Vijay Sethupathi Recalls Childhood: భారతీయ చలనచిత్ర రంగంలో విలక్షణ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. కమర్షియల్ సినిమాల్లో మాస్ ప్రేక్షకులను మెప్పిస్తూనే, అవార్డు విన్నింగ్ చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు.
కోట్లాది రూపాయల పారితోషికం

కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ భాషల్లోనూ భారీ క్రేజ్ సంపాదించుకున్న ఈ 'మక్కల్ సెల్వన్' సినీ ప్రయాణం పూలబాట ఏమీ కాదు. ప్రస్తుతం కోట్లాది రూపాయల పారితోషికం తీసుకునే స్థాయికి చేరిన విజయ్ సేతుపతి, తన కెరీర్ ప్రారంభానికి ముందు చూసిన పేదరికం, పడ్డ కష్టాల గురించి తాజాగా పంచుకున్నారు.
విజయ్ సేతుపతి నటించిన'ఉప్పెన', 'మహారాజా' చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ తెచ్చుకున్నాయో తెలిసిందే. ఇప్పుడు డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటించిన సినిమా 'స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్'. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా విజయ్ సేతుపతి పంచుకున్న గతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అప్పుల వాళ్లతో పోరాటం
ఇటీవల ఒక ప్రముఖ పాడ్కాస్ట్లో పాల్గొన్న విజయ్ సేతుపతి తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. చిన్న వయసులోనే ఆర్థిక ఇబ్బందులు తనను ఎంత పరిణతి చెందేలా చేశాయో వివరించారు. ఇంట్లో నిరంతరం ఉండే పేదరికం తమ కుటుంబ నిర్ణయాలను ఎలా శాసించిందో చెప్పారు.
"నా బాల్యంలో ఎక్కువగా చూసింది ఆర్థిక ఇబ్బందులే. చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను, పేదరికాన్ని ఎదుర్కొన్నా. మనకు ఏదైనా కావాలనుకున్నప్పుడు మన ఆర్థిక స్థితిని బట్టి లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఆఖరికి అప్పుల వాళ్లు ఇంటికి వచ్చి గొడవ చేసినప్పుడు, మా నాన్న పక్కన కూర్చుని ఆ సమస్యలను నేనే డీల్ చేసేవాణ్ణి" అని విజయ్ సేతుపతి ఆనాటి చేదు అనుభవాలను పంచుకున్నారు.
వ్యాపారవేత్త కావాలనుకుని.. సినిమాల్లోకి!
{{/usCountry}}"నా బాల్యంలో ఎక్కువగా చూసింది ఆర్థిక ఇబ్బందులే. చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను, పేదరికాన్ని ఎదుర్కొన్నా. మనకు ఏదైనా కావాలనుకున్నప్పుడు మన ఆర్థిక స్థితిని బట్టి లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఆఖరికి అప్పుల వాళ్లు ఇంటికి వచ్చి గొడవ చేసినప్పుడు, మా నాన్న పక్కన కూర్చుని ఆ సమస్యలను నేనే డీల్ చేసేవాణ్ణి" అని విజయ్ సేతుపతి ఆనాటి చేదు అనుభవాలను పంచుకున్నారు.
వ్యాపారవేత్త కావాలనుకుని.. సినిమాల్లోకి!
{{/usCountry}}సినిమాల్లోకి రావడం అనేది తన జీవితంలో అసలు ప్లాన్లోనే లేదని విజయ్ సేతుపతి వెల్లడించారు. చిన్నప్పటి నుంచి కష్టపడి పనిచేయడం అంటే తనకు ఇష్టమని, భవిష్యత్తులో ఒక మంచి బిజినెస్మెన్ అవ్వాలని కలలు కన్నట్లు చెప్పారు.
"నాకు సినిమాల్లో నటించాలనే కోరిక అస్సలు ఉండేది కాదు. వ్యాపారవేత్త కావాలని అనుకునేవాణ్ణి. స్కూల్ చదివే రోజుల్లోనే రోజువారీ కూలీ పనులకు వెళ్లాను. ఆ తర్వాత ఒక టెలిఫోన్ బూత్లో కూడా పనిచేశాను. జీవితంలో ఎదగడం కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాను, నైట్ షూట్స్లో కష్టపడ్డాను" అని విజయ్ తెలిపారు.
చిన్న పాత్రల నుంచి నేషనల్ అవార్డుల వరకు
సినిమా రంగంలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా చిన్న చిన్న సహాయక పాత్రలతో విజయ్ సేతుపతి కెరీర్ ప్రారంభించారు. 2012లో వచ్చిన 'పిజ్జా', 'నడువుల కొంజమ్ పక్కత కానీమ్' చిత్రాలు ఆయన కెరీర్ను మలుపు తిప్పాయి. ఆ తర్వాత 'సూదు కవ్వుమ్', 'విక్రమ్ వేద', '96', 'సూపర్ డీలక్స్', 'మాస్టర్', 'విక్రమ్', 'జవాన్' చిత్రాలతో పాటు ఇటీవల వచ్చిన 'మహారాజా' సినిమాలో తన నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.
2023లో షాహిద్ కపూర్తో కలిసి నటించిన 'ఫర్జీ' సిరీస్ ద్వారా ఓటీటీ ఎంట్రీ ఇచ్చి డిజిటల్ ప్లాట్ఫామ్పైనా సంచలనం సృష్టించారు. ఇప్పటివరకు 50కి పైగా సినిమాల్లో నటించిన ఆయన, ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డులను కూడా అందుకున్నారు.
చేతినిండా క్రేజీ ప్రాజెక్టులు
విజయ్ సేతుపతి చివరిగా 2026లో విడుదలైన 'గాంధీ టాక్స్' చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం ఆయన చేతిలో పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్' సినిమాలో ఆయనతోపాటు టబు, సంయుక్త, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. దీనితో పాటు ప్రముఖ దర్శకుడు మిస్సిన్ కాంబినేషన్లో వస్తున్న 'ట్రైన్' సినిమాలోనూ నటిస్తున్నారు విజయ్ సేతుపతి. ఇందులో శ్రుతి హాసన్, నాజర్, ఇరా దయానంద్రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.