ఓటీటీలోకి నిన్న రిలీజైన అఖండ 2- బాలకృష్ణ, బోయపాటి నాలుగో సినిమాకు షాకింగ్ టాక్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అఖండ 2 తాండవం ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఆసక్తిగా మారిపోయాయి. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన నాలుగో సినిమా అఖండ 2 డిసెంబర్ 13న విడుదలైన విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమాకు షాకింగ్ టాక్ చోటు చేసుకున్న నేపథ్యంలో అఖండ 2 ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదేనంటూ టాక్ నడుస్తోంది.

Published on: Dec 13, 2025 12:56 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీ రిలీజ్ అయ్యే సినిమాలపై ఎల్లప్పుడు అమితమైన ఆసక్తి నెలకొంటుంది. అందులోనూ కొత్తగా థియేటర్లలో విడుదలైన సినిమాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ తెలుసుకోవాలని విడుదలైన రోజు నుంచి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఆడియెన్స్. ఈ క్రమంలో థియేట్రికల్ రిలీజ్ రోజు నుంచే సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌‌ఫామ్స్ ఏంటనేది తెలిసిపోతుంది.

ఓటీటీలోకి నిన్న రిలీజైన అఖండ 2- బాలకృష్ణ, బోయపాటి నాలుగో సినిమాకు షాకింగ్ టాక్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి నిన్న రిలీజైన అఖండ 2- బాలకృష్ణ, బోయపాటి నాలుగో సినిమాకు షాకింగ్ టాక్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్

ఈ నేపథ్యంలో ఇలాంటి ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ నందమూరి నటసింహం బాలకృష్ణ లేటేస్ట్ మూవీపై ఉంది. ఆ సినిమానే అఖండ 2 తాండవం. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అఖండకు సీక్వెల్‌గా తెరకెక్కిన సినిమానే అఖండ 2 తాండవం. మాస్ డైరెక్టర్ బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కిన నాలుగో సినిమా ఇది.

ఆలస్యంగా థియేటర్లలోకి

సింహా, లెజెండ్, అఖండ వంటి బిగ్గెస్ట్ హిట్స్ తర్వాత బోయపాటి-బాలయ్య కాంబోలో వచ్చిన అఖండ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలా భారీ అంచనాల నడుమ వారం రోజులు ఆలస్యంగా శుక్రవారం (డిసెంబర్ 12) అంటే నిన్న థియేటర్లలో విడుదలైంది అఖండ 2 తాండవం సినిమా.

నార్త్‌లో మాత్రం మరోలా

అయితే, అఖండ 2 సినిమాకు షాకింగ్ టాక్ వస్తోంది. తెలుగులో బాలకృష్ణ తాండవానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలే అన్నట్లుగా ఉంది. కానీ, నార్త్‌లో మాత్రం అఖండ 2పై రెస్పాన్స్ అంతంతమాత్రంగానే ఉంది. అఖండ 2ని పేలవమైన సినిమాగా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

అఖండ 2 కలెక్షన్స్

ఇలా షాకింట్ టాక్ నడుమ కూడా తొలి రోజున అఖండ 2 అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఇండియాలో రూ. 30 కోట్లకుపైగా నెట్ కలెక్షన్స్‌ను అఖండ 2 తాండవం సినిమా రాబట్టింది. ఈ నేపథ్యంలో అఖండ 2 ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఆసక్తి నెలకొంది. అఖండ 2 ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లుగా టాక్ నడుస్తోంది.

అఖండ 2 ఓటీటీ రైట్స్ ధర

డిజిటల్ స్ట్రీమింగ్‌లలో దిగ్గజ సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్ సుమారు రూ. 80 కోట్లు వెచ్చించి అఖండ 2 తాండవం ఓటీటీ హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం. అలాగే, థియేటర్లలో విడుదలైన నెల రోజుల గ్యాప్‌లోనే అఖండ 2 ఓటీటీ రిలీజ్ చేయాలని మూవీ నిర్మాణ సంస్థ 14 రీల్స్‌తో నెట్‌ఫ్లిక్స్ డీల్ కూడా కుదుర్చుకున్నట్లు టాక్.

సంక్రాంతి సందర్భంగా

ఈ లెక్కన జనవరిలో నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లోనే అఖండ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అంతేకాకుండా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9న నెట్‌ఫ్లిక్స్‌లో అఖండ 2 తాండవం ఓటీటీ రిలీజ్ కానుందనే మరో వార్త చక్కర్లు కొడుతోంది.

నెట్‌ఫ్లిక్స్‌లోనే అఖండ 2 తాండవం

ఇలా థియేటర్లలో నిన్న రిలీజైన అఖండ 2 నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ప్రీమియర్ కానుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, అఖండ 2 తాండవం సినిమాలో బ్యూటిఫుల్ సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. హీరో ఆది పినిశెట్టి విలన్‌గా చేశాడు. బాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలి మల్హోత్రా అఖండ 2తోనే తెలుగులో నటిగా డెబ్యూ ఎంట్రీ ఇచ్చింది.