ఓటీటీలో తెలుగు సిరీస్ వారం రోజుల్లోనే ఏకంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించి దూసుకుపోతోంది. ఈ సిరీసే డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు. ఈ ఓటీటీ సిరీస్లో రాజీవ్ కనకాల, ఉదయ భాను, వాసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రలు పోషించారు.
జీ5 ఓటీటీ తెలుగు నిర్మాణం

ఈ వెబ్ సిరీస్ను జీ5 ఓటీటీ తెలుగు నిర్మించింది. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ తరువాత సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్కి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు.
ఫిబ్రవరి 27 నుంచి జీ5లో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ రిలీజ్ అయిన వారం రోజుల్లోనే వంద మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ సాధించిన ఈ సిరీస్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ క్రమంలో గురువారం (మార్చి 5) నాడు ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ టీం బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ను నిర్వహించింది.
100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ అంటే
ఈ కార్యక్రమంలో రాజీవ్ కనకాల మాట్లాడుతూ .. "డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ఓటీటీ సిరీస్లో ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు. వంద మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. అందరి ఎఫర్ట్తోనే ఇదంతా సాధ్యమైంది" అని అన్నారు.
"‘రెక్కీ’, ‘విరాటపాలెం’ టైంలో శ్రీరామ్కి నేను ఎందుకు గుర్తు రాలేదో నాకు తెలీదు. కానీ, ఈ ప్రసాద్ రావు పాత్రను ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ముందు నుంచీ శ్రీరామ్ ఈ సిరీస్ విజయం పట్ల నమ్మకంగా ఉండేవారు" అని నటుడు రాజీవ్ కనకాల తెలిపారు.
ఎంతో డైనమిక్గా
{{/usCountry}}"‘రెక్కీ’, ‘విరాటపాలెం’ టైంలో శ్రీరామ్కి నేను ఎందుకు గుర్తు రాలేదో నాకు తెలీదు. కానీ, ఈ ప్రసాద్ రావు పాత్రను ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ముందు నుంచీ శ్రీరామ్ ఈ సిరీస్ విజయం పట్ల నమ్మకంగా ఉండేవారు" అని నటుడు రాజీవ్ కనకాల తెలిపారు.
ఎంతో డైనమిక్గా
{{/usCountry}}"రెబెకా పాత్రలో ఉదయభాను ఎలా ఉంటారో అని అనుకున్నాను. కానీ, ఆమె ఎంతో డైనమిక్గా, పవర్ ఫుల్గా అనిపించారు. ఈ ఓటీటీ సిరీస్ చూసిన వారంతా కూడా కృష్ణ గారు రాసిన కథ, తీసిన విధానం గురించి చాలా గొప్పగా చెబుతున్నారు. మా అందరికీ ఇంత పేరు తీసుకు వచ్చేలా సిరీస్ను తీసిన కృష్ణ గారికి థాంక్స్" అని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.
"సిద్దు, కిరణ్మయి, శ్వేత ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డారు. ఇలాంటి మంచి సిరీస్లో భాగమవ్వడం నా అదృష్టం. మహేష్ మా అందరినీ చక్కగా చూపించారు. ఈ సిరీస్ను ప్రతీ ఒక్కరూ చూడాలి. సిరీస్ను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియెన్స్కి థాంక్స్" అని టాలీవుడ్ యాక్టర్ రాజీవ్ కనకాల తన స్పీచ్ ముగించారు.
కమ్యూనికేషన్ గ్యాప్ చూపేలా
నిర్మాత శ్రీరామ్ వెంకట్ మాట్లాడుతూ .. "‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ని ప్రతీ ఒక్కరూ చూడాలి. ప్రస్తుత తరంలో పిల్లలు, తల్లిదండ్రుల మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ను చూపేలా మా దర్శకుడు కృష్ణ మంచి కథను తీసుకు వచ్చారు. జీ, కృష్ణ గారు, నేను కలిస్తేనే ఈ సక్సెస్ వచ్చింది. ఈ విజయంలో అందరి పాత్ర ఉంది" అని అన్నారు.
"ఇందులోని ప్రతీ పాత్రకు మంచి పేరు వస్తుందని ముందే చెప్పాను. అను మేడం గారు నాకు ఈ కెరీర్ను ఇచ్చారు. ఆమె గురించి ఒకనాడు నేను కచ్చితంగా మాట్లాడతాను. సిద్దు, కిరణ్మయి, శ్వేత గారు మాకెంతో సపోర్ట్గా ఉంటారు. మా ఓటీటీ సిరీస్ను చూసి ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్" అని ఓటీటీ సిరీస్ ప్రొడ్యూసర్ శ్రీరామ్ వెంకట్ తెలిపారు.