Akanksha Gaurav: విడాకులు తీసుకుంటున్న బుల్లితెర జంట- ఓటీటీ షోలో నిజం చెప్పేసిన నటి ఆకాంక్ష- ఎలాంటి గొడవలు లేవు, కానీ!
TV Pair Akanksha Gaurav Divorce Announcement In TV Show: ప్రముఖ బుల్లితెర జంట ఆకాంక్ష చమోలా, గౌరవ్ ఖన్నా విడాకులు తీసుకోనున్నారు. ఈ విషయాన్ని ఓటీటీ బోల్డ్ షోలో నేరుగా బుల్లితెర నటి ఆకాంక్ష చెప్పుకొచ్చింది. గత కొన్ని నెలలకు వీరి విడాకులపై రూమర్స్ వస్తుండగా తాజాగా అధికారికంగా ప్రకటించేసింది ఆకాంక్ష.
TV Pair Akanksha Gaurav Divorce Announcement In OTT Show: బుల్లితెరపై మోస్ట్ అడోరబుల్ కపుల్గా పేరు తెచ్చుకున్న ప్రముఖ టీవీ నటుడు, బిగ్ బాస్ గత సీజన్ 19 విజేత గౌరవ్ ఖన్నా, నటి ఆకాంక్ష చమోలా వైవాహిక బంధం ముగింపు దశకు చేరింది.

ఓటీటీ షోలో క్లారిటీ
తాము విడాకులు తీసుకోబోతున్నామంటూ ఆకాంక్ష చేసిన అధికారిక ప్రకటన హిందీ టెలివిజన్ రంగంతో పాటు సోషల్ మీడియా ప్రపంచంలో తీవ్ర కలకలం రేపుతోంది. నెట్ఫ్లిక్స్ వేదికగా గ్రాండ్గా ప్రారంభమైన పాపులర్ ఓటీటీ బోల్డ్ రియాలిటీ షో 'లాక్ అప్' సీజన్ 2 వేదికగా ఆమె ఈ సంచలన నిజాన్ని బయటపెట్టారు.
'లాక్ అప్ 2' షోలో ఆకాంక్ష చమోలా ఒక కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చారు. ఈ ఓటీటీ షో ప్రీమియర్ ఎపిసోడ్లో హోస్ట్లు ఫరా ఖాన్, రితేష్ దేశ్ముఖ్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆకాంక్ష తన జీవితంలోని అతిపెద్ద రహస్యాన్ని పంచుకున్నారు. తాము గత ఏడాది కాలంగా విడిగా ఉంటున్నామని చెబుతూ అందరికీ షాక్ ఇచ్చారు. గౌరవ్ ఖన్నాతో విడిపోవడంపై ఆకాంక్ష షో వేదికగా స్పష్టత ఇచ్చారు.
ఏడాదిగా విడివిడిగానే.. అసలు కారణం ఇదే!
"మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటాం. కానీ, భాగస్వాములుగా మా ఆలోచనలు కలవడం లేదు. భవిష్యత్తు గురించి మా ఇద్దరి అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి. దురదృష్టవశాత్తూ ఆ భవిష్యత్తులో మేమిద్దరం కలిసి ఉండలేము. అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నాం" అని ఆకాంక్ష క్లారిటీ ఇచ్చారు.
ఈ ప్రకటన విన్న హోస్ట్లు ఫరా ఖాన్, రితేష్ దేశ్ముఖ్తో పాటు షోలో ఉన్న మిగతా కంటెస్టెంట్లు కూడా ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. నిజానికి ఈ ఏడాది జనవరిలోనే వీరిద్దరి బంధంపై సోషల్ మీడియాలో కొన్ని ఊహాగానాలు వచ్చాయి.
హృదయమే బలి అవుతుంది
"కేవలం అవసరాల కోసమే బంధాలు ఏర్పడినప్పుడు, ఎప్పుడూ హృదయమే బలి అవుతుంది" అంటూ ఆకాంక్ష అప్పట్లో హిందీలో పెట్టిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఇప్పుడు ఆకాంక్ష నేరుగా విడాకుల విషయం చెప్పడంతో ఆ అనుమానాలన్నీ నిజమయ్యాయి.
ఆడిషన్లో చిగురించిన ప్రేమ..
ఆకాంక్ష చమోలా 'సంతోషి మా', 'యే హై ఆషికి', 'క్రైమ్ పెట్రోల్' వంటి పాపులర్ బుల్లితెర షోల ద్వారా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక ఆడిషన్ సమయంలో గౌరవ్ ఖన్నాను కలిసిన ఆకాంక్ష, కొన్నాళ్ల డేటింగ్ తర్వాత అతనితో ప్రేమలో పడ్డారు.
కాన్పూర్లో ఘనంగా పెళ్లి
వీరిద్దరూ నవంబర్ 24, 2016న గౌరవ్ స్వస్థలమైన కాన్పూర్లో మూడు రోజుల పాటు ఎంతో వైభవంగా వివాహం చేసుకున్నారు. బుల్లితెరపై ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట తొమ్మిదో పడిలోకి అడుగుపెట్టే లోపే ఇలా విడిపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
పిల్లల విషయంలో భిన్నాభిప్రాయాలు
గతంలో గౌరవ్ ఖన్నా బిగ్బాస్ 19 హౌస్లో ఉన్నప్పుడు తన వైవాహిక జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. తోటి కంటెస్టెంట్, యూట్యూబర్ మృదుల్ తివారీతో గార్డెన్ ఏరియాలో ముచ్చటిస్తూ పితృత్వం (ఫాదర్హుడ్) పై తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. తమకు పెళ్లయి తొమ్మిదేళ్లు కావస్తున్నా పిల్లలు ఎందుకు లేరనే ప్రశ్నకు గౌరవ్ అప్పట్లో సున్నితంగా సమాధానం ఇచ్చారు.
"నాకు పిల్లలు కావాలని ఉంది, కానీ నా భార్యకు ఇష్టం లేదు. మాది ప్రేమ వివాహం కాబట్టి ఆమె నిర్ణయాన్ని గౌరవించక తప్పదు. ప్రేమించినప్పుడు అన్నింటికీ కట్టుబడి ఉండాలి కదా!" అని గౌరవ్ ఖన్నా అప్పుడు అలా వ్యాఖ్యానించారు.
సమర్ధించిన గౌరవ్
తన భార్య ఆలోచనలోనూ న్యాయముందని గౌరవ్ సమర్థించారు. ఇద్దరం రోజంతా షూటింగ్లతో బిజీగా ఉంటే పిల్లల బాధ్యతలను ఇతరుల చేతుల్లో పెట్టడం ఆకాంక్షకు ఇష్టం లేదని, అందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని అప్పట్లో గౌరవ్ చెప్పారు.
వైవాహిక విబేధాలే
భార్య నిర్ణయానికి అంతలా విలువ ఇచ్చే భర్త దొరికినా, వారి మధ్య వచ్చిన వైవాహిక విబేధాలే చివరికి విడాకుల వరకు దారితీశాయని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


