మెగా అభిమానులకు ఇది అసలైన పండుగ వార్త. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల కుటుంబంలోకి కొత్త అతిథులు అడుగుపెట్టారు. శనివారం (జనవరి 31) ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఒక బాబు, ఒక పాప పుట్టడంతో కొణిదెల, కామినేని కుటుంబాల్లో ఆనందం అంబరాన్నంటింది.
తాతయ్యగా చిరంజీవి మురిపెం

ఈ అద్భుతమైన గుడ్ న్యూస్ను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ధృవీకరించారు. "ఎంతో ఆనందంతో, కృతజ్ఞతా భావంతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాము. చరణ్, ఉపాసనలకు కవలలు (బాబు, పాప) జన్మించారు" అని చిరంజీవి పేర్కొన్నారు.
మాకు దైవప్రసాదంగా
"తల్లీ, పిల్లలు క్షేమంగా ఉన్నారు. తాతామ్మలుగా ఈ చిన్నారులను మా కుటుంబంలోకి ఆహ్వానించడం మాకు దైవప్రసాదంగా భావిస్తున్నాము. మీ అందరి ప్రార్థనలు, ప్రేమకు ధన్యవాదాలు" అని చిరంజీవి తన పోస్ట్లో రాసుకొచ్చారు. దీంతో చిరంజీవి పోస్ట్ ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది.
క్లిన్ కారాకు తోడుగా..
కాగా, రామ్ చరణ్, ఉపాసన 2012 జూన్లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2023 జూన్లో వీరికి మొదటి సంతానంగా 'క్లిన్ కారా' జన్మించింది.
డబుల్ సెలబ్రేషన్ అంటూ
ఇక 2025 దీపావళి సమయంలో ఉపాసన తన సీమంతం వీడియోను పంచుకుంటూ 'డబుల్ సెలబ్రేషన్' అంటూ కవలల రాకపై అప్పట్లోనే హింట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ ముచ్చట తీరడంతో అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగా కుటుంబంలోకి ఒకేసారి చిన్నారి బాబు, పాప రావడంతో చిరు ఫ్యామిలీతోపాటు అభిమానుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది.
సినిమా విశేషాలు
ఇక కెరీర్ విషయానికొస్తే.. రామ్ చరణ్ ఇటీవల 'గేమ్ ఛేంజర్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకుంది.
పీరియాడిక్ ఫిల్మ్
{{/usCountry}}ఇక కెరీర్ విషయానికొస్తే.. రామ్ చరణ్ ఇటీవల 'గేమ్ ఛేంజర్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకుంది.
పీరియాడిక్ ఫిల్మ్
{{/usCountry}}ప్రస్తుతం రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా 'పెద్ది' (Peddi) అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు. దీనితో పాటు నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా రూపొందుతున్న పీరియాడిక్ ఫిల్మ్ 'ది ఇండియా హౌస్'ను రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు.