ఒక్క సినిమాకు 1200 కోట్లు- 2025లో వరల్డ్లోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా రికార్డ్- భారత్లో సూపర్ స్టార్!
2025లో ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా నిలిచాడు 63 ఏళ్ల స్టార్ హీరో. ఒక్క సినిమాకు ఏకంగా రూ.1200 కోట్లు రాబట్టి కింగ్ ఆఫ్ బాక్సాఫీస్ అనిపించుకున్నాడు. దాదాపు పదేళ్ల తర్వాత నెంబర్ వన్ పొజిషన్కి వచ్చిన ఆ హీరో ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.
హాలీవుడ్లో ఒకప్పుడు మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ అంటేనే అదో పెద్ద సంచలనం. కేవలం అగ్ర నటులు మాత్రమే ఆ స్థాయి రెమ్యూనరేషన్ డిమాండ్ చేసేవారు. కానీ, ఇప్పుడు కాలం మారింది.. బెంచ్మార్క్ కాస్తా 100 మిలియన్ డాలర్లకు చేరింది.

వందల కోట్ల పారితోషికం
ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలు, గ్లోబల్ ఫ్రాంచైజీలను భుజాన మోసే స్టార్లు ఇప్పుడు వందల కోట్లలో పారితోషికం అందుకుంటున్నారు. ఈ రేసులో 2025 సంవత్సరానికి గానూ 63 ఏళ్ల వయసులోనూ ఒక నటుడు ‘బాక్సాఫీస్ కింగ్’ అనిపించుకుంటూ ఏకంగా 150 మిలియన్లు డాలర్స్ (సుమారు రూ. 1250 కోట్లు) తన ఖాతాలో వేసుకున్నారు.
దశాబ్దం తర్వాత మళ్లీ నంబర్ 1
ఆయనే మరెవరో కాదు హాలీవుడ్ యాక్షన్ లెజెండ్ టామ్ క్రూజ్. గత తొమ్మిదేళ్లలో ఐదుసార్లు అగ్రస్థానంలో నిలిచిన డ్వేన్ జాన్సన్ను వెనక్కి నెట్టి పదేళ్ల తర్వాత టామ్ క్రూజ్ మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
130 నుంచి 150 మిలియన్ డాలర్స్
ఈ ఏడాది విడుదలైన తన పాపులర్ ఫ్రాంచైజీ ఆఖరి చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ (Mission Impossible: The Final Reckoning) కోసం ఆయన 130 నుంచి 150 మిలియన్ డాలర్ల మధ్య పారితోషికం అందుకున్నట్లు సమాచారం. చివరిసారిగా 2012లో ఆయన టాప్ పొజిషన్లో ఉండగా, అప్పట్లో టామ్ క్రూజ్ సంపాదన 75 మిలియన్ డాలర్లుగా ఉండేది.
మిగతా స్టార్ల పరిస్థితి ఏమిటి?
టామ్ క్రూజ్ సంపాదనతో పోలిస్తే మిగతా హాలీవుడ్ స్టార్లు చాలా వెనుకబడే ఉన్నారు. టామ్ క్రూజ్ సంపాదించిన దాంట్లో కనీసం సగం కూడా ఎవరూ అందుకోలేకపోవడం గమనార్హం.
ఏ హీరోకు ఎంత?
డేనియల్ క్రేగ్: ‘నైవ్స్ అవుట్’ (Knives Out) కొత్త చిత్రం కోసం 50 మిలియన్ల డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు.
కామెరాన్ డియాజ్: ఈ హీరోయిన్ ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటిగా నిలిచారు. ‘బ్యాక్ ఇన్ యాక్షన్’ కోసం ఆమె 45 మిలియన్ డాలర్స్ అందుకున్నారు.
బ్రాడ్ పిట్: ‘F1’ సినిమా కోసం 30 మిలియన్ డాలర్స్ తీసుకున్నారు.
లియోనార్డో డికాప్రియో: ‘వన్ బాటిల్ ఆఫ్టర్ అనెదర్’ కోసం 25 మిలియన్ డాలర్స్ అందుకున్నారు.
ఆడమ్ శాండ్లర్: ‘హ్యాపీ గిల్మోర్ 2’ కోసం 20 మిలియన్ డాలర్స్ అందుకున్నారు.
భారత్ నుంచి ‘తలైవా’ రికార్డు!
భారతీయ సినీ పరిశ్రమ విషయానికొస్తే.. ఈ ఏడాది అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా సూపర్ స్టార్ రజనీకాంత్ నిలిచారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కూలీ’ (Coolie) చిత్రం కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ సుమారు 20 మిలియన్ డాలర్స్కు పైగా (అంటే దాదాపు రూ. 160 కోట్లకు పైగా) రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.


వయసు పెరుగుతున్నా
వయసు పెరుగుతున్నా తన స్టామినా తగ్గలేదని టామ్ క్రూజ్ నిరూపిస్తుంటే, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ తన హవాను కొనసాగిస్తున్నారు. అగ్ర తారలు సినిమాలో కోట్లు కొల్లగొట్టడం అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


