బాక్సాఫీస్ వద్ద పోటీ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. కానీ, ఒక్కోసారి అది ఏకపక్షంగా మారిపోతుంది. అది మరో సినిమాపై ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పరిస్థితి ఇలాగే కనిపిస్తోంది.

రణ్వీర్ సింగ్ నటించిన ‘ధరంధర్ 2’ సృష్టించిన సునామీలో పవన్ కల్యాణ్ సినిమా వసూళ్లు కొట్టుకుపోతున్నాయి. బాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధాటికి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు.
ఐదో రోజు దారుణంగా పడిపోయిన వసూళ్లు
ట్రేడ్ విశ్లేషకుల సమాచారం ప్రకారం, సోమవారం (మార్చి 23) (ఐదో రోజు) ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇండియాలో కేవలం రూ. 1.96 కోట్ల నెట్ వసూళ్లను మాత్రమే సాధించింది. విడుదలైన తర్వాత ఈ సినిమాకు ఇదే అత్యల్ప సింగిల్ డే కలెక్షన్. దీంతో ఇండియాలో ఐదు రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు రూ. 62.26 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి.
ఫ్యాన్స్ అభిప్రాయం
అయితే, ధురంధర్ 2 పోటీ ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ మేనియా ఏమాత్రం తగ్గట్లేదని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. అందుకే ఐదో రోజున కూడా సుమారుగా రూ. 2 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయని చెబుతున్నారు. ఒకరకంగా చూస్తే ధురంధర్ 2 హవా గట్టిగా సాగుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ క్రేజ్ కూడా ఏమాత్రం తక్కువగా లేదని తెలుస్తోంది.
మరోవైపు, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధరంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద ప్రళయం సృష్టిస్తోంది. సోమవారం కూడా ఈ చిత్రం ఏకంగా రూ. 65 కోట్లు రాబట్టి, మొత్తం రూ. 519 కోట్ల మార్కును దాటేసింది. తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ హిందీ చిత్రం హౌస్ఫుల్ బోర్డులతో దర్శనమిస్తుండటం గమనార్హం. కేజీఎఫ్ 2, బాహుబలి 2 రికార్డులను కూడా ధురంధర్ 2 అధిగమించడం విశేషం.
డైరెక్టర్ హరీష్ శంకర్ ఏమన్నారంటే?
{{/usCountry}}మరోవైపు, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధరంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద ప్రళయం సృష్టిస్తోంది. సోమవారం కూడా ఈ చిత్రం ఏకంగా రూ. 65 కోట్లు రాబట్టి, మొత్తం రూ. 519 కోట్ల మార్కును దాటేసింది. తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ హిందీ చిత్రం హౌస్ఫుల్ బోర్డులతో దర్శనమిస్తుండటం గమనార్హం. కేజీఎఫ్ 2, బాహుబలి 2 రికార్డులను కూడా ధురంధర్ 2 అధిగమించడం విశేషం.
డైరెక్టర్ హరీష్ శంకర్ ఏమన్నారంటే?
{{/usCountry}}ఈ భారీ పోటీ గురించి దర్శకుడు హరీష్ శంకర్ గతంలోనే తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. "పెద్ద సినిమాల మధ్య పోటీ అనేది కేవలం నా చేతుల్లో ఉన్న నిర్ణయం కాదు. పవన్ సార్తో చాలా కాలం తర్వాత సినిమా చేస్తున్నాను, ఇలాంటి సమయంలో మరో పెద్ద చిత్రంతో పోటీ పడటం కాస్త ఆందోళన కలిగించే విషయమే. అయితే సంక్రాంతి లేదా సమ్మర్ సీజన్లలో రెండు మూడు పెద్ద సినిమాలు ఆడేంత స్పేస్ మార్కెట్లో ఉంటుందని నేను నమ్ముతున్నాను" అని ఆయన పేర్కొన్నారు.
సినిమా నేపథ్యం
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’, 2016లో వచ్చిన విజయ్ ‘తేరి’ చిత్రానికి రీమేక్ అని టాక్ నడుస్తోంది. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్-హరీష్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్గా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్, థమన్ సంగీతాన్ని అందించారు. అయితే రణ్వీర్ సింగ్ 'ధరంధర్ 2' ధాటికి ఉస్తాద్ భగత్ సింగ్ పుంజుకుంటుందో లేదో చూడాలి.