సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్పై బట్టలరామస్వామి బయోపిక్, కాఫీ విత్ ఏ కిల్లర్, సోలో బాయ్ సినిమాలను నిర్మించారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్ సెవెన్ హిల్స్ సతీష్. రీసెంట్గా అక్టోబర్ 23న బర్త్ డే వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా తాను దర్శకుడిగా నూతన ప్రయాణం మొదలుపెట్టినట్లు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సతీష్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
డైరెక్టర్గా కొత్త వాళ్లతో

"నేను నిర్మించిన మూడు సినిమాలు కూడా కొత్త వాళ్లతో చేశాను. డైరెక్టర్గా కూడా కొత్తవాళ్లతో చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కొత్తవాళ్లతో చేస్తే డేట్స్ ఇబ్బంది ఉండదు. హీరో ఎవరు ఓకే అయినా చేస్తా" అని నిర్మాత సతీష్ అన్నారు.
పాన్ ఇండియా సినిమాకు సిద్ధం
"వేరే ఏ భాష నుంచి వచ్చిన సినిమా అయినా బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఇక మనం చేసే మంచి సినిమాను ఇంకెంతగా ఆదరిస్తారో అందరికీ తెలిసిందే. రివ్యూలు జెన్యూన్గా ఇస్తే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. డైరెక్టర్గా నేను ఏంటనేది నిరూపించుకుంటే తర్వాత పాన్ ఇండియా సినిమా చేయడానికి సిద్ధం" అని సెవెన్ హిల్స్ సతీష్ తెలిపారు.
కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్
"లిటిల్ హార్ట్స్ లాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తే దర్శకులకు మంచి గుర్తింపు ఉంటుంది. అలాంటి సినిమా తీసి దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది. నా ఫేవరెట్ హీరో నాని. ఆయనతో సినిమా చేయాలని ఉంది. ముందుగా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా కొన్ని చిత్రాలకు పని చేశాను. ఆ తర్వాత డబ్బు సంపాదించుకుని వద్దామని రియల్ ఎస్టేట్ బిజినెస్లో కొంత డబ్బులు సంపాదించి, ఆ తర్వాత నిర్మాతగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాను" అని సతీష్ అన్నారు.
టాప్ డైరెక్టర్స్ మంచి స్నేహితులు
"సాధారణంగా ఇండస్ట్రీలో ఎత్తుపల్లాలు ఉంటాయని నాకు తెలుసు. ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలని ఆశయంతో నిర్మాతగా వచ్చాను. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది టాప్ డైరెక్టర్స్ వెంకీ అట్లూరి, సాగర్ చంద్ర, సంపత్ నంది, బలగం వేణు వంటి వారు నాకు మంచి స్నేహితులు" అని సతీష్ పేర్కొన్నారు.
నానితో కూడా కలిసి
{{/usCountry}}"సాధారణంగా ఇండస్ట్రీలో ఎత్తుపల్లాలు ఉంటాయని నాకు తెలుసు. ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలని ఆశయంతో నిర్మాతగా వచ్చాను. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది టాప్ డైరెక్టర్స్ వెంకీ అట్లూరి, సాగర్ చంద్ర, సంపత్ నంది, బలగం వేణు వంటి వారు నాకు మంచి స్నేహితులు" అని సతీష్ పేర్కొన్నారు.
నానితో కూడా కలిసి
{{/usCountry}}"అలాగే నేను సురేష్ ప్రొడక్షన్స్ ఇంకా వేరే ప్రొడక్షన్స్లో కూడా పనిచేశాను. ఆ సమయంలో నందినీ రెడ్డి, మచ్చ రవి, నేచురల్ స్టార్ నానితో కూడా కలిసి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను" అని దర్శకుడిగా మారుతున్న ప్రొడ్యూసర్ సెవెన్ హిల్స్ సతీష్ వెల్లడించారు.
అలాంటి జాగ్రత్తలే తీసుకుని
"ఎన్నో వేలమంది, లక్షలమంది చూసి ఆదరించే సినిమాను.. వారు సంతృప్తి పరిచే విధంగా ఉండాలంటే ముందు కథ సెలెక్ట్ చేసుకునే విధానంలో ఎంతో జాగ్రత్త తీసుకోవాలి. నేను అటువంటి జాగ్రత్తలే తీసుకుని సినిమాలు తీస్తున్నాను. అలాగే సినిమాలు చేయడానికి ఇష్టం కాదు, పిచ్చి ఉండాలి. నాకు సినిమాలు అంటే అటువంటి పిచ్చే ఉంది. అందుకే సెలెక్టెడ్గానే సినిమాలు చేస్తున్నాను" అని చెప్పుకొచ్చారు నిర్మాత సతీష్.