...
...
Next Story

Abhishek Sharma Record: 30 బంతుల్లో 100 రన్స్- అభిషేక్ శర్మ బ్యాటింగ్ విధ్వంసం- హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్

Abhishek Sharma 30 Balls 100 Runs Rohit Sharma Record: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ సిక్సర్ల సునామీ సృష్టించాడు. కేవలం 30 బంతుల్లోనే శతకం పూర్తి చేసి, రోహిత్ శర్మ వేగవంతమైన టీ20 సెంచరీ భారత రికార్డును తుడిచిపెట్టేశాడు.

Published on: Sep 17, 2026, 20:48:48 IST
Advertisement

Abhishek Sharma 30 Balls 100 Runs Rohit Sharma Record: ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం గురువారం (సెప్టెంబర్ 17) రాత్రి భారత యువ సంచలనం అభిషేక్ శర్మ బ్యాటింగ్ అరాచకానికి వేదికగా మారింది. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మూడో టీ20 పోరులో ఈ ఎడమచేతి వాటం ఓపెనర్ మైదానంలో పరుగుల తుఫాన్ సృష్టించాడు.

30 బంతుల్లో 100 రన్స్

30 బంతుల్లో 100 రన్స్- అభిషేక్ శర్మ బ్యాటింగ్ విధ్వంసం- హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్ (AFP)
30 బంతుల్లో 100 రన్స్- అభిషేక్ శర్మ బ్యాటింగ్ విధ్వంసం- హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్ (AFP)

ప్రత్యర్థి బౌలర్లపై దయలేకుండా విరుచుకుపడుతూ కేవలం 30 బంతుల్లోనే సెంచరీ మార్కు అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన భారత బ్యాటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. గతంలో శ్రీలంకపై 35 బంతుల్లో శతకం బాది రోహిత్ శర్మ నెలకొల్పిన రికార్డును అభిషేక్ అధిగమించాడు.

పవర్ ప్లేలో సిక్సర్ల వర్షం

ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే ఆఫ్ఘన్ బౌలర్లను టార్గెట్ చేస్తూ అభిషేక్ మైదానం నలుమూలలా షాట్లు బాదాడు. కేవలం 16 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న అతడు, మొదటి ఆరు ఓవర్ల వ్యవధిలోనే ఏకంగా 76 పరుగులు రాబట్టాడు. ఫలితంగా పవర్ ప్లే ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 100 పరుగులు జోడించింది.

అంతర్జాతీయ టీ20 చరిత్రలోనే భారత్‌కు ఇది అత్యధిక పవర్ ప్లే స్కోరు కావడం విశేషం. అర్ధశతకం సాధించిన తర్వాత మరింత దూకుడు పెంచిన అభిషేక్, తర్వాతి 14 బంతుల్లోనే మరో 50 పరుగులు రాబట్టి 30 బంతుల్లో శతకాన్ని ముద్దాడాడు. క్రీజులో ఉన్నంతసేపు బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తిస్తూ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు అభిషేక్ శర్మ.

రషీద్ ఖాన్ స్పిన్‌కూ బెదరని నయా హిట్టర్

పేసర్లు, స్పిన్నర్లు అనే తేడా లేకుండా అందరి బౌలింగ్‌లోనూ సునాయసంగా సిక్సర్లు బాది స్టేడియంలో ఉన్న ప్రేక్షకులను మైమరిపించాడు. అంతిమంగా రషీద్ ఖాన్ వేసిన బంతిని భారీ షాట్ ఆడబోయి వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి 108 పరుగుల వద్ద అభిషేక్ అవుటయ్యాడు.

అతడు మైదానం వీడే సమయానికి భారత్ 9.5 ఓవర్లలో 142/1 తో భారీ స్కోరు సాధించే దిశగా ప్రయాణాన్ని సుగమం చేసుకుంది. టీ20ల్లో భారత్ పాటిస్తున్న అగ్రెసివ్ బ్యాటింగ్ విధానానికి ఈ ఇన్నింగ్స్ నిదర్శనంగా నిలుస్తుంది.

టెస్టు హోదా దేశాల జాబితాలో నెంబర్ వన్

ఈ మెరుపు శతకంతో అంతర్జాతీయ టీ20ల్లో ఐసీసీ పూర్తిస్థాయి సభ్యత్వం (టెస్ట్ హోదా) కలిగిన దేశాల బ్యాటర్లలో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా అభిషేక్ శర్మ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గతంలో జింబాబ్వే ఆటగాడు సికిందర్ రజా, న్యూజిలాండ్ బ్యాటర్ ఫిన్ అలెన్ 33 బంతుల్లో చేసిన రికార్డులను అభిషేక్ దాటేశాడు.

అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీలు:

సాహిల్ చౌహాన్ (ఎస్టోనియా) - 27 బంతులు (సైప్రస్‌పై, 2024)

ముహమ్మద్ ఫహద్ (టర్కీ) - 29 బంతులు (బల్గేరియాపై, 2025)

అభిషేక్ శర్మ (భారత్) - 30 బంతులు (ఆఫ్ఘనిస్థాన్‌పై, 2026)

జాన్ నికోల్ లోఫ్టీ-ఈటన్ (నమీబియా) - 33 బంతులు (నేపాల్‌పై, 2024)

సికిందర్ రజా (జింబాబ్వే) - 33 బంతులు (గాంబియాపై, 2024)

ఫిన్ అలెన్ (న్యూజిలాండ్) - 33 బంతులు (సౌతాఫ్రికాపై, 2026)

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks