బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ప్రస్తుతం తన లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓ రోమియో’ (O Romeo) ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రఖర్ గుప్తా యూట్యూబ్ పాడ్కాస్ట్లో పాల్గొన్న షాహిద్ కపూర్ ప్రస్తుతం తన సొంత సినీ ఇండస్ట్రీ తీరుతెన్నులపై మనసులోని అసహనాన్ని బయటపెట్టారు.
షాహిద్ కపూర్ సంచలన వ్యాఖ్యలు

ముఖ్యంగా ‘కృత్రిమ ప్రచారం’ (Manufactured Marketing) వల్ల సినిమాకు జరిగే నష్టం గురించి షాహిద్ కపూర్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
ప్రేక్షకుల స్పందన స్వచ్ఛంగా ఉండాలి!
ఆర్టిఫీషియల్ పీఆర్పై తనకు ఎప్పుడూ నమ్మకం లేదని షాహిద్ స్పష్టం చేశారు. "ఒక హాల్ నిండా ఉన్న ప్రేక్షకులు విజిల్స్ వేస్తూ, చప్పట్లు కొడుతూ మనల్ని అభినందించడం అనేది ఒక అద్భుతం. కళకు ఉన్న ప్రత్యేకత అదే. కానీ, ఎప్పుడైతే మనం కృత్రిమమైన మార్కెటింగ్ పద్ధతులతో ఆ స్వచ్ఛతను చెడగొడతామో.. అప్పుడు ఆ అనుభూతి పూర్తిగా మారిపోతుంది. మార్కెటింగ్ అవసరమే కానీ, అది ఎంతవరకు ఉండాలనేది ఆలోచించాలి" అని షాహిద్ కపూర్ వివరించారు.
మంచి సినిమాలు తీయడం లేదు!
ప్రస్తుత కాలంలో ప్రేక్షకుల ఏకాగ్రత (Attention Span) తగ్గిపోవడానికి కారణాలను కూడా ఆయన విశ్లేషించారు. "ఇక్కడ రెండు వైపులా తప్పు జరుగుతోంది. ఒకవైపు సోషల్ మీడియా ప్రభావంతో ప్రేక్షకులు ఓపిక కోల్పోతున్నారు. వారికి ప్రతి నిమిషం ఏదో ఒక ఉత్సాహం కావాలి. మరోవైపు, మేకర్స్ కూడా అదే ఒత్తిడిలో పడి నాణ్యమైన సినిమాలు తీయలేకపోతున్నారు. ప్రేక్షకులు సినిమాలు చూడటం మానేశారు అనడం కంటే, మనం చూసేలాంటి మంచి సినిమాలు తీయడం లేదనేది కూడా వాస్తవం" అని షాహిద్ కపూర్ పేర్కొన్నారు.
విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో ‘ఓ రోమియో’
పీఆర్ స్టంట్స్, కృత్రిమ ప్రచారం వల్లే సినిమా చనిపోతోందన్న అర్థంలో మాట్లాడిన షాహిద్ కపూర్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే, హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ పుస్తకం ఆధారంగా ‘ఓ రోమియో’ తెరకెక్కుతోంది.
ఫిబ్రవరి 13న థియేటర్లలో
{{/usCountry}}పీఆర్ స్టంట్స్, కృత్రిమ ప్రచారం వల్లే సినిమా చనిపోతోందన్న అర్థంలో మాట్లాడిన షాహిద్ కపూర్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే, హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ పుస్తకం ఆధారంగా ‘ఓ రోమియో’ తెరకెక్కుతోంది.
ఫిబ్రవరి 13న థియేటర్లలో
{{/usCountry}}దిగ్గజ దర్శకుడు విశాల్ భరద్వాజ్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో షాహిద్ సరసన తృప్తి డిమ్రి నటిస్తోంది. వీరితో పాటు నానా పటేకర్, తమన్నా భాటియా, దిశా పటాని, విక్రాంత్ మాస్సే వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాజిద్ నడియాడ్వాలా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ఫిబ్రవరి 13న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.