Editorial independence is core to our work. Some links may earn us a commission, without influencing our opinions.
POCO X8 Pro : అదిరే ఏఐ ఫీచర్స్తో పోకో ఎక్స్8 ప్రో సిరీస్- సేల్ షురూ.. ధర, ఆఫర్లు ఇవే!
పోకో తన పవర్ఫుల్ ఎక్స్8 ప్రో సిరీస్ను నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్కార్ట్లో అమ్మకానికి ఉంచింది. ఇందులో పోకో ఎక్స్8 ప్రో, పోకో ఎక్స్8 ప్రో మాక్స్ అనే రెండు మోడళ్లు ఉన్నాయి. రూ. 32,999 ప్రారంభ ధరతో వచ్చిన ఈ ఫోన్లపై బ్యాంక్ ఆఫర్ల ద్వారా రూ. 3,000 వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ పోకో.. గత వారం భారత మార్కెట్లో విడుదల చేసిన పోకో ఎక్స్8 ప్రో సిరీస్ అమ్మకాలు ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యాయి. అద్భుతమైన డిస్ప్లే, భారీ బ్యాటరీ, గూగుల్ జెమిని వంటి ఏఐ ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్లు టెక్ ప్రియులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వీటి ఫీచర్లు, ధర, ఆఫర్లు వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
1. పోకో ఎక్స్8 ప్రో- స్పెసిఫికేషన్లు, ధర..
ఈ స్మార్ట్ఫోన్ 6.69- ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది 120హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్, 3,500 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ను కలిగి ఉంది.
కెమెరా: వెనుకవైపు 50ఎంపీ మెయిన్ కెమెరా (సోనీ ఐఎంఎక్స్882 సెన్సార్, ఓఐఎస్ సపోర్ట్), 8ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో 20ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ: 6,500 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో పాటు 100డబ్ల్యూ హైపర్ ఛార్జ్ సపోర్ట్ ఉంది.
ధరలు: 8 GB + 256 GB: రూ. 32,999
12 GB + 256 GB: రూ. 35,999
12 GB + 256 GB (ఐరన్ మ్యాన్ ఎడిషన్): రూ. 37,999
2. పోకో ఎక్స్8 ప్రో మాక్స్- విశేషాలు..
ఇది ఈ పోకో సిరీస్లో ఫ్లాగ్షిప్ మోడల్. ఇందులో 6.83- ఇంచ్ భారీ అమోలెడ్ డిస్ప్లే ఉంది.
ప్రాసెసర్: ఇందులో మరింత శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 9500ఎస్ చిప్సెట్ను వాడారు.
బ్యాటరీ: ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని 8,500ఎంఏహెచ్ బ్యాటరీ. దీనికి కూడా 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
ఈ రెండు ఫోన్లలో గూగుల్ జెమిని, సర్కిల్ టు సెర్చ్, ఏఐ రైటింగ్, ఏఐ స్పీచ్ రికగ్నిషన్, ఏఐ డైనమిక్ వాల్పేపర్స్ వంటి అత్యాధునిక ఏఐ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
పోకో ఎక్స్8 ప్రో సిరీస్- లాంచ్ ఆఫర్లు..
మొదటి సేల్లో భాగంగా, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి రూ. 3,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. దీనివల్ల బేస్ మోడల్ను రూ. 29,999 కే సొంతం చేసుకోవచ్చు.
శరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More