బాలీవుడ్ ప్రముఖ కమెడియన్ రాజ్పాల్ యాదవ్ జైలు నుంచి విడుదలయ్యారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చొరవ తీసుకుని కమెడియన్ రాజ్పాల్ యాదవ్ బకాయిలను తీర్చారని, అందుకే రాజ్పాల్ బయటకు వచ్చారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
ఆయన ఇంకా జైలులోనే ఉన్నారు

అయితే, ఈ వార్తలపై రాజ్పాల్ యాదవ్ భార్య రాధ యాదవ్ ఎట్టకేలకు స్పందిస్తూ అసలు విషయాన్ని వెల్లడించారు. రాజ్పాల్ యాదవ్ విడుదలపై వస్తున్న పుకార్లను ఆయన భార్య రాధ యాదవ్ ఖండించారు.
"ప్రస్తుతానికి ఆయన (రాజ్పాల్ యాదవ్) తీహార్ జైలులోనే ఉన్నారు. విడుదలయ్యారన్న వార్తల్లో వాస్తవం లేదు. బెయిల్ పిటిషన్పై సోమవారం (ఫిబ్రవరి 16) విచారణ జరగనుంది" అని రాధ యాదవ్ బాంబే టైమ్స్తో పేర్కొన్నారు. జైలులో ఆయన ఆరోగ్యం బాగుందని, ఈ కష్ట సమయంలో సినీ పరిశ్రమ, అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు తాము కృతజ్ఞులమని ఆమె తెలిపారు.
సల్మాన్ ఖాన్ వీడియో వెనుక అసలు కథ!
రాజ్పాల్ యాదవ్ జైలు నుంచి విడుదలయ్యారనే భ్రమ కలిగించడానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోనే ప్రధాన కారణం. ఆ వీడియోలో రాజ్పాల్ యాదవ్ మీడియా ముందు మాట్లాడుతూ.. "సల్మాన్ భాయ్ నాకు అన్నలాంటి వారు. ఆయనతో కలిసి కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నాకు చాలా ఉపశమనంగా అనిపిస్తోంది" అని వ్యాఖ్యానించారు.
అయితే, ఈ వీడియోకు ప్రస్తుత కేసుకు ఎలాంటి సంబంధం లేదని తాజాగా తేలింది. అది పాత వీడియో అని, ఎవరో కావాలని ఇప్పుడు దానిని వైరల్ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టమైంది. సల్మాన్ ఖాన్ రాజ్పాల్ బకాయిలు తీర్చారనే వార్తల్లో కూడా ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
అసలు రాజ్పాల్ యాదవ్ జైలుకు ఎందుకు వెళ్లారు?
{{/usCountry}}అయితే, ఈ వీడియోకు ప్రస్తుత కేసుకు ఎలాంటి సంబంధం లేదని తాజాగా తేలింది. అది పాత వీడియో అని, ఎవరో కావాలని ఇప్పుడు దానిని వైరల్ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టమైంది. సల్మాన్ ఖాన్ రాజ్పాల్ బకాయిలు తీర్చారనే వార్తల్లో కూడా ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
అసలు రాజ్పాల్ యాదవ్ జైలుకు ఎందుకు వెళ్లారు?
{{/usCountry}}ఈ వివాదం 2010లో మొదలైంది. రాజ్పాల్ యాదవ్ దర్శకుడిగా తన మొదటి సినిమా తీయడానికి రూ. 5 కోట్ల అప్పు తీసుకున్నారు. కానీ, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవడంతో ఆయన ఆ డబ్బును తిరిగి చెల్లించలేకపోయారు. దీనిపై కోర్టులో చెక్ బౌన్స్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఆ అప్పు వడ్డీతో కలిపి రూ. 9 కోట్లకు చేరింది.
2018లో మెజిస్ట్రేట్ కోర్టు రాజ్పాల్ దంపతులకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 2026 ఫిబ్రవరి 5న ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు.
బెయిల్ విచారణపైనే
ప్రస్తుతం రాజ్పాల్ యాదవ్ తన శిక్షను అనుభవిస్తున్నారు. ఫిబ్రవరి 16న జరిగే బెయిల్ విచారణపైనే ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంది. అప్పటివరకు ఆయన జైలులోనే ఉండక తప్పదు.