బాలీవుడ్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి 'యానిమల్' సినిమాతో విలన్గా భారీ విజయాన్ని అందుకున్న నటుడు బాబీ డియోల్. బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలోనూ విలన్గా అదరగొట్టిన బాబీ డియోల్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోనూ తన జోరు చూపిస్తున్నారు.
గ్రీన్స్టోన్ ఇన్వెస్ట్మెంట్స్

ముంబైలోని అంధేరీ వెస్ట్లో గల ఒక ప్రముఖ బిజినెస్ పార్క్లో బాబీ డియోల్, ఆయన భార్య తాన్యా డియోల్ భారీ పెట్టుబడి పెట్టారు. వీరిద్దరి భాగస్వామ్యంలో ఉన్న 'గ్రీన్స్టోన్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్' సంస్థ ద్వారా సుమారు 3,400 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఐదు కమర్షియల్ ఆఫీస్ యూనిట్లను కొనుగోలు చేశారు.
రూ. 15 కోట్ల డీల్..
ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ప్రకారం, అంధేరీ వెస్ట్లోని లింక్ రోడ్లో ఉన్న 'యురా బిజినెస్ పార్క్ - ఫేజ్ 2' లోని రెండో అంతస్తులో ఈ 5 ఆఫీసులను బాబీ డియోల్ దంపతులు కొన్నారు. ఈ డీల్ విలువ దాదాపు రూ. 15.05 కోట్లు కాగా, దీని కోసం సుమారు రూ. 90 లక్షలకు పైగా స్టాంప్ డ్యూటీ, రూ. 1.50 లక్షల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్లు తెలుస్తోంది.
రోషన్ ఫ్యామిలీ పక్కనే!
ఫిబ్రవరి 27, 2026న ఈ లావాదేవీ రిజిస్టర్ అయింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, బాబీ డియోల్ కొన్న అదే బిల్డింగ్లో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కుటుంబానికి కూడా ఆఫీసులు ఉన్నాయి. హృతిక్ రోషన్, ఆయన తండ్రి రాకేష్ రోషన్ (HRX డిజిటెక్ LLP), తల్లి ప్రమీల రోషన్ (ఫిల్మ్కుంజ్ బాంబే) కలిసి ఇదే భవనంలోని మూడు, నాలుగో అంతస్తుల్లో మొత్తం 10 ఆఫీస్ యూనిట్లను గతంలోనే కొనుగోలు చేశారు.
2025 నవంబర్లో రోషన్ కుటుంబం సుమారు రూ. 28 కోట్లు వెచ్చించి ఈ ప్రాపర్టీని సొంతం చేసుకుంది. ఇప్పుడు బాబీ డియోల్ కూడా అదే బిల్డింగ్లో ఐదు ఆఫీస్ల కొనడంతో ఈ ప్రాపర్టీ హాట్ టాపిక్గా మారింది.
2027 నాటికి నిర్మాణం పూర్తి
{{/usCountry}}2025 నవంబర్లో రోషన్ కుటుంబం సుమారు రూ. 28 కోట్లు వెచ్చించి ఈ ప్రాపర్టీని సొంతం చేసుకుంది. ఇప్పుడు బాబీ డియోల్ కూడా అదే బిల్డింగ్లో ఐదు ఆఫీస్ల కొనడంతో ఈ ప్రాపర్టీ హాట్ టాపిక్గా మారింది.
2027 నాటికి నిర్మాణం పూర్తి
{{/usCountry}}ప్రస్తుతం ఈ బిజినెస్ పార్క్ నిర్మాణ దశలో ఉంది. డాక్యుమెంట్ల ప్రకారం, 2027 డిసెంబర్ నాటికి ఈ ఆఫీసుల పొసెషన్ (అప్పగింత) జరిగే అవకాశం ఉంది. ఆఫీసులతో పాటు ఐదు కార్ పార్కింగ్ స్థలాలను కూడా బాబీ డియోల్ దంపతులు పొందారు.
ఈ విషయంపై స్పందన కోరుతూ తాన్యా డియోల్ సంస్థలకు మెయిల్ పంపినప్పటికీ, ఇప్పటివరకు వారి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. బాబీ డియోల్ కూడా ప్రస్తుతం అందుబాటులోకి రాలేదు.
భారీగా ప్రాపర్టీల కొనుగోలు
ఇదిలా ఉంటే, ఇటీవల కాలంలో బాలీవుడ్ సెలబ్రిటీలు తమ సంపాదనను ముంబైలోని కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టడం ఒక ట్రెండ్గా మారింది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్, ప్రీతి జింటా వంటి వారు కూడా భారీగా ప్రాపర్టీలు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.