...
...
Next Story

SS Rajamouli: పారిస్‌లో రాజమౌళికి అరుదైన గౌరవం.. 8 గంటలు ఏకధాటిగా జక్కన్న సినిమాలే చూసిన 93 ఏళ్ల ఆస్కార్ అవార్డ్ గ్రహిత!

Oscar Award Winner Costa Gavras SS Rajamouli Movies: తెలుగు దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి పారిస్‌లో అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత చలనచిత్ర సంస్థ 'సినిమేటెక్ ఫ్రాంకైజ్' లో ఆయనకు శాశ్వత స్థానం కల్పించగా, ఆస్కార్ విజేత కోస్టా గావ్రాస్ జక్కన్న చిత్రాలను 8 గంటలపాటు చూసి ముగ్ధులయ్యారు.

Published on: Jun 28, 2026, 21:00:44 IST
Advertisement

Oscar Award Winner Costa Gavras Rajamouli Movies: టాలీవుడ్ జక్కన్న, గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి మరోసారి అంతర్జాతీయ వేదికపై తెలుగు సినిమా సత్తా చాటారు. 'బాహుబలి' సిరీస్, 'ఆర్ఆర్ఆర్' (RRR) చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రేక్షకులను సంపాదించుకున్న ఆయనకు ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో అత్యంత అరుదైన గౌరవం లభించింది.

పారిస్‌లో రాజమౌళికి అరుదైన గౌరవం.. 8 గంటలు ఏకధాటిగా జక్కన్న సినిమాలే చూసిన 93 ఏళ్ల ఆస్కార్ అవార్డ్ గ్రహిత!
పారిస్‌లో రాజమౌళికి అరుదైన గౌరవం.. 8 గంటలు ఏకధాటిగా జక్కన్న సినిమాలే చూసిన 93 ఏళ్ల ఆస్కార్ అవార్డ్ గ్రహిత!

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చలనచిత్ర సంస్థల్లో ఒకటిగా పేరొందిన 'సినిమేటెక్ ఫ్రాంకైజ్' (Cinémathèque Française) రాజమౌళికి శాశ్వత స్థానాన్ని కల్పించింది. భారతీయ సినిమా ఎదుగుదలను కొనియాడుతూ నిర్వహించిన ఈ ప్రత్యేక వేడుకలో ఆస్కార్ అవార్డ్ గ్రహీత, గ్రీక్-ఫ్రెంచ్ దర్శకుడు కోస్టా గావ్రాస్ పాల్గొనడం విశేషం.

ప్రపంచ ప్రఖ్యాత చలనచిత్ర సంస్థలో శాశ్వత స్థానం

రాజమౌళి చిత్రాలను ఏకధాటిగా దాదాపు ఎనిమిది గంటల పాటు వీక్షించిన ఆయన, ఆ తర్వాత జరిగిన మాస్టర్‌క్లాస్‌లోనూ కూర్చుని జక్కన్న ప్రతిభను అభినందించారు. పారిస్ నగరంలో 1936లో హెన్రీ లాంగ్లోయిస్ స్థాపించిన 'సినిమేటెక్ ఫ్రాంకైజ్' ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ ఆర్కైవ్స్‌లో ఒకటిగా గుర్తింపు పొందింది.

ప్రపంచ సినిమా రంగాన్ని మలుపు తిప్పిన గొప్ప కథా రచయితలు, దర్శకులను మాత్రమే ఈ సంస్థ గౌరవిస్తుంది. ఈ ప్రతిష్టాత్మక వేదికపై ఇండియన్ సినిమా రైజ్‌ను సెలబ్రేట్ చేస్తూ రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఈగ' (2012), 'బాహుబలి: ది బిగినింగ్' (2015), 'ఆర్ఆర్ఆర్' (2022) చిత్రాలను ప్రదర్శించారు.

రాజమౌళి భావోద్వేగం

మెల్బోర్న్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమానికి మద్దతు అందించాయి. ఈ అరుదైన గౌరవంపై రాజమౌళి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా భావోద్వేగంతో స్పందించారు.

లెజెండరీ దర్శకుడు కోస్టా గావ్రాస్‌తో పాటు సినీమేటెక్ ఫ్రాంకైజ్ బృందానికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలో అందరినీ ఆశ్చర్యపరిచిన సంఘటన ఒకటుంది.

'జెడ్' (1969), 'మిస్సింగ్' (1982) వంటి క్లాసిక్ చిత్రాలను తెరకెక్కించిన 93 ఏళ్ల ఆస్కార్ అవార్డు గ్రహీత, ఫ్రెంచ్-గ్రీక్ చిత్రనిర్మాత కోస్టా గావ్రాస్ కేవలం మర్యాదపూర్వకంగా హాజరవుతారని చిత్ర యూనిట్ భావించింది. కానీ, రాజమౌళి సినిమాల మాయలో పడి ఆయన రోజంతా థియేటర్లోనే గడిపేశారు. ఈ అద్భుత క్షణాన్ని రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

"93 ఏళ్ల అకాడమీ అవార్డు విజేత కోస్టా గావ్రాస్ నిన్న ఆర్ఆర్ఆర్ సినిమా చూడటానికి వచ్చారు. ఈ రోజు బాహుబలి సినిమాను స్కిప్ చేసి, రేపు ఈగ సినిమా చూడటానికి వస్తానని రాజమౌళితో చెప్పారు. కానీ, మా అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆయన ఈ రోజు తన భార్యతో కలిసి థియేటర్‌కు వచ్చారు. ఏకధాటిగా 8 గంటల పాటు కూర్చుని బాహుబలి, ఈగ సినిమాలతో పాటు మాస్టర్‌క్లాస్‌ను కూడా వీక్షించారు" అని కార్తికేయ ట్వీట్ చేశారు.

గ్లోబల్ బాక్సాఫీస్ వైపు 'వారణాసి' అడుగులు

సినిమా రంగంలో తాము కొనసాగడానికి, మరింతగా శ్రమించడానికి ఇలాంటి క్షణాలే స్ఫూర్తినిస్తాయని ఆయన రాసుకొచ్చారు. పారిస్ వేదికగా అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్న రాజమౌళి, ప్రస్తుతం తన తదుపరి భారీ ప్రాజెక్ట్ వారణాసి పనుల్లో బిజీగా ఉన్నారు.

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ అడ్వెంచర్ యాక్షన్ డ్రామాను గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో రూపకల్పన చేస్తున్నారు.

ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe