Air India Express Hyderabad to Tirupati Flights : దేశీయ విమాన ప్రయాణికులకు ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బిగ్ అప్డేట్ ఇచ్చింది. తిరుపతితో సహా దేశంలోని ఆరు కీలక నగరాలకు సెప్టెంబరు 1వ తేదీ నుంచి కొత్త విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ నూతన సర్వీసులు అందుబాటులోకి రావడంతో విమాన అనుసంధానం మరింత బలోపేతం కానుంది.
- తిరుపతి
- ఔరంగాబాద్
- కోయంబత్తూర్
- జామ్నగర్
- జోధ్పూర్
- మదురై

ఈ ఆరు నగరాలను దేశంలోని ప్రధాన మెట్రో నగరాలైన హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నైలతో నేరుగా అనుసంధానించనున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పేర్కొంది.
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో…. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్లే భక్తులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాల నుంచి తిరుపతికి నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి రావడంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, వయోవృద్ధులు అత్యంత వేగంగా, సుఖవంతంగా ఆధ్యాత్మిక క్షేత్రానికి చేరుకోవచ్చని ఎయిర్లైన్స్ ప్రతినిధులు వెల్లడించారు.
కేవలం ఆధ్యాత్మిక యాత్రికులకే కాకుండా, ఈ నూతన సర్వీసులు వ్యాపార, పర్యాటక రంగాలకు కూడా కొత్త ఊపిరి పోయనున్నాయి. ఔరంగాబాద్, జోధ్పూర్, మదురై, కోయంబత్తూర్ వంటి చారిత్రక, పారిశ్రామిక నగరాలకు మెట్రో నగరాల నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ లభించడం వల్ల ప్రయాణికుల రద్దీ పెరగడంతో పాటు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకుంటుంది. సెప్టెంబరు 1 నుంచి ఈ విమానాల టికెట్ బుకింగ్లు, సర్వీసుల వేళలు పూర్తి స్థాయిలో అమల్లోకి రానున్నాయి.
టైమింగ్స్ ఇలా…..
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వెల్లడించిన వివరాల ప్రకారం…. శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిరుపతికి ప్రతీరోజూ మధ్యాహ్నం 1.30 గంటలకు విమానం బయలుదేరుతుంది. ఈ విమానం కేవలం గంట పది నిమిషాల వ్యవధిలోనే…. అంటే మధ్యాహ్నం 2.40 గంటలకల్లా తిరుపతి చేరుకుంటుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు, వ్యాపార ప్రయాణికులకు ఈ నాన్స్టాప్ సర్వీసు ఎంతో సౌకర్యవంతంగా మారనుంది.
{{/usCountry}}ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వెల్లడించిన వివరాల ప్రకారం…. శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిరుపతికి ప్రతీరోజూ మధ్యాహ్నం 1.30 గంటలకు విమానం బయలుదేరుతుంది. ఈ విమానం కేవలం గంట పది నిమిషాల వ్యవధిలోనే…. అంటే మధ్యాహ్నం 2.40 గంటలకల్లా తిరుపతి చేరుకుంటుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు, వ్యాపార ప్రయాణికులకు ఈ నాన్స్టాప్ సర్వీసు ఎంతో సౌకర్యవంతంగా మారనుంది.
{{/usCountry}}అలాగే హైదరాబాద్ - చెన్నై మార్గంలో కూడా రోజువారీ ఉదయం సర్వీసును అందుబాటులోకి తెస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రతిరోజూ ఉదయం 8.05 గంటలకు విమానం బయలుదేరి… ఉదయం 9.40 గంటలకు చెన్నై గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఉదయమే చెన్నై చేరుకునే వెసులుబాటు ఉండటంతో ఐటీ, వ్యాపార రంగానికి చెందిన ప్రయాణికులకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది.