బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధరంధర్ 2’ (Dhurandhar: The Revenge) బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ చిత్రంపై ప్రశంసలు, విమర్శలతో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

చాలా వరకు ధురంధర్ 2పై సినీ సెలబ్రిటీలు మహేశ్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, జూనియర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్, రవితేజ, కంగనా రనౌత్, రాజమౌళి వంటి వారు ప్రశంసించారు. తాజాగా సీనియర్ హీరోయిన్, బీజేపీ నాయకురాలు జయప్రద కూడా ఈ ‘ధురంధర్ 2’ గూఢచారి కథను ప్రశంసలతో ముంచెత్తారు.
"ఇలాంటి సినిమా చూసి చాలా కాలమైంది"
ధురంధర్ 2 సినిమా కథాంశం, నటీనటుల ప్రతిభ అద్భుతమని పేర్కొంటూనే, కావాలని విమర్శలు, ట్రోలింగ్ చేసే వారికి సీనియర్ హీరోయిన్ జయప్రద స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. న్యూస్ ఏజెన్సీ ANIతో మాట్లాడిన జయప్రద.. ధురంధర్ ది రివేంజ్ కోసం మూవీ యూనిట్ పడిన కష్టాన్ని అభినందించారు.
"చాలా ఏళ్ల తర్వాత ప్రజలు చూస్తున్న ఒక అద్భుతమైన చిత్రమిది. ఈ సినిమా విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను. ఏదైనా విషయాన్ని విమర్శించడం చాలా సులభం. కానీ, ఇంత గొప్ప స్క్రిప్ట్ రాసి, దాన్ని సక్సెస్ చేయడానికి నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతో శ్రమించారు. ప్రతి ఒక్కరూ థియేటర్లకు వెళ్లి ఈ సినిమాను చూడాలని, ఆదరించాలని నేను కోరుతున్నాను" అని మాజీ ఎంపీ జయప్రద పిలుపునిచ్చారు.
700 కోట్లకు పైగా కలెక్షన్స్
పాకిస్థాన్ అండర్వరల్డ్లో పాగా వేసిన భారత గూఢచారి జస్కీరాత్ సింగ్ రంగీ (రణవీర్ సింగ్) కథగా వచ్చిన ఈ చిత్రం యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 700 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది.
ధురంధర్ 2పై విమర్శలు
{{/usCountry}}పాకిస్థాన్ అండర్వరల్డ్లో పాగా వేసిన భారత గూఢచారి జస్కీరాత్ సింగ్ రంగీ (రణవీర్ సింగ్) కథగా వచ్చిన ఈ చిత్రం యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 700 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది.
ధురంధర్ 2పై విమర్శలు
{{/usCountry}}అయితే, సోషల్ మీడియాలో ధురంధర్ 2 సినిమాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పొలిటికల్ కామెంటేటర్ ధ్రువ్ రాఠీ వంటి వారు ఈ సినిమాను విమర్శించగా, పెద్ద నోట్ల రద్దు (Demonetisation) వంటి అంశాలను సమర్థించడంపై కొందరు ఇది ‘ప్రొపగాండా’ అని ఆరోపిస్తున్నారు.
విమర్శలపై జయప్రద కౌంటర్
ఇలా ధురంధర్ 2 విమర్శలు, ట్రోలింగ్ నేపథ్యంలో జయప్రద చేసిన కామెంట్స్ వారికి కౌంటర్లా ఉన్నాయి. దీంతో జయప్రద చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అడ్వాన్స్ బుకింగ్స్లోనే రికార్డ్
ఇదిలా ఉంటే, 2025లో వచ్చిన సూపర్ హిట్ ధురంధర్ మూవీకి సీక్వెల్గా వచ్చిన ధురంధర్ ది రివేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్లోనే రికార్డులు సృష్టించింది. ఒకే రోజులో రూ. 100 కోట్లు వసూలు చేసిన ఏకైక హిందీ చిత్రంగా చరిత్రకెక్కింది.
గూఢచారి ప్రయాణం
మార్చి 19న విడుదలైన ధురంధర్ 2 సినిమాలో రణ్వీర్ సింగ్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, యామీ గౌతమ్ (అతిథి పాత్ర), డానిష్ ఇక్బాల్ వంటి స్టార్ కాస్ట్ తమ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ప్రస్తుతం ఈ గూఢచారి ప్రయాణం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా కొనసాగుతోంది.