TV Show India Ke Top 1% OTT Start Date: బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు ప్రముఖ బాలీవుడ్ సీనియర్ హీరో, యానిమల్ నటుడు అనిల్ కపూర్ మరోసారి హోస్ట్గా రానున్నారు. బిగ్ బాస్ ఓటీటీ 3 విజయం తర్వాత ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సరికొత్త రియాలిటీ గేమ్ షో 'ఇండియా కే టాప్ 1%' (India Ke Top 1%).
క్విజ్ షోల మాదిరిగా కాకుండా

బ్రిటన్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'ది 1% క్లబ్' (The 1% Club) ఫార్మాట్కు ఇది భారతీయ వెర్షన్. సాధారణంగా టీవీల్లో వచ్చే క్విజ్ షోల మాదిరిగా ఇది సాధారణ జ్ఞానం (General Knowledge) లేదా కరెంట్ అఫైర్స్పై ఆధారపడి ఉండదు. కేవలం సమయస్ఫూర్తి, తార్కిక ఆలోచన (Logic), పరిశీలనా శక్తి, ప్యాటర్న్ రికగ్నిషన్ ఆధారంగా సాగుతుంది.
100 మంది పోటీదారులు.. 1% మైండ్ పవర్!
ఈ గేమ్ షోలో ప్రతి ఎపిసోడ్లో 100 మంది పోటీదారులు పాల్గొంటారు. సాధారణంగా 90 శాతం మంది సమాధానం చెప్పగలిగే సులువైన ప్రశ్నతో ఆట ప్రారంభమవుతుంది. రౌండ్ రౌండ్కు ప్రశ్నల తీవ్రత పెరుగుతూ, చివరకు కేవలం 1 శాతం మంది మాత్రమే సమాధానం చెప్పగల అత్యంత కష్టమైన ప్రశ్నకు చేరుకుంటుంది. ఈ ప్రశ్నలను భారత్ వ్యాప్తంగా సర్వేలు నిర్వహించి ప్రత్యేకంగా రూపొందించారు.
ఎంత సమాచారం తెలుసనేది కాదు
"ఈ షో ప్రేక్షకులు ఇప్పటివరకు చూసిన వాటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. మీకు ఎంత సమాచారం తెలుసనేది ఇక్కడ ముఖ్యం కాదు, మీరు ఎలా ఆలోచిస్తున్నారనేదే అసలు పాయింట్. ప్రతి సవాలు మీ పరిశీలన, లాజిక్, సమయస్ఫూర్తిని పరీక్షిస్తుంది" అని అనిల్ కపూర్ తెలిపారు.
1 శాతం తెలివితేటలు ఉన్నాయని భావిస్తే
"ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఆటలో భాగం కావచ్చు. కొన్ని క్షణాలు మిమ్మల్ని ఆశ్చర్యపరిస్తే, మరికొన్ని క్షణాలు మీ ఆలోచనా విధానాన్ని ప్రశ్నించేలా చేస్తాయి. మీలో ఆ 1 శాతం తెలివితేటలు ఉన్నాయని భావిస్తే వెంటనే రిజిస్టర్ చేసుకోండి" అని అనిల్ కపూర్ చెప్పుకొచ్చారు.
14 ఏళ్ల కుర్రాడి నుంచి 40 ఏళ్ల పెద్దవారి వరకు
{{/usCountry}}"ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఆటలో భాగం కావచ్చు. కొన్ని క్షణాలు మిమ్మల్ని ఆశ్చర్యపరిస్తే, మరికొన్ని క్షణాలు మీ ఆలోచనా విధానాన్ని ప్రశ్నించేలా చేస్తాయి. మీలో ఆ 1 శాతం తెలివితేటలు ఉన్నాయని భావిస్తే వెంటనే రిజిస్టర్ చేసుకోండి" అని అనిల్ కపూర్ చెప్పుకొచ్చారు.
14 ఏళ్ల కుర్రాడి నుంచి 40 ఏళ్ల పెద్దవారి వరకు
{{/usCountry}}ఈ షో ప్రత్యేకత ఏంటంటే.. టీవీ చూస్తున్న కుటుంబ సభ్యులంతా ఇంట్లో కూర్చునే కలిసి ఆడుకోవచ్చు. 14 ఏళ్ల కుర్రాడి నుంచి 40 ఏళ్ల పెద్దవారి వరకు ఎవరైనా తమ లాజిక్తో చివరి ప్రశ్న వరకు వెళ్లే అవకాశం ఉండటం దీని ప్రత్యేకత.
రూ. కోటి జాక్పాట్.. సెప్టెంబర్ 5 నుంచి ప్రసారం
అంతర్జాతీయంగా 15కు పైగా దేశాల్లో ఎనలేని విజయాన్ని సాధించిన ఈ ఫార్మాట్ను భారతదేశంలో బనిజయ్ ఆసియా సంస్థ నిర్మిస్తోంది. యుకేలో గత ఐదేళ్లలో అత్యంత విజయం సాధించిన క్విజ్ షోగా ఇది రికార్డు సృష్టించింది.
జియో హాట్స్టార్ ఓటీటీలో
ఈ పోటీలో విజేతగా నిలిచిన వారికి రూ.1 కోటి నగదు బహుమతి లభిస్తుంది. 'ఇండియా కే టాప్ 1%' షో సెప్టెంబర్ 5 నుంచి ప్రముఖ హిందీ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ స్టార్ ప్లస్తో పాటు జియో హాట్స్టార్ (JioHotstar) ఓటీటీ వేదికగా ఒకేసారి ప్రసారం కానుంది.
టీవీ, ఓటీటీ రెండింట్లో
అటు టీవీ, ఇటు ఓటీటీలో సరికొత్త గేమ్ షోగా ఇండియా కే టాప్ 1% ప్రారంభం కానుంది.