టాలీవుడ్లో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. మొన్న రష్మిక-విజయ్ దేవరకొండ, నిన్న అల్లు శిరీష్.. ఇలా వరుసగా యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండటంతో తెలుగు చిత్ర పరిశ్రమలో సందడి నెలకొంది.
పెళ్లి పీటలు ఎక్కనున్న హీరో

ఈ క్రమంలోనే మరో యంగ్ హీరో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. అతనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇటీవల కిష్కింధపురి సినిమాతో మంచి హిట్ అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్కు గుడ్ బై చెప్పబోతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రేపే నిశ్చితార్థం?
బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లికి సంబంధించిన చర్చలు ఇప్పటికే ఇంట్లో పూర్తయ్యాయని, రేపే అంటే మార్చి 8నే నిశ్చితార్థం జరిగే అవకాశం ఉందని సమాచారం. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుకను ఏకాంతంగా నిర్వహించాలని భావిస్తున్నారట. ఎంగేజ్మెంట్ పూర్తయిన వెంటనే పెళ్లి తేదీ, వేదిక వంటి వివరాలను బెల్లంకొండ కుటుంబం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని టాక్.
ఎవరీ కావ్య రెడ్డి?
అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి సినీ పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదు. హైదరాబాద్కు చెందిన కావ్య రెడ్డి అనే యువతితో ఆయన ఏడడుగులు వేయబోతున్నట్లు తెలుస్తోంది.
కావ్య రెడ్డి కుటుంబ నేపథ్యం
కావ్య రెడ్డి తాతగారు గతంలో జడ్జిగా పనిచేశారని, తండ్రి ప్రముఖ లాయర్ అని సమాచారం. అంటే లాయర్ ఇంటికి హీరో సాయి శ్రీనివాస్ అల్లుడు కానున్నట్లు తెలుస్తోంది. రెండు కుటుంబాల మధ్య చాలా కాలంగా పరిచయం ఉందని, పెద్దలు కుదిర్చిన సంబంధం ఇదని సన్నిహితులు చెబుతున్నారు. సాయి శ్రీనివాస్ కాబోయే భార్య కావ్య రెడ్డి గురించి వివరాలు తెలియడంతో అప్పుడే సోషల్ మీడియాలో ఆమె పేరు ట్రెండింగ్లోకి వచ్చేసింది.
‘అల్లుడు శీను’ నుంచి ‘కిష్కింధపురి’ దాకా
2014లో ‘అల్లుడు శీను’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తన తొలి సినిమాతోనే ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటుడి అవార్డును అందుకున్నారు. ‘జయ జానకి నాయక’, ‘సాక్ష్యం’, ‘సీత’, ‘రాక్షసుడు’ వంటి చిత్రాలతో మాస్ హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.
వందల మిలియన్ల వ్యూస్
{{/usCountry}}2014లో ‘అల్లుడు శీను’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తన తొలి సినిమాతోనే ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటుడి అవార్డును అందుకున్నారు. ‘జయ జానకి నాయక’, ‘సాక్ష్యం’, ‘సీత’, ‘రాక్షసుడు’ వంటి చిత్రాలతో మాస్ హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.
వందల మిలియన్ల వ్యూస్
{{/usCountry}}ముఖ్యంగా ఆయన నటించిన హిందీ డబ్బింగ్ సినిమాలకు యూట్యూబ్లో వందల మిలియన్ల వ్యూస్ వస్తుంటాయి. దీనివల్ల ఉత్తరాదిలోనూ శ్రీనివాస్కు భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఆ కారణంతోనే హిందీలో ఛత్రపతి సినిమాను రీమేక్ చేశారు. ఇక ఇటీవల భైరవం, కిష్కింధపురి సినిమాలతో మంచి విజయం అందుకున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్
కొత్త అధ్యాయం
ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’, ‘హైందవం’ వంటి క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అటు కెరీర్ పరంగా, ఇటు వ్యక్తిగత జీవితం పరంగా శ్రీనివాస్ ఇప్పుడు ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.