Urfi Javed Escape From Police Detained: నీట్ (NEET) పరీక్షల్లో జరిగిన అక్రమాలు దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఆర్థిక రాజధాని ముంబై వరకు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీయ పక్షాలు రోడ్లపైకి వచ్చాయి.
విద్యార్థుల భవిష్యత్తుతో

ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్, రఫీ మార్గ్, జంతర్ మంతర్ ప్రాంతాల్లో పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి ఆందోళనకారులను అడ్డుకుంటున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ వివాదంపై అన్ని ప్రాంతాల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే ఈ నిరసనలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో ఢిల్లీలో చేపట్టిన పార్లమెంట్ మార్చ్ హింసాత్మకంగా మారడంతో కన్నాట్ ప్లేస్, పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే 6 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ ఘటన వెనుక ఉన్న అంతర్గత కుట్ర కోణాన్ని వెలికితీసేందుకు పోలీసులు విచారణ వేగవంతం చేశారు.
ముంబైకి పాకిన ఆందోళనలు.. ఉర్ఫీ జావెద్కు తప్పిన అరెస్ట్
ఢిల్లీలో ప్రారంభమైన ఈ నిరసనలు ఇప్పుడు ముంబై నగరానికి విస్తరించాయి. వరుసగా మూడో రోజు ముంబైలోని శివాజీ నగర్, దాదర్, చైత్యభూమి పరిసర ప్రాంతాల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. ఈ నిరసనల్లో పాల్గొనేందుకు వెళ్లిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్, బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావెద్, ఆమె సోదరీమణులు డాలీ, ఆస్ఫిలకు చేదు అనుభవం ఎదురైంది.
పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా.. వారు తప్పించుకుని బయటపడ్డారు. "ప్రజలు ఎంతో ప్రశాంతంగా నిరసన తెలపాలని చూస్తున్నారు. కానీ, పోలీసులు కనీసం ఆ హక్కును కూడా ఇవ్వడం లేదు. ఏ తప్పూ చేయకుండా ఊరికే నిలబడిన వారిని కూడా పోలీసులు బలవంతంగా వాహనాల్లో ఎక్కించుకుని తీసుకెళ్తున్నారు" అని ఉర్ఫీ జావెద్ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.
నటి అయేషా ఖాన్ను ఈడ్చుకెళ్లిన పోలీసులు!
{{/usCountry}}పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా.. వారు తప్పించుకుని బయటపడ్డారు. "ప్రజలు ఎంతో ప్రశాంతంగా నిరసన తెలపాలని చూస్తున్నారు. కానీ, పోలీసులు కనీసం ఆ హక్కును కూడా ఇవ్వడం లేదు. ఏ తప్పూ చేయకుండా ఊరికే నిలబడిన వారిని కూడా పోలీసులు బలవంతంగా వాహనాల్లో ఎక్కించుకుని తీసుకెళ్తున్నారు" అని ఉర్ఫీ జావెద్ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.
నటి అయేషా ఖాన్ను ఈడ్చుకెళ్లిన పోలీసులు!
{{/usCountry}}దాదర్లోని శివాజీ పార్క్ వద్ద నిరసన తెలపడానికి వచ్చిన ప్రముఖ నటి అయేషా ఖాన్ను మహిళా పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆమెను ఈడ్చుకెళ్లి పోలీసు వ్యాన్లో పడేశారు.
"నలుగురైదుగురు మహిళా పోలీసులు నన్ను బలవంతంగా ఈడ్చుకెళ్లారు. నేను వ్యాన్ ఎక్కకుండా నా శక్తిమొత్తం ఉపయోగించి నిరోధించినప్పటికీ వారు నన్ను లోపలికి తోసేశారు. మమ్మల్ని ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారని ఎంత అడిగినా ఎవరూ జవాబు చెప్పలేదు. దాదర్ నుంచి మమ్మల్ని తీసుకువెళ్లి వర్లీలో వదిలేశారు" అని తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆయేషా ఖాన్ ఆవేదనతో వివరించారు.
నిరాహార దీక్షలో సోనమ్ వాంగ్చుక్.. ఉద్రిక్తంగా పరిస్థితులు
మరోవైపు నిరసన సమరంలో భాగంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ సామాజిక వేత్త సోనమ్ వాంగ్చుక్ను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. శివాజీ పార్క్, చైత్యభూమి వద్ద ఆందోళనకారులు ఘటనా స్థలానికి చేరుకోకముందే పోలీసులు వారిని ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు.
కేంద్ర మంత్రి రాజీనామా చేసేవరకు తమ పోరాటం ఆపేది లేదని విద్యార్థి, యువజన సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.