తీహార్ జైలు పోలీసులకు లొంగిపోయిన కిక్ 2 కమెడియన్- 2018 నాటి కేసులో షాక్- తప్పని జైలు శిక్ష, సాధారణ ఖైదీలానే జీవితం!

ప్రముఖ బాలీవుడ్ అగ్ర కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ గురువారం (ఫిబ్రవరి 5) ఢిల్లీలోని తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. చెక్ బౌన్స్ కేసులో జైలు శిక్ష అనుభవించాల్సి ఉండగా, లొంగుబాటు గడువును పెంచాలన్న ఆయన అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది.

Feb 6, 2026, 09:03:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ సీనియర్ నటుడు, స్టార్ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ చిక్కుల్లో పడ్డారు. గత కొంతకాలంగా ఆయన్ని వేధిస్తున్న చెక్ బౌన్స్ కేసులో ఎట్టకేలకు రాజ్‌పాల్ యాదవ్ జైలు బాట పట్టాల్సి వచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు గురువారం (ఫిబ్రవరి 5) సాయంత్రం 4 గంటలకు రాజ్‌పాల్ యాదవ్ తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. లొంగుబాటు గడువును పొడిగించేందుకు హైకోర్టు నిరాకరించడంతో రాజ్‌పాల్ యాదవ్‌కు జైలు శిక్ష తప్పలేదు.

తీహార్ జైలు పోలీసులకు లొంగిపోయిన కిక్ 2 కమెడియన్- 2018 నాటి కేసులో షాక్- తప్పని జైలు శిక్ష, సాధారణ ఖైదీలానే జీవితం!
తీహార్ జైలు పోలీసులకు లొంగిపోయిన కిక్ 2 కమెడియన్- 2018 నాటి కేసులో షాక్- తప్పని జైలు శిక్ష, సాధారణ ఖైదీలానే జీవితం!

న్యాయస్థానం ఏమందంటే?

బుధవారం జరిగిన విచారణలో రాజ్‌పాల్ యాదవ్ తరపు న్యాయవాది కోర్టుకు ఒక అభ్యర్థన చేశారు. తన క్లయింట్ రూ. 50 లక్షలు సిద్ధం చేశారని, మిగిలిన మొత్తాన్ని చెల్లించేందుకు మరో వారం రోజుల సమయం కావాలని కోరారు. అయితే, దీనిపై న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు.

"కేవలం ఒక వ్యక్తి ప్రత్యేక నేపథ్యం లేదా సినిమా రంగానికి చెందిన వాడు అన్న కారణంతో కోర్టు ప్రత్యేక నిబంధనలను సృష్టించలేదు. లౌక్యం లేదా ఉదారత చూపడం అవసరమే కావొచ్చు, కానీ నిరంతరం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించే వారికి ఆ గడువును అంతులేకుండా పొడిగించలేము" అని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

అసలేమిటీ కేసు?

ఫిబ్రవరి 2నే ఆయనకు లొంగిపోవాలని ఆదేశాలు ఇచ్చినా, గడువు కోరడాన్ని కోర్టు తప్పుబట్టింది. కాగా, మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ రాజ్‌పాల్ యాదవ్, ఆయన భార్యపై ఈ చెక్ బౌన్స్ కేసు పెట్టింది. వారు తీసుకున్న అప్పును తిరిగి చెల్లించడంలో విఫలమవ్వడమే కాకుండా, ఇచ్చిన పలు చెక్కులు బౌన్స్ అయ్యాయని ఆ సంస్థ ఫిర్యాదు చేసింది.

కేసు ప్రక్రియ

2018: ఢిల్లీలోని మెజిస్ట్రియల్ కోర్టు రాజ్‌పాల్ దంపతులను దోషులుగా తేల్చి, నటుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది.

2019: సెషన్స్ కోర్టు కూడా ఈ శిక్షను సమర్థించింది.

2024 (జూన్): హైకోర్టు ఈ శిక్షపై తాత్కాలిక స్టే ఇచ్చి, బాధితులతో రాజీ పడాలని సూచించింది.

2026 (ఫిబ్రవరి 2): పదే పదే హామీలు ఇచ్చి కూడా డబ్బు చెల్లించకపోవడంతో, రాజ్‌పాల్ లొంగిపోవాలని హైకోర్టు తుది ఆదేశాలు జారీ చేసింది.

సాధారణ ఖైదీలకు వర్తించే నిబంధనలే

జైలు వర్గాల సమాచారం ప్రకారం.. గురువారం సాయంత్రం 4 గంటలకు రాజ్‌పాల్ జైలుకు చేరుకోగా, ఇప్పుడు ఆయనకు సాధారణ ఖైదీలకు వర్తించే నిబంధనలే అమలు కానున్నాయి. వెండితెరపై నవ్వులు పూయించే నటుడు రాజ్‌పాల్ యాదవ్ ఇప్పుడు 2018 నాటి పాత కేసులో ఇలా జైలు పాలవ్వడం ఆయన అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.

కిక్ 2 కమెడియన్

తీహార్ జైలులో సాధారణ ఖైదీలాంటే జీవితం గడపనున్న స్టార్ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్ జోడీగా నటించిన కిక్ 2 మూవీలో నటించారు. ఈ సినిమాతో ఆయన తెలుగులో పరిచయం అవడం విశేషం.