...
...
Next Story

Jayaho Janardhana Movie: లవ్ కామెడీ డ్రామాగా జయహో జనార్ధన- పోస్టర్ లాంచ్ చేసిన సంపత్ నంది- డైరెక్టర్ ఎం చెప్పారంటే?

Jayaho Janardhana Movie Poster Launch By Sampath Nandi: తెలుగులో లవ్ కమర్షియల్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ జయహో జనార్ధన. పానుగంటి శరత్ రెడ్డి నిర్మాతగా, దర్శకత్వం వహించిన జయహో జనార్ధన పోస్టర్‌ను డైరెక్టర్ సంపత్ నంది విడుదల చేశారు. ఈ సందర్భంగా టీమ్‌కు ఆయన విషెస్ తెలిపారు.

Published on: Apr 10, 2026, 14:23:51 IST
Advertisement

Jayaho Janardhana Poster Launch: డిఫరెంట్ టైటిల్‌తో తెలుగులో వస్తోన్న లేటెస్ట్ మూవీ జయహో జనార్ధన. ఈ సినిమాను పానుగంటి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పానుగంటి శరత్ రెడ్డి నిర్మాతగా నిర్మిస్తున్నారు. అంతేకాకుండా నిర్మాత అయిన పానుగంటి శరత్ రెడ్డి స్వయంగా జయయో జనార్ధన సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

జయహో జనార్ధన నటీనటులు

లవ్ కామెడీ డ్రామాగా జయహో జనార్ధన- పోస్టర్ లాంచ్ చేసిన సంపత్ నంది- డైరెక్టర్ ఎం చెప్పారంటే?
లవ్ కామెడీ డ్రామాగా జయహో జనార్ధన- పోస్టర్ లాంచ్ చేసిన సంపత్ నంది- డైరెక్టర్ ఎం చెప్పారంటే?

జయహో జనార్ధన సినిమాలో నరేష్ వాసం, రమ్యశ్రీ హీరో హీరోయిన్లుగా చేశారు. అలాగే, వీరితోపాటు ఈ చిత్రంలో 30 ఇయర్స్ పృథ్వీ, రోలర్ రఘు, చలాకి చంటి, మైమ్ మధు, దయానంద రెడ్డి, జబర్దస్త్ రాఘవ, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ రాజమౌళి, పటాస్ ప్రవీణ్, నెమలి రాజు, బీవీఎమ్ శివశంకర్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

అలాగే, జయహో జనార్ధన సినిమాకి ఎడిటర్‌గా నందమూరి హరి, కెమెరామెన్‌గా విజయ్ ఠాగూర్ ఆర్ డైరెక్టర్‌గా భూపతి యాదగిరి పనిచేయగా చరణ్ అర్జున్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన జయహో జనార్ధన పోస్టర్ లాంచ్ టాలీవుడ్ డైరెక్టర్ సంపత్ నంది చేతుల మీదుగా జరిగింది.

సంపత్ నంది విషెస్

లవ్ కమర్షియల్ కామెడీ డ్రామాగా జయహో జనార్ధన చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు నిర్మాత, దర్శకుడు పానుగంటి శరత్ రెడ్డి తెలిపారు. జయహో జనార్ధన పోస్టర్ లాంచ్ సందర్భంగా దర్శకుడు సంపత్ నంది నిర్మాత, డైరెక్టర్ పానుగంటి శరత్ రెడ్డిని, మూవీ టీమ్‌ను అభినందించారు. అలాగే, జయహో జనార్ధన సినిమా మంచి విజయం సాధించాలని సంపత్ నంది ఆకాంక్షించారు.

కమర్షియల్ ఫార్మాట్ మార్చి రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ మూవీగా ఓదెల సినిమాను నిర్మించి మంచి విజయం అందుకున్నారు డైరెక్టర్ సంపత్ నంది. దీని తర్వాత ఓదెలకు సీక్వెల్‌గా ఓదేల 2 చిత్రాన్ని రూపొందించారు సంపత్ నంది. మిల్కీ బ్యూటీ తమన్నా మెయిన్ లీడ్ రోల్ చేసిన ఓదెల 2 అంతగా సక్సెస్ సాధించలేకపోయింది.

రూరల్ హారర్ డివోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఓదెల 2లో తమన్నా శివశక్తి అనే విభిన్నమైన పాత్రలో కనిపించి ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో ఓదెల 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇకపోతే సంపత్ నంది తన తదుపరి దర్శకత్వ బాధ్యతల కోసం ఒక భారీ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని ఫిలిం నగర్ సమాచారం.

చిరంజీవి, పవన్ కల్యాణ్ కోసం

గతంలో మెగాస్టార్ చిరంజీవి లేదా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని డైరెక్టర్ సంపత్ నంది ప్రయత్నాలు చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం, సంపత్ నంది ఒక పవర్ ఫుల్ మల్టీస్టారర్ కథను రాసుకున్నారని, ఇందులో టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు అగ్ర హీరోలు నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాకపోతే దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe