూజ చేస్తుంది. అది చూసి జగదీశ్వరి, శ్యామల, కామాక్షి వెళ్తారు. నువ్వు అప్పుడే నిద్ర లేచావా? అని జగదీశ్వరి అడుగుతుంది. నేను ఈ ఇంటి కోడలిని, నా బాధ్యతలు మర్చిపోనని చంద్ర చెప్తుంది. వాడు రాత్రంతా నిద్ర పోనిచ్చాడా లేదా? అని శ్యామల అడిగితే, చంద్ర సిగ్గుపడుతుంది. విరాట్, చంద్ర ఫస్ట్ నైట్ ఆపలేకపోయినందుకు శాలిని తెగ ఫీల్ అవుతుంది.
గుడిలో యాగం
హనీమూన్ కు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారని చంద్రను శ్యామల అడుగుతుంది. మేం ఏం ప్లాన్ చేసుకోలేదు. కొత్త వెంచర్ పనులు స్టార్ట్ అయ్యాయి. ఆయన బిజీగా ఉన్నారు. ఆ వెంచర్ ను సక్సెస్ చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లమని చంద్ర చెప్తుంది. గుడిలో యాగం చేయిద్దామని రఘురాం అంటాడు. విరాట్, క్రాంతికి వీలు కాదని చెప్పడంతో మిగతా ఫ్యామిలీ అంతా గుడికి వెళ్తారు.
రాజ్ డ్రామా
గుడిలోనే రాజ్ ఉంటాడు. రఘురాం ఫ్యామిలీ సింపతీ కొట్టేసేలా డ్రామా ప్లాన్ చేస్తాడు. క్రాంతి, శాలిని కాపురం నిలబెట్టమని దేవుణ్ని చంద్ర కోరుకుంటుంది. పగ తీర్చుకోవడానికి మరో అవకాశం ఇచ్చావని దేవుణ్ని శాలిని స్మరించుకుంటుంది. గుడి నుంచి బయటకు వస్తూ కూలీవాడిలా యాక్ట్ చేస్తున్న జల్ రాజ్ ను రఘురాం ఫ్యామిలీ చూస్తుంది. వాళ్లు చూస్తున్నారని రాజ్ యాక్టింగ్ చేస్తాడు.
{{/usCountry}}గుడిలోనే రాజ్ ఉంటాడు. రఘురాం ఫ్యామిలీ సింపతీ కొట్టేసేలా డ్రామా ప్లాన్ చేస్తాడు. క్రాంతి, శాలిని కాపురం నిలబెట్టమని దేవుణ్ని చంద్ర కోరుకుంటుంది. పగ తీర్చుకోవడానికి మరో అవకాశం ఇచ్చావని దేవుణ్ని శాలిని స్మరించుకుంటుంది. గుడి నుంచి బయటకు వస్తూ కూలీవాడిలా యాక్ట్ చేస్తున్న జల్ రాజ్ ను రఘురాం ఫ్యామిలీ చూస్తుంది. వాళ్లు చూస్తున్నారని రాజ్ యాక్టింగ్ చేస్తాడు.
{{/usCountry}}చేతకానప్పుడు ఇలాంటి పనులు ఎందుకు అని డ్రామా ప్రకారం రాజ్ ను మరో వ్యక్తి తిడతాడు. ఇలాంటి వాడిని ఇంటి అల్లుడిగా ఎలా చేసుకున్నారని రఘురాంను ప్రశ్నిస్తాడు. నీకు చేపల బిజినెస్ ఉంది కదా, మళ్లీ ఈ పని ఎందుకు చేస్తున్నావని రాజ్ ను రఘురాం అడుగుతాడు. ఆ బిజినెస్ తో వచ్చే డబ్బులు శ్రుతి సోకులకే సరిపోతుందని రాజ్ అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.