ఒకప్పుడు ఉత్తరప్రదేశ్లో షూటింగులకు వెళ్లాలంటే హీరోయిన్లు భయపడేవారని.. కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని టాలీవుడ్ విలన్, గోరఖ్ పూర్ ఎంపీ రవి కిషన్ వ్యాఖ్యానించారు. ఇటీవల గోరఖ్పూర్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్న ఒక కార్యక్రమంలో రవి కిషన్ ప్రసంగిస్తూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
అప్పట్లో షూటింగ్ అంటే భయం.. ఇప్పుడు అభయం!

వేదికపై నటుడు, ఎంపీ రవి కిషన్ మాట్లాడుతూ.. "ఉత్తరప్రదేశ్కు ఇప్పుడు జయజయధ్వానాలు వినిపిస్తున్నాయి. గతంలో యూపీ అంటేనే వద్దనేవారు. అక్కడ కాల్పులు జరుగుతాయని, షూటింగులకు రామని హీరోయిన్లు అనేవారు. కానీ, తాజాగా మాధురి దీక్షిత్ గారు ఇక్కడికి వచ్చి మూడు రోజుల పాటు గోరఖ్పూర్లో ఉండి వెళ్లారు. ఆమె ఇక్కడ ఎంతో సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండి ముంబైకి తిరిగి వెళ్లారు" అని తెలిపారు.
అంతేకాకుండా, మాధురీ దీక్షిత్ను కలవడానికి వచ్చిన జనాన్ని ఉద్దేశించి రవికిషన్ సరదాగా కొన్ని కామెంట్లు కూడా చేశారు. మాధురి దీక్షిత్ను కలిసేందుకు చాలామంది జుట్టుకు డై (రంగు) వేసుకుని వచ్చారని, కొందరికైతే ఆ డై కారిపోతున్నా పట్టించుకోలేదని నవ్వుతూ చెప్పారు.
తొలిసారి మాధురీతో కలిసి..
కాగా, త్వరలో నెట్ఫ్లిక్స్లో ఓటీటీ సినిమా ‘మా బెహన్’ (Maa Behen)లో రవికిషన్, మాధురీ దీక్షిత్ కలిసి నటించారు. ‘తుమ్హారీ సులు’ ఫేమ్ సురేష్ త్రివేణి దర్శకత్వం వహించిన ఈ డార్క్ కామెడీ చిత్రంలో ఈ ఇద్దరితోపాటు తృప్తి డిమ్రి, ధర్నా దుర్గా కూడా నటించారు.
నెట్ఫ్లిక్స్ ఓటీటీ కామెడీ మూవీ మా బెహన్పై రవికిషన్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. "దశాబ్దాలుగా మేమంతా ఆరాధించే సూపర్ స్టార్ మాధురీ గారు. నేను శ్రీదేవి గారితో కలిసి పనిచేశాను కానీ, మాధురీ గారితో చేసే అవకాశం ఇప్పుడే దక్కింది. ఇది నా అదృష్టం" అని పేర్కొన్నారు.
బిజీ బిజీగా రవికిషన్, మాధురి
{{/usCountry}}నెట్ఫ్లిక్స్ ఓటీటీ కామెడీ మూవీ మా బెహన్పై రవికిషన్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. "దశాబ్దాలుగా మేమంతా ఆరాధించే సూపర్ స్టార్ మాధురీ గారు. నేను శ్రీదేవి గారితో కలిసి పనిచేశాను కానీ, మాధురీ గారితో చేసే అవకాశం ఇప్పుడే దక్కింది. ఇది నా అదృష్టం" అని పేర్కొన్నారు.
బిజీ బిజీగా రవికిషన్, మాధురి
{{/usCountry}}ఈ ఏడాది రవికిషన్ ‘మామ్లా లీగల్ హై సీజన్ 2’, ‘టాక్స్ డిపార్ట్మెంట్ స్టోరీ’, ‘మీర్జాపూర్: ది ఫిల్మ్’, ‘ధమాల్ 4’ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు. రవికిషన్ తెలుగులో రేసుగుర్రం, కిక్ 2, సుప్రీమ్ వంటి పలు తెలుగు సినిమాల్లో నటించారు. రేసుగుర్రం చిత్రంలో విలన్గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు నటుడు రవికిషన్.
ఇక మాధురీ దీక్షిత్ గతేడాది ‘భూల్ భులయ్యా 3’లో కీలక పాత్రలో మెరిశారు. అంతకుముందు జియో హాట్స్టార్ ఓటీటీ సిరీస్ ‘మిసెస్ దేశ్పాండే’లో సీరియల్ కిల్లర్గా నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం మాధురి, రవి కిషన్ కలిసి నటించిన మా బెహన్ ఓటీటీ మూవీ టీజర్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.