ఇంట్లో నల్లులను తరిమికొట్టాలా? ఈ 5 రకాల సహజ పద్ధతులను ఫాలో అవ్వండి
మీ మంచంపై నల్లులు ఉన్నాయా? రసాయన స్ప్రేలు అవసరం లేదు. కొన్ని సులభమైన పద్ధతులు ఆ సమస్యను తొలగిస్తాయి. మీ ఇంట్లో ఒక్కటి కూడా లేకుండా ఉండేందుకు చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
ఒకసారి నల్లులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తే.. ఇక అంతే సంగతులు! చూస్తుంటేనే అవి ఘోరంగా పెరిగిపోతాయి. అవి మంచాలు, దిండ్లు, పరుపులు, సోఫాలు, కుర్చీలు, చివరికి బట్టలలో కూడా గూడు కట్టుకుంటాయి. మీకు కనిపించవు, కానీ అవకాశం దొరికినప్పుడల్లా కుట్టి రక్తం పీలుస్తాయి.

నల్లులు అనేవి చిన్న ఎరుపు-గోధుమ రంగు కీటకాలు. ఇవి సాధారణంగా రాత్రిపూట మానవ రక్తాన్ని తాగుతాయి. అవి చాలా చిన్న సందులలో, పరుపుల అంచులలో, మంచం ఫ్రేములలో, హెడ్బోర్డులలో, చెక్క ఫర్నిచర్ కీళ్లలో కూడా దాక్కుంటాయి. వాటి శరీర ఆకృతి వల్ల సన్నని ప్రదేశాలలో కూడా దూరిపోగలవు. చాలా మంది నల్లులను వదిలించుకోవడానికి రకరకాల రసాయనాలను ఉపయోగిస్తారు. కానీ అవి ఎల్లప్పుడూ పనిచేయవు. అంతేకాకుండా రసాయన ఉత్పత్తులకు లెక్కలేనన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. సహజ పద్ధతిని నమ్మండి. ఈ సులభమైన పద్ధతిలో మీ ఇంటి నుండి నల్లులను శాశ్వతంగా తొలగించండి.
- వేప నల్లులను తరిమికొడుతుంది. నల్లులు వేప వాసనను తట్టుకోలేవు. మంచం పగుళ్లు, సందులలో వేప నూనెను పూర్తిగా రాయండి. లేదా మీరు ఎండిన వేప ఆకులను మంచం మీద పరచవచ్చు.
- మంచం మీద లేదా ఉయ్యాల మీద కర్పూరం పొడిని చల్లండి. నల్లులు కర్పూరం ఘాటైన వాసనను అస్సలు తట్టుకోలేవు.
- మంచం లేదా సోఫాను గోడకు వీలైనంత దూరంగా ఉంచండి. దీనివల్ల నల్లుల బెడద తగ్గుతుంది. నల్లులను తరిమికొట్టడానికి మీరు అప్పుడప్పుడు ఫర్నిచర్పై కిరోసిన్ చల్లవచ్చు.
- దిండ్లు, పరుపులు, మ్యాట్రెస్లలో నల్లులు గూళ్ళు కట్టి ఉంటే వాటిని ఎండలో పెట్టండి. సూర్యరశ్మికి నల్లులు చనిపోతాయి. అంతేకాకుండా సూర్యరశ్మి వేడికి నల్లుల గుడ్లు కూడా నశించిపోతాయి.
- నల్లులను వదిలించుకోవడంలో పసుపు, వేప ప్రభావవంతంగా పనిచేస్తాయి. వేప ఆకులను, పసుపును కలిపి నూరి ముద్దలా చేయండి. ఈ మిశ్రమాన్ని మంచం మీద లేదా నల్లులు ఉన్న ఏ ప్రదేశంలోనైనా రాయండి. ఈ మిశ్రమం వాసన, పదార్థాలు నల్లులను దూరంగా ఉంచుతాయి.
అవి వేగంగా నల్లులు సంతానోత్పత్తి చేస్తాయి. అనేక సాధారణ పురుగుమందులకు నిరోధకతను పెంచుకున్నాయి. నల్లులు కుడితే చేతులు, కాళ్లు, మెడ, ముఖం వంటి బహిర్గతమైన చర్మ ప్రాంతాలపై ఎర్రటి, దురదతో కూడిన బొబ్బలు కనిపిస్తాయి. మీ ఇంట్లో నల్లులు ఉండటం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ చిన్న కీటకాలు మీ నిద్రకు భంగం కలిగించడమే కాకుండా.. మీ ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని కూడా దెబ్బతీస్తాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


