Deepika Padukone Ranveer Singh Blessed With Second Child Baby: బాలీవుడ్ స్టార్ జంట దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ ఇంట మరోసారి మహాలక్ష్మి అడుగుపెట్టింది. వీరికి రెండో సంతానంగా పండంటి ఆడపిల్ల జన్మించింది. శనివారం (సెప్టెంబర్ 19, 2026) చిన్నారి తమ జీవితంలోకి అడుగుపెట్టినట్లు ఈ దంపతులు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.
చిన్నారి పాదాల ముద్రతో

పసిపాప చిన్నారి పాదాల ముద్రతో కూడిన ప్రత్యేక ఫొటోను షేర్ చేస్తూ.. రణ్వీర్, దీపికా, మొదటి కుమార్తె దువా పేర్లను ఆ పోస్టులో పొందుపరిచారు. దీంతో దీపికా కూతురు దువాకు చిట్టి చెల్లెలు వచ్చినట్లు అయింది. ఈ తీపి కబురు తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో ఈ దంపతులకు శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు.
వివాహ బంధం.. మొదటి కుమార్తె 'దువా'
ఇటలీలోని లేక్ కోమో వేదికగా 2018 నవంబర్ 18న దీపికా పదుకొణె, రణ్వీర్ అత్యంత వైభవంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 2024 సెప్టెంబర్ 8న ఈ దంపతులకు మొదటి కుమార్తె 'దువా' జన్మించింది. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 19న తాము రెండోసారి తల్లిదండ్రులం కాబోతున్నట్లు దీపికా-రణ్వీర్ వెల్లడించారు.
{{/usCountry}}ఇటలీలోని లేక్ కోమో వేదికగా 2018 నవంబర్ 18న దీపికా పదుకొణె, రణ్వీర్ అత్యంత వైభవంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 2024 సెప్టెంబర్ 8న ఈ దంపతులకు మొదటి కుమార్తె 'దువా' జన్మించింది. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 19న తాము రెండోసారి తల్లిదండ్రులం కాబోతున్నట్లు దీపికా-రణ్వీర్ వెల్లడించారు.
{{/usCountry}}అక్క కాబోతున్న సంతోషంలో చిన్నారి దువా ప్రెగ్నెన్సీ కిట్ పట్టుకున్న క్యూట్ ఫొటోను షేర్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ప్రసవానికి కొద్ది రోజుల ముందు ఈ జోడీ తీయించుకున్న ప్రత్యేక మదర్హుడ్ ఫొటోషూట్ చిత్రాలు నెట్టింట వైరల్ అయ్యాయి.
సిద్ధివినాయకుడి ఆశీస్సులు
డెలివరీకి ఒక్క రోజు ముందు దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ ముంబైలోని ప్రముఖ సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా దేవుడి దర్శనం కోసం వచ్చిన అభిమానులకు చిరునవ్వుతో అభివాదం చేస్తూ కనిపించారు. అంతకుముందు గురువారం రణ్వీర్ సింగ్ ఒక్కడే లాల్బాగ్చా రాజా పండల్ను దర్శించుకున్నారు. తెల్లటి చిక్కన్కారీ కుర్తా పైజామా ధరించి వినాయకుడి ఆశీస్సులు అందుకున్నారు.
"మాతృత్వం నన్ను పూర్తిగా మార్చేసింది"
తల్లిగా మారడం వల్ల తన జీవిత దృక్పథం ఏ విధంగా మారిందో దీపికా గతంలో పలు సందర్భాల్లో పంచుకున్నారు. గతేడాది ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాతృత్వంపై స్పందిస్తూ.. "పిల్లలు పుట్టకముందు కూడా నాకు ఓపిక ఎక్కువే, కానీ తల్లి అయ్యాక నాలో ఆ సహనం, భావోద్వేగాల లోతు మరింత పెరిగాయి" అని దీపికా పదుకొణె చెప్పుకొచ్చారు.
"మాతృత్వం మనల్ని సౌకర్యవంతమైన గూడు నుంచి బయటకు తెస్తుంది. నేను ఎప్పుడూ అందరితో అంతగా కలిసిపోయే మనిషిని కాను. కానీ ఇతర తల్లిదండ్రులతో సంభాషించడం, పిల్లల ప్లేస్కూల్ విషయాలు చూసుకోవడం వల్ల నాలో సామాజిక దృక్పథం పెరిగింది. ఇది ఒక మంచి మార్పు" అని దీపికా వ్యాఖ్యానించారు.
అల్లు అర్జున్ సినిమా రాకాలో
ఇక సినిమాల విషయానికి వస్తే, దీపికా పదుకొణె వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్తో కలిసి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో 'కింగ్' చిత్రంలో నటిస్తున్నారు. దీనికితోడు స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కనున్న భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'రాకా' (Raaka)లో దీపికా హీరోయిన్గా అలరించనున్నారు.
మరోవైపు రణ్వీర్ సింగ్ చివరిగా 'ధురంధర్: ది రివెంజ్' చిత్రంలో కనిపించగా, ప్రస్తుతం పోస్ట్ అపోకలిప్టిక్ థ్రిల్లర్ 'ప్రళయ్' కోసం సిద్ధమవుతున్నారు.