Dil Raju Comments In Toxic Pre Release Event: రాకింగ్ స్టార్ యశ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతు మోహన్దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటించారు.
ఆ డబ్బింగ్ వెర్షన్స్లో

కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇంగ్లిష్, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన టాక్సిక్ సినిమా హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో డబ్బింగ్ వెర్షన్స్లో రిలీజ్ కానుంది. ఆగస్టు 26, 2026న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు వస్తోంది టాక్సిక్.
టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్
ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్లోని మల్లారెడ్డి కాలేజ్ గ్రౌండ్లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను చాలా గ్రాండ్గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నిర్మాత దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
రామానాయుడు గారి తర్వాత
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. "ఈరోజు దేశంలోని అన్ని భాషల్లో సినిమాలు నిర్మిస్తున్న ప్రొడ్యూసర్ కేవీఎన్ గారు. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ.. ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్నారు. రామానాయుడు గారి తర్వాత ఇండియాలో అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్న ప్రొడ్యూసర్గా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకు అభినందనలు" అని అన్నారు.
కథలో ఉన్న బలాన్ని నమ్మి
"‘కేజీఎఫ్’ సినిమాతో యశ్ గారితో నాకు పరిచయం అయింది. ‘కేజీఎఫ్’ తర్వాత ఎవరైనా ఇంకా పెద్దగా ఆలోచిస్తారు. కానీ, యశ్ గారు మాత్రం ఒక కొత్త దర్శకురాలిని పరిచయం చేస్తూ, కథలో ఉన్న బలాన్ని నమ్మి ‘టాక్సిక్’ సినిమా చేశారు. ఇండియన్ సినిమాను పాన్ వరల్డ్ సినిమాగా మార్చాలనే ఆయన విజన్కు హ్యాట్సాఫ్" అని దిల్ రాజు ప్రశంసించారు.
విజువల్స్ చూస్తే మతి పోయింది
"రాజమౌళి గారి తర్వాత ఇలాంటి ఫిల్మ్మేకర్లు ఇండియన్ సినిమాను పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విజన్, నమ్మకం ఉంటేనే ఇలాంటి సినిమా సాధ్యమవుతుంది. ఈ సినిమా విజువల్స్ చూస్తే మతి పోయింది. నిర్మాతలు ఎంత చెబితే అంత ఇచ్చి ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నాం" అని వెల్లడించారు ప్రొడ్యూసర్ దిల్ రాజు.
2 వేల కోట్లు కలెక్ట్ చేస్తుందన్నారు
{{/usCountry}}"రాజమౌళి గారి తర్వాత ఇలాంటి ఫిల్మ్మేకర్లు ఇండియన్ సినిమాను పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విజన్, నమ్మకం ఉంటేనే ఇలాంటి సినిమా సాధ్యమవుతుంది. ఈ సినిమా విజువల్స్ చూస్తే మతి పోయింది. నిర్మాతలు ఎంత చెబితే అంత ఇచ్చి ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నాం" అని వెల్లడించారు ప్రొడ్యూసర్ దిల్ రాజు.
2 వేల కోట్లు కలెక్ట్ చేస్తుందన్నారు
{{/usCountry}}"కంపోజర్ విశాల్ మిశ్రా టాక్సిక్ సినిమా రూ.2,000 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పారు. అది ఈ యూనిట్ మొత్తానికి ఈ సినిమాపై ఉన్న నమ్మకానికి నిదర్శనం. యశ్ గారితో సినిమా చేయడానికి నేను కూడా వెయిటింగ్. ఆయన అనౌన్స్మెంట్ కోసం ఎదురుచూస్తుంటాను" అని దిల్ రాజు తన స్పీచ్ ముగించారు.
చాలా మంచి అనుభవం
హుమా ఖురేషి మాట్లాడుతూ.. "మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు. ముందుగా మా దర్శకురాలు గీతు మోహన్ దాస్కు థాంక్స్. ఇంత అద్భుతమైన సినిమాలో నన్ను భాగం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. నయనతార, రుక్మిణి వసంత్ వంటి వారితో కలిసి నటించడం చాలా మంచి అనుభవం" అని అన్నారు.
చాలా కాలం గుర్తుండిపోతుంది
"యశ్ గారితో కలిసి పనిచేయడం కూడా ఎంతో గొప్ప అనుభూతి. గీతు ఎంతో అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా చాలా కాలం గుర్తుండిపోతుంది" అని బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ హుమా ఖురేషి పేర్కొన్నారు.