మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు కేసీఆర్ పెట్టిన సంతకం ఏపీకి అడ్వాంటేజ్గా మారిందన్నారు. కృష్ణా, గోదావరి జలాలను సక్రమంగా వాడుకుంటే ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ ఉండేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణకు 299 టీఎంసీలు చాలని అంగీకరిస్తూ పదేళ్ల కాలానికి కేసీఆర్ సంతకం చేశారని గుర్తు చేశారు.

ఇవాళ ‘నీళ్లు-నిజాలు’ అంశంపై ప్రజాభవన్లో మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వ్యయాన్ని రూ.30,000 కోట్ల నుంచి రూ.80,000 కోట్లకు పెంచారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్ నీటి సమస్యలపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాము ఏపీ ప్రభుత్వానికి మౌనంగా సహకరిస్తున్నాననే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారంటూ మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేసి మేడిగడ్డకు తరలించడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం రూ.1.40 లక్షల కోట్లకు పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించడానికి ముందు కేసీఆర్ సమగ్ర ప్రాజెక్టు నివేదికను(డీపీఆర్) కూడా తయారు చేయలేదని ఆరోపించారు.
“రాజకీయ లబ్దికోసం మేము పక్క రాష్ట్రాన్ని తిట్టడం లేదు. జరిగిన అన్యాయంను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రానికి కృష్ణా జలాల్లో 811 టీఎంసీలు కేటాయించారు. రాష్ట్రం విడిపోయినప్పుడు ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు అని లెక్కలు తీశారు. తెలంగాణకు 34 శాతం చాలని అంగీకరిస్తూ పదేళ్ల కాలానికి కేసీఆర్, హరీష్ రావు సంతకం చేశారు. కేసీఆర్ సంతకం పెట్టి తెలంగాణకు శాశ్వతంగా గొంతుకోశారు. ఏపీకి అడ్వాంకేటేజీగా మారింది. ఓపిక లేని మనిషి చేసిన తప్పు అది” అని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు.
“తెలంగాణ నీటి వాటాల విషయంలో కేసీఆర్, హరీశ్ రావులు చేసిన తప్పులకు ఉరి తీసినా తప్పులేదు. ఇదే తప్పు మిడిల్ ఈస్ట్ దేశాల్లో చేసి ఉంటే చౌరస్తాలోనే ప్రజలతో రాళ్లతో కొట్టి చంపేసి ఉండేవారు. మన దేశంలో కసబ్ లాంటి ఉగ్రవాదిని కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే విచారించి చర్యలు తీసుకున్నారు.కసబ్ లాంటి వ్యక్తికే అన్ని వసతులు కల్పించగా… కేసీఆర్ కు ఎన్ని వసతులు ఉంటాయో తెలుసుగా..? సంపాదించిన సొమ్ములతో ఎలాంటి న్యాయవాదులైనైనా తెచ్చుకుంటారు" అంటూ సీఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.
{{/usCountry}}“తెలంగాణ నీటి వాటాల విషయంలో కేసీఆర్, హరీశ్ రావులు చేసిన తప్పులకు ఉరి తీసినా తప్పులేదు. ఇదే తప్పు మిడిల్ ఈస్ట్ దేశాల్లో చేసి ఉంటే చౌరస్తాలోనే ప్రజలతో రాళ్లతో కొట్టి చంపేసి ఉండేవారు. మన దేశంలో కసబ్ లాంటి ఉగ్రవాదిని కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే విచారించి చర్యలు తీసుకున్నారు.కసబ్ లాంటి వ్యక్తికే అన్ని వసతులు కల్పించగా… కేసీఆర్ కు ఎన్ని వసతులు ఉంటాయో తెలుసుగా..? సంపాదించిన సొమ్ములతో ఎలాంటి న్యాయవాదులైనైనా తెచ్చుకుంటారు" అంటూ సీఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.
{{/usCountry}}పార్టీని బతికించుకునేందుకు కేసీఆర్.. మళ్లీ నీళ్ల సెంటి మెంట్ను వాడుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు పేరు చెప్పి తెలంగాణలో మళ్లీ పార్టీని బతికించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ సభకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. వారి గౌరవానికి ఎలాంటి భంగం కలిగించామని… సలహాలు సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తాము పొరపాట్లు చేస్తే సరిదిద్దొచ్చని చెప్పారు. జానారెడ్డి గతంలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో లేఖలు రాశారని.. కనీసం మీరు(కేసీఆర్) ఆ పనైనా చేయండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు.
సీఎం వ్యాఖ్యలపై హరీశ్ ఆగ్రహం:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం చేశారు. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అనుముల రేవంత్ రెడ్డి అని ఆరోపించారు.
“బేసిన్ల పై బేసిక్ నాలెడ్జ్ లేదన్నది బహిరంగ సత్యం. ఇవాళ కొత్తగా తెలిసింది, ముఖ్యమంత్రికి బచావత్ ట్రిబ్యునల్ కు, బ్రిజేష్ ట్రిబ్యునల్ కు తేడా తెలియదని వెల్లడైంది. సభకు వస్తే కేసీఆర్ ను అవమానించం అని ఒకవైపు చెబుతూనే అదే ప్రెస్ మీట్ లో కేసీఆర్ గారిని కసబ్ తో పోల్చుతావా? నీకు తెలిసిందళ్లా అనాగరికమైన భాష, అసభ్య పదజాలం, బూతు ప్రసంగం. కేసీఆర్ గారిని, నన్ను ఉరి తీయాలని, రాళ్లతో కొట్టాలని అంటూ అనాగరిక వ్యాఖ్యానాలు చేస్తూ మరోవైపు మర్యాద పాటిస్తానని సుద్దపూసలా నటిస్తావా..?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
“నువ్వు గోదావరి బనకచర్ల మీద సుప్రీంకోర్టులో పోరాడేదే నిజం అయితే, ఢిల్లీ మీటింగ్ ఎందుకు పోయినవు, కమిటీ ఎందుకు వేసినవు, ఆ కమిటీ వేసిన సంగతి ప్రజలకు వెల్లడించకుండా ఎందుకు రహస్యంగా దాచినవు? కమిటీ వేయడం అంటేనే ఏపీ జలదోపిడికి తలుపులు తెరవడం అనే విషయం మెడకాయ మీద తలకాయ ఉన్న వారెవరికైనా అర్థం అవుతది. కేసీఆర్ గారు 299కి ఒప్పుకున్నది నిజం అయితే, మొత్తం 811 టిఎంసీలు పున:పంపిణీ చేయాలని రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే ఎందుకు లేఖ రాశారు..?” అని హరీశ్ రావు ప్రశ్నించారు.
“సెక్షన్ 3 ద్వారా కృష్ణా జలాల పున: పంపిణీ జరిపిస్తామనే కేంద్రం హామి మేరకు కేసు విత్ డ్రా చేసుకున్న సంగతి నీకు తెల్వదా? ఎందుకు ఈ నిజాన్ని దాచి పెట్టి గోబెల్స్ ప్రచారానికి ఒడిగడుతున్నావు? తెలంగాణను సాధించి, ప్రజలకు ఎంత మేలు చేసారో 9 ఏళ్ల పోరాటంతో సెక్షన్ 3 కృష్ణా జలాల పున: పంపిణీ సాధించి అంతటి మేలును తెలంగాణ ప్రజలకు చేసిన మహనీయుడు కేసీఆర్. ఆయనను విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్లే” అని హరీశ్ రావు చెప్పారు.