Petrol price today : భారతదేశంలో ఇంధన ధరల మంట కొనసాగుతోంది. సోమవారం లీటరు పెట్రోల్పై రూ. 2.61, డీజిల్పై రూ. 2.71 చొప్పున పెంచాయి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు. తాజా పెంపుతో దేశ రాజధాని దిల్లీలో నాలుగేళ్ల తర్వాత మొదటిసారి పెట్రోల్ ధర రూ. 100 మార్కును దాటింది. ప్రస్తుతం అక్కడ లీటరు పెట్రోల్ రూ. 102.12, డీజిల్ రూ. 95.20 వద్ద సేల్ అవుతోంది.

గడిచిన రెండు వారాల లోపే పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగుసార్లు పెరిగాయి. దీనితో మే 15 నుంచి ఇప్పటివరకు మొత్తంగా పెట్రోల్పై రూ. 7.35, డీజిల్పై రూ. 7.53 వరకు భారం పడింది. అమెరికా-ఇరాన్ యుద్ధ వాతావరణం, హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా నిలిచిపోవడమే దేశంలో ఇంధన ధరల పెంపునకు కారణం. అయితే, రానున్న రోజుల్లో ఈ రేట్లు ఇంకా పెరగొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
హార్ముజ్ జలసంధి ఎందుకు అంత కీలకం?
భారతదేశంలో ఇంధన ధరలు అకస్మాత్తుగా పెరగడానికి అంతర్జాతీయ చమురు రవాణా మార్గమైన 'హార్ముజ్ జలసంధి' లో ఏర్పడిన ఆటంకాలే ముఖ్య కారణం.
ప్రపంచ సరఫరాలో 1/5 వంతు: ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురు, ద్రవీకృత సహజ వాయువులో దాదాపు ఐదో వంతు ఇరాన్-ఒమన్ మధ్య ఉండే ఈ ఇరుకైన జలసంధి గుండానే ప్రయాణిస్తుంది.
భారత్పై ప్రభావం: భారతదేశం తన ముడి చమురు అవసరాలలో 85% కంటే ఎక్కువ దిగుమతులపైనే ఆధారపడుతుంది. అమెరికా-ఇరాన్ ఘర్షణల కారణంగా ఈ మార్గంలో వాణిజ్య నౌకల రాకపోకలు నిలిచిపోవడంతో మార్కెట్లో చమురు కొరత ఏర్పడుతుందనే భయాలు మొదలయ్యాయి. ఇది అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధరలను భారీగా పెంచేసింది.
ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందా?
పరిశ్రమ నిపుణులు, రాయిటర్స్ విశ్లేషకుల ప్రకారం, చమురు ధరల పెంపు ఇక్కడితో ఆగేలా లేదు. ఐదోసారి కూడా ధరలు పెరిగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.
{{/usCountry}}పరిశ్రమ నిపుణులు, రాయిటర్స్ విశ్లేషకుల ప్రకారం, చమురు ధరల పెంపు ఇక్కడితో ఆగేలా లేదు. ఐదోసారి కూడా ధరలు పెరిగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.
{{/usCountry}}కంపెనీల నష్టాలు: యుద్ధం ప్రారంభ దశలో, దేశంలో అసెంబ్లీ ఎన్నికల సీజన్ ఉన్న సమయంలో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ బ్యారెల్కు 72.87 డాలర్ల నుంచి ఏకంగా 120 డాలర్లకు చేరింది. ఆ సమయంలో కంపెనీలు ధరలను స్థిరంగా ఉంచడం వల్ల భారీగా నష్టపోయాయి. ఇప్పుడు ఆ పాత నష్టాలను పూడ్చుకోవడానికి కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి.
చమురు కంపెనీల రోజువారీ నష్టాలు గతంలో రూ. 1,000 కోట్లుగా ఉండగా, తాజా పెంపుల తర్వాత అవి తగ్గినప్పటికీ పూర్తిగా తొలగిపోలేదు. బ్రెంట్ క్రూడ్ ధర 100 డాలర్ల లోపు స్థిరపడితే తప్ప భారత్లో ధరలు తగ్గే అవకాశం లేదు.
ప్రభుత్వం ముందస్తు సంకేతాలు - పొదుపు చేయాలన్న పీఎం!
ఇంధన ధరల సవరణ అనివార్యమని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే సూచనప్రాయంగా తెలిపింది.
హార్దీప్ సింగ్ పూరి (పెట్రోలియం మంత్రి): అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతిన్న తరుణంలో ఏదో ఒక దశలో ప్రభుత్వం చమురు ధరలపై కఠిన నిర్ణయం తీసుకోక తప్పదని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ: దేశ ప్రజలు కార్పూలింగ్ (వాహనాలను షేర్ చేసుకోవడం), ప్రజా రవాణాను ఎక్కువగా ఉపయోగించడం ద్వారా ఇంధనాన్ని, దేశ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాలని పిలుపునిచ్చారు. ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కోటక్ కూడా భౌగోళిక రాజకీయ అనిశ్చితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
లాభాల్లో ఉన్న కంపెనీలు ధరలు ఎందుకు పెంచుతున్నాయి?
ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్పీసీఎల్)లు గడిచిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ. 77,000 కోట్ల భారీ నికర లాభాలను ఆర్జించాయి. ఇంత లాభాల్లో ఉండి కూడా మళ్లీ ప్రజలపై భారం వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పశ్చిమ ఆసియా సంక్షోభం వల్ల పెరిగిన రవాణా, భీమా ఖర్చులను ప్రస్తుత రిటైల్ ధరలు పూర్తిగా కవర్ చేయడం లేదని కంపెనీల ఎగ్జిక్యూటివ్లు సమర్థించుకుంటున్నారు.
ఊరటనిచ్చే వార్త..
అమెరికా- ఇరాన్ మధ్య శాంతి చర్చల పురోగతిపై ఆదివారం నుంచి వార్తలు వెలువడుతున్నాయి. ఇది ప్రపంచ దేశాలకు ఊరటనిచ్చే విషయం. ఈ వార్తలతోనే చమురు ధర భారీగా పతనమైంది. బ్రెంట్ క్రూడ్ సోమవారం ట్రేడింగ్లో దాదాపు 5.2శాతం పడి బ్యారెల్కి రూ. 98 డాలర్ల దిగువకు చేరింది. ఈ చర్చలు సఫలమైతేనే అంతర్జాతీయంగా చమురు మార్కెట్ శాంతించే అవకాశం ఉంది.