తన మధురమైన గొంతుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ ఇప్పుడు ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో హాట్ టాపిక్గా మారారు. ముంబైలోని అత్యంత విలాసవంతమైన ప్రాంతాల్లో ఒకటిగా పేరుగాంచిన 'వర్లీ' (Worli)లో శ్రేయా ఘోషల్ ఒక ఖరీదైన ఫ్లాట్ను కొనుగోలు చేశారు. తన తల్లి షమిష్ట ఘోషల్, తండ్రి బిస్వజిత్ ఘోషల్లతో కలిసి సంయుక్తంగా ఈ ఆస్తిని శ్రేయా రిజిస్టర్ చేయించుకున్నారు.
ఫ్లాట్ విశేషాలు ఇవే..
'స్క్వేర్ యార్డ్స్' (Square Yards) సమీక్షించిన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం, ఈ అపార్ట్మెంట్ వర్లీలోని 'గోద్రెజ్ ట్రైలజీ' (Godrej Trilogy) ప్రాజెక్ట్లో ఉంది.
విస్తీర్ణం: ఈ ఫ్లాట్ కార్పెట్ ఏరియా 2,430.06 చదరపు అడుగులు కాగా, మొత్తం విస్తీర్ణం 2,750.28 చదరపు అడుగులుగా ఉంది.
ధర: దీని విలువ సుమారు రూ. 29.70 కోట్లు.
అదనపు వసతులు: ఈ ఫ్లాట్తో పాటు మూడు కార్ పార్కింగ్ స్థలాలు కూడా లభించాయి.
రిజిస్ట్రేషన్ వివరాలు: ఈ డీల్ 2026, ఏప్రిల్ 1న రిజిస్టర్ అయింది. దీని కోసం శ్రేయా ఘోషల్ సుమారు రూ. 1.78 కోట్ల స్టాంప్ డ్యూటీని, రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలను చెల్లించారు.
ఖరీదైన అడ్రస్గా వర్లీ!
దక్షిణ ముంబై, లోయర్ పరేల్ వంటి ప్రాంతాల తర్వాత ఇప్పుడు సంపన్నుల చూపు వర్లీపై పడింది. ఇక్కడి కొన్ని లగ్జరీ ప్రాజెక్టులలో చదరపు అడుగు ధర రూ. 1 లక్షకు పైగానే పలుకుతోంది. బాంద్రా-వర్లీ సీ లింక్, వెస్ట్రన్ ఎక్స్ప్రెస్ హైవే వంటి కనెక్టివిటీ ఉండటం వల్ల కార్పొరేట్ దిగ్గజాలు, సెలబ్రిటీలు ఇక్కడ ఇళ్లు కొనడానికి మొగ్గు చూపుతున్నారు.
న్యూయార్క్లోని లోయర్ మాన్హట్టన్ ప్రాంతంలో ఉన్న ధరలతో వర్లీ రియల్ ఎస్టేట్ రేట్లు పోటీ పడుతుండటం గమనార్హం. గతేడాది ఇక్కడే రెండు డ్యూప్లెక్స్ ఇళ్లు రూ. 700 కోట్లకు పైగా ధర పలకడం సంచలనం సృష్టించింది. గత మూడేళ్లలో ఇక్కడ రూ. 100 కోట్లకు పైగా విలువైన లావాదేవీలు 20కి పైగా జరిగాయి.
శ్రేయా ఘోషల్ ప్రస్థానం
{{/usCountry}}న్యూయార్క్లోని లోయర్ మాన్హట్టన్ ప్రాంతంలో ఉన్న ధరలతో వర్లీ రియల్ ఎస్టేట్ రేట్లు పోటీ పడుతుండటం గమనార్హం. గతేడాది ఇక్కడే రెండు డ్యూప్లెక్స్ ఇళ్లు రూ. 700 కోట్లకు పైగా ధర పలకడం సంచలనం సృష్టించింది. గత మూడేళ్లలో ఇక్కడ రూ. 100 కోట్లకు పైగా విలువైన లావాదేవీలు 20కి పైగా జరిగాయి.
శ్రేయా ఘోషల్ ప్రస్థానం
{{/usCountry}}ఎలక్ట్రికల్ ఇంజనీర్ బిస్వజిత్ ఘోషల్, సాహిత్యవేత్త షమిష్ట దంపతులకు జన్మించిన శ్రేయా ఘోషల్ 'సా రె గ మ ప' రియాలిటీ షో ద్వారా వెలుగులోకి వచ్చారు. 2002లో 'దేవదాస్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె.. 'బైరీ పియా' వంటి పాటలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.
శ్రేయా ఘోషల్ తెలుగు సాంగ్స్
అప్పటి నుంచి ఇప్పటి వరకు తన అద్భుతమైన గాత్రంతో భారతీయ సినీ సంగీతంలో తిరుగులేని గాయనిగా కొనసాగుతున్నారు. శ్రేయా ఘోషల్ తెలుగులోనూ ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించారు. చలి చలిగా (మిస్టర్ పర్ఫెక్ట్), సమ్మోహనుడా (రూల్స్ రంజన్) వంటి ఎన్నో హిట్స్ పాడారు శ్రేయా ఘోషల్.