Anchor Pearle Maaney Loses 3 Lakh Instagram Followers: సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ ఏళ్ల తరబడి సంపాదించుకున్న గుర్తింపును, లక్షలాది మంది ఫాలోవర్లను క్షణాల్లో ఆవిరి చేసేస్తుందని నిరూపించే సంఘటన ఇది. మలయాళ బిగ్ బాస్ రన్నరప్, ప్రసిద్ధ టీవీ యాంకర్, యూట్యూబర్ పెర్లీ మానీ (Pearle Maaney) ప్రస్తుతం నెటిజన్ల ఆగ్రహజ్వాలల్లో చిక్కుకున్నారు.
విద్యార్థి నిరసనలపై పోస్ట్

ఈ నెల 24న కేరళలో చోటుచేసుకున్న విద్యార్థుల నిరసనలపై పెర్లీ మానీ స్పందించిన తీరు, ఆ తర్వాత అనుసరించిన వైఖరి తీవ్ర వివాదాస్పదంగా మారింది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఆమె ఏకంగా 3 లక్షల మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లను కోల్పోవడం పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
అసలు వివాదం ఏమిటి?
కేరళలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలపై పెర్లీ మానీ ఇన్స్టాగ్రామ్లో ఒక సుదీర్ఘమైన సందేశాన్ని రాసుకొచ్చారు. "ఏ లక్ష్యం కూడా ప్రాణాలు తీసేంత గొప్పది కాదు. మీ ప్రాణాలకు ప్రమాదం అనిపిస్తే నిరసనలు ఆపి ఇళ్లకు వెళ్లిపోండి" అని పెర్లీ మానీ రాసుకొచ్చారు.
విద్యార్థులకు మంచి విద్యావ్యవస్థ దక్కాలని కోరుకుంటున్నానని చెబుతూనే, ఉద్యమం దారి తప్పకూడదని హితవు పలికారు. అయితే, ఈ పోస్ట్కు బ్యాక్గ్రౌండ్లో కాషాయం కలర్ ఉండటంతోపాటు "కామెంట్స్ సెక్షన్ నా స్వేచ్ఛ స్వాతంత్య్రానికి ప్రతీక" అని క్యాప్షన్ పెట్టడం, ఎవరూ కామెంట్లు చేయకుండా డిసేబుల్ చేశారు.
ఈ వైఖరిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. "సిల్వర్ స్పూన్తో పుట్టిన నీకు సామాన్యుల కష్టాలు, ప్రవేశ పరీక్షల కోసం పడే పోరాటాలు ఏం తెలుస్తాయి?" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామెంట్లు నిలిపివేయడంతో ఆగ్రహించిన వీక్షకులు ఆమె పాత పోస్టుల కింద ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు.
3 లక్షల ఫాలోవర్ల లాస్..
వివాదం ముదరకముందు ఇన్స్టాగ్రామ్లో ఆమెకు 27 లక్షల (2.7 మిలియన్స్) మంది ఫాలోవర్లు ఉండగా, ఈ పోస్ట్ తర్వాత ఆ సంఖ్య ఒక్కసారిగా 24 లక్షలకు (2.4 మిలియన్స్) పడిపోయింది. యూట్యూబ్, ఫేస్బుక్ ప్లాట్ఫామ్లలో కూడా వేలాది మంది పెర్లీ మానిని అన్ఫాలో చేస్తున్నారు.
{{/usCountry}}వివాదం ముదరకముందు ఇన్స్టాగ్రామ్లో ఆమెకు 27 లక్షల (2.7 మిలియన్స్) మంది ఫాలోవర్లు ఉండగా, ఈ పోస్ట్ తర్వాత ఆ సంఖ్య ఒక్కసారిగా 24 లక్షలకు (2.4 మిలియన్స్) పడిపోయింది. యూట్యూబ్, ఫేస్బుక్ ప్లాట్ఫామ్లలో కూడా వేలాది మంది పెర్లీ మానిని అన్ఫాలో చేస్తున్నారు.
{{/usCountry}}ఈ వ్యవహారంపై మలయాళ చలనచిత్ర రంగానికి చెందిన దిగ్గజ దర్శకుడు సిబి మలయిల్ (మోహన్ లాల్ 'కిరీటం', 'దేవాసురం' వంటి ఆల్టైమ్ క్లాసిక్స్ అందించిన దర్శకుడు) పెర్లీ వైఖరిని బహిరంగంగా తప్పుపట్టారు. దీంతో పెర్లీ మానీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఆయనపై పరోక్షంగా నిప్పులు చెరిగారు.
సీనియర్ డైరెక్టర్పై వ్యాఖ్యలు!
"ఒక ఫ్లాప్ డైరెక్టర్ నా నాలుగు పేజీల పోస్ట్పై 10 పేజీల స్క్రిప్ట్ రాస్తున్నారు. దానికి కారం, అజినోమోటో జోడించి మరీ ప్రచారం చేస్తున్నారు. నా ఇష్టమైన రంగు కాషాయం, అది మన జాతీయ జెండాపై ఉంటే నాకు ఇంకా ఇష్టం" అని వ్యాఖ్యానించారు.
వెన్నెముక లేని కొడుకును పెంచలేదు.. డైరెక్టర్ కుమారుడి వార్నింగ్!
తన తండ్రిని 'ఫ్లాప్ డైరెక్టర్' అని సంబోధించడంతో సిబి మలయిల్ కుమారుడు జో మలయిల్ తీవ్రంగా స్పందించారు. పెర్లీ మానీని ఉద్దేశించి సోషల్ మీడియాలో ఘాటు కౌంటర్ ఇచ్చారు.
"నువ్వు ఫ్లాప్ డైరెక్టర్ అని అంటున్నది మా నాన్నను. ఎవరితో పెట్టుకుంటున్నావో సరిగ్గా చూసుకో. నీ అరకొర దౌత్యనీతి సందేశాలను 57 లక్షల మంది చదవాలని కోరుకునే నువ్వు, 7 స్లైడ్లు చదవడానికి అంత బద్ధకించాలా? ఆ 'ఫ్లాప్ డైరెక్టర్' వెన్నెముక లేని కొడుకును పెంచలేదు. కానీ నీ తండ్రి ఒక పిరికిపందను పెంచాడు. ధైర్యముంటే ముందడుగు వేయ్" అని జో మలయిల్ సవాల్ విసిరారు.
వ్యక్తిగత పోరుగా
సామాజిక అంశంపై మొదలైన ఈ చర్చ కాస్తా, ఇప్పుడు ఇండస్ట్రీలోని ప్రముఖుల మధ్య వ్యక్తిగత పోరుగా మారడంతో మలయాళ డిజిటల్ మీడియాలో ఈ వార్త తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఆర్ఆర్ఆర్ ఇంటర్వ్యూ బ్యూటీ
ఇదిలా ఉంటే, ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళిలను పెర్లీ మానీ ఇంటర్వ్యూ చేసి క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ ఇంటర్వ్యూలో పెర్లీ మానీ పేరును రామ్ చరణ్ గుర్తుపెట్టుకోకపోవడం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది.