ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్: ది రివెంజ్’ ప్రభంజనం సృష్టిస్తోంది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్పై టాలీవుడ్ అగ్ర హీరోలు ప్రశంసల వర్షం కురిపిస్తుంటే, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మాత్రం తనదైన శైలిలో సెటైర్లు వేశారు.

ధురంధర్ 2 సినిమాను పొగిడిన అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండలను ఉద్దేశించి ప్రకాష్ చేసిన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.
బాలీవుడ్ స్టార్లు ట్వీట్ చేశారా
సోషల్ మీడియా వేదికగా ఒక నెటిజన్ స్పందిస్తూ.. "ధురంధర్ 2 సినిమాను ఇప్పటివరకు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్, మహేశ్ బాబులు మెచ్చుకున్నారు. మరి బాలీవుడ్ స్టార్లు ఎవరైనా ట్వీట్ చేశారా?" అని ప్రశ్నించారు.
ప్రకాష్ రాజ్ ఏమన్నారంటే?
దీనికి ప్రకాష్ రాజ్ బదులిస్తూ.. "కృతజ్ఞత తీర్చుకోవాల్సిన అవసరాలు (Signs of Obligations) ఇప్పుడు దక్షిణాదికి కూడా పాకాయి.. #justasking" అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చారు. అంటే, ఈ హీరోలు కేవలం మొహమాటానికో లేదా ఇతర కారణాల వల్లనో ధురంధర్ 2ని పొగుడుతున్నారనే అర్థం వచ్చేలా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు.
మరో ట్వీట్లో, పాత హిందీ పాట వింటూ ప్రశాంతంగా ఉన్న వీడియోను షేర్ చేస్తూ.. "నేను ధురంధర్కు చాలా దూరంగా ఉన్నాను" ప్రకాష్ రాజ్ అని పేర్కొన్నారు.
టాలీవుడ్ హీరోల ప్రశంసలు ఇవే:
మహేశ్ బాబు: "ధురంధర్ 2 ఒక అద్భుతమైన విస్ఫోటనం! రణ్వీర్ కెరీర్లోనే ఇది అత్యుత్తమ ప్రదర్శన. ఆదిత్య ధర్ ఈ చిత్రాన్ని మలిచిన తీరు అమోఘం. మ్యాడీ (మాధవన్) నటన, శశ్వత్ సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి."
{{/usCountry}}మహేశ్ బాబు: "ధురంధర్ 2 ఒక అద్భుతమైన విస్ఫోటనం! రణ్వీర్ కెరీర్లోనే ఇది అత్యుత్తమ ప్రదర్శన. ఆదిత్య ధర్ ఈ చిత్రాన్ని మలిచిన తీరు అమోఘం. మ్యాడీ (మాధవన్) నటన, శశ్వత్ సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి."
{{/usCountry}}జూనియర్ ఎన్టీఆర్: "భారతీయ ప్రేక్షకులకు ఒక తుఫానును పరిచయం చేసిన టీమ్కు సెల్యూట్. రణ్వీర్ స్క్రీన్పై విశ్వరూపం చూపించారు. ఆదిత్య ధర్ తన దార్శనికతతో ప్రతి ఫ్రేమ్ను ఎలివేట్ చేశారు. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ పాత్రలు ఎంతో లోతుగా ఉన్నాయి. క్లాసిక్ నటుడు అక్షయ్ ఖన్నా వేసిన పునాదిపై ఈ సీక్వెల్ అద్భుతంగా నిలబడింది."
అల్లు అర్జున్: "సినిమా చూశాను.. దేశభక్తిని చాలా స్టైలిష్గా చూపించారు. ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా ఇది. నా సోదరుడు రణ్వీర్ లాంటి వెర్సటైల్ యాక్టర్ మన దేశంలో ఉండటం గర్వకారణం. ఆదిత్య ధర్ గారు బంతిని స్టేడియం వెలుపలికి కొట్టారు (సిక్సర్ కొట్టారు)."
విజయ్ దేవరకొండ: “రేపటి నుంచి భారతీయ సినిమాలో కొత్త చరిత్ర మొదలవుతుంది. ఆదిత్య ధర్ ఒక జీనియస్. రణ్వీర్ బాంబులా పేలారు. భారత్ మాతాకీ జై!”
సినిమా నేపథ్యం
కాగా, మార్చి 19న ధురంధర్ 2 విడుదల అయింది. ఈ చిత్రం కరాచీలోని ల్యారీ నేపథ్యంలో సాగుతుంది. గతంలో జరిగిన పార్లమెంట్ దాడి, 26/11 ముంబై దాడుల వంటి వాస్తవ సంఘటనల ఆధారంగా గూఢచారి కార్యకలాపాలను ఈ సినిమాలో చూపించారు. రణ్వీర్ సింగ్ ఇందులో జస్కీరత్ సింగ్ రంగి, హమ్జా అలీ మజారీ అనే రెండు విభిన్న పార్శ్యాలున్న పాత్రలో నటించారు.