Supreme Court Quashes Samay Raina Case: ప్రముఖ స్టాండప్ కమెడియన్ సమయ్ రైనాకు అత్యున్నత న్యాయస్థానంలో భారీ ఉపశమనం లభించింది. 'ఇండియాస్ గాట్ లేటెంట్' అనే ఓటీటీ కామెడీ షో వేదికగా స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (SMA) బాధితులు, దివ్యాంగుల ప్రతిష్టకు భంగం కలిగించేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో నమోదైన క్రిమినల్ కేసులను సుప్రీం కోర్టు కొట్టివేసింది.
సమయ్ రైనాతోపాటు నలుగురు కమెడియన్లకు

శుక్రవారం (ఆగస్ట్ 14) నాటి విచారణలో భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పు వెలువరించింది. సమయ్ రైనాతో పాటు మరో నలుగురు కమెడియన్లు విపుల్ గోయల్, బలరాజ్ పరమ్జీత్ సింగ్ ఘాయ్, సోనాలి ఠక్కర్, నిషాంత్ జగదీష్ తన్వర్లపై ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కోర్టు రద్దు చేసింది.
తప్పుదిద్దుకునే ప్రయత్నం ఫలించింది!
గత నెలలో జరిగిన విచారణ సమయంలో ధర్మాసనం ఈ ఐదుగురు కమెడియన్లపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారనే కారణంతో ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున జరిమానా కూడా విధించింది. "ఇది అహంకారం కాకపోతే, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలోనే దీనికి కొత్త అర్థం వెతకాల్సి ఉంటుంది" అని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
విరాళాలు సేకరించడం
అయితే ఆ తర్వాత కమెడియన్లు తమ వైఖరిని మార్చుకుని, బాధితుల పట్ల పశ్చాత్తాపం ప్రదర్శించారు. SMA బాధిత సంస్థ 'క్యూర్ SMA ఫౌండేషన్' ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. మార్చిలో దివ్యాంగుల కోసం ఒక చెస్ టోర్నమెంట్ నిర్వహించి, దాని ద్వారా విరాళాలు సేకరించడంతో పాటు సమాజంలో అవగాహన పెంచేందుకు కృషి చేశారు.
మంచి మార్గంలో అడుగులు వేస్తే
"యువకులు సానుకూల దృక్పథంతో మంచి మార్గంలో అడుగులు వేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. వీరంతా చాలా ప్రతిభావంతులు" అని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఈ సందర్భంగా కొనియాడారు.
డిజిటల్ కంటెంట్పై కీలక దిశానిర్దేశం
{{/usCountry}}"యువకులు సానుకూల దృక్పథంతో మంచి మార్గంలో అడుగులు వేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. వీరంతా చాలా ప్రతిభావంతులు" అని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఈ సందర్భంగా కొనియాడారు.
డిజిటల్ కంటెంట్పై కీలక దిశానిర్దేశం
{{/usCountry}}కమెడియన్లపై ఉన్న కేసులను కొట్టేసినప్పటికీ, ఓటీటీలో వస్తున్న కంటెంట్ నాణ్యత, దివ్యాంగుల హక్కుల పరిరక్షణ అనే ప్రధాన అంశాన్ని సుప్రీంకోర్టు ఇంకా పెండింగ్లోనే ఉంచింది. సోషల్ మీడియా లేదా యూట్యూబ్ వేదికలపై మాట్లాడే స్వేచ్ఛ వేరు, ఇతరుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం వేరు అని ధర్మాసనం తేల్చిచెప్పింది.
ఆ రెండింటి మధ్య సమతుల్యత సాధించడమే
ఈ క్రమంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సవాళ్లపై సమగ్ర అధ్యయనం చేసి, ఆన్లైన్ కంటెంట్పై ఎలాంటి మార్గదర్శకాలు తెస్తే బాగుంటుందో సూచనలు ఇవ్వాలని పిటిషనర్లను, అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణీని కోర్టు ఆదేశించింది. వాక్స్వాతంత్య్రానికి, వ్యక్తిగత ఆత్మగౌరవానికి మధ్య సమతుల్యత సాధించడమే తమ ప్రధాన ఉద్దేశమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
సమయ్ రైనా ఓటీటీ షో
ఇదిలా ఉంటే, ఇండియాస్ గాట్ లాటెంట్ సీజన్ 2 ఇప్పుడు ప్రసారం అవుతోంది. నెట్ఫ్లిక్స్లో ఇండియాస్ గాట్ లాటెంట్ 2 ఓటీటీ రిలీజ్ కావడంతోపాటు యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉంది. సమయ్ రైనా హోస్ట్గా చేస్తున్న ఇండియాస్ గాట్ లాటెంట్ సీజన్ 2 నెట్ఫ్లిక్స్లో జూన్ 20 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.