...
...
Next Story

OTT Trending: ఓటీటీ ట్రెండింగ్‌లో దుమ్మురేపుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్- నాశనమయ్యే సూర్యుడు, కాపాడే టీచర్- తెలుగులో!

Project Hail Mary OTT Trending And Streaming Telugu: ఓటీటీలో ఇటీవల రిలీజ్ అయిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినమా ప్రాజెక్ట్ హెయిల్ మేరీ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. సూర్యుడు నాశనం అయి భూమికి ప్రమాదం పొంచి ఉండే కథతో తెరకెక్కింది. మరి తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాను ఎక్కడ చూడాలో లుక్కేద్దాం.

Published on: Jul 6, 2026, 10:35:23 IST
Advertisement

Project Hail Mary OTT Trending: వీకెండ్ వచ్చిందంటే చాలు ఓటీటీలో ఏదైనా మంచి సినిమా చూడాలని ప్రతి ఒక్కరూ వెతుకుతుంటారు. తెలుగు చలనచిత్ర అభిమానులకు హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలంటే ఎప్పుడూ ఎంతో క్రేజ్ ఉంటుంది.

విజువల్ వండర్ సైన్స్ ఫిక్షన్

ఓటీటీ ట్రెండింగ్‌లో దుమ్మురేపుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్- నాశనమయ్యే సూర్యుడు, కాపాడే టీచర్- తెలుగులో! (IMDb)
ఓటీటీ ట్రెండింగ్‌లో దుమ్మురేపుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్- నాశనమయ్యే సూర్యుడు, కాపాడే టీచర్- తెలుగులో! (IMDb)

గతంలో వచ్చిన 'ఇంటర్‌స్టెల్లార్', 'ది మార్షియన్' లాంటి అంతరిక్ష నేపథ్య చిత్రాలను మనవాళ్లు థియేటర్లలోనూ, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోనూ ఎంతగా ఆదరించారో తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో స్పేస్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన మరో విజువల్ వండర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో తెగ హల్‌చల్ చేస్తోంది.

ఆ సినిమానే ప్రాజెక్ట్ హెయిల్ మేరీ (Project Hail Mary). ఈ ఏడాది మార్చిలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. కేవలం మన దేశంలోనే ప్రాజెక్ట్ హెయిల్ మేరీ సినిమా దాదాపు రూ. 79 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఓటీటీ స్క్రీన్‌పై హవా

ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఏకంగా 683 మిలియన్ డాలర్ల (ఇండియన్ కరెన్సీలో రూ. 5700 కోట్లు) వసూళ్లతో సరికొత్త రికార్డు సృష్టించింది. వెండితెరపై అదరగొట్టిన ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా, ఇప్పుడు ఓటీటీ స్క్రీన్‌పై కూడా అదే స్థాయి హవా కొనసాగిస్తోంది.

ఇటీవల జూలై 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రాజెక్ట్ హెయిల్ మేరీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం వంటి అనేక భాషల్లో ప్రాజెక్ట్ హెయిల్ మేరీ ఓటీటీ రిలీజ్ అయింది. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ట్రెండింగ్‌లో దుమ్ములేపుతోంది ఈ సినిమా.

టాప్ 5లో ఓటీటీ ట్రెండింగ్

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. సూర్యుడు నాశనం అవడం మొదలు కావడంతో ఇతర గ్రహాలతోపాటు భూమికి ప్రమాదం ఏర్పడుతుంది. దాని నుంచి కాపాడేందుకు స్పేస్‌లోకి ఓ సాధారణ సైన్స్ టీచర్‌ను పంపిస్తారు సైంటిస్టులు. ఆ తర్వాత ఏమైందనేదే ప్రాజెక్ట్ హెయిల్ మేరీ సినిమా కథ.

స్పేస్‌లో ఒంటరి పోరాటం.. జ్ఞాపకాలు లేని టీచర్

సినిమాను వివరంగా చూస్తే.. ఒక పాఠశాలలో పిల్లలకు సైన్స్ పాఠాలు చెప్పే ఒక టీచర్ (ర్యాన్ గోస్లింగ్) హఠాత్తుగా ఒక అంతరిక్ష నౌకలో (Space Ship) కళ్లు తెరుస్తాడు. తీరా చూస్తే అతనికి తన గతం ఏదీ గుర్తుండదు. తానెవరు, అక్కడికి ఎలా వచ్చాడు, అసలు తన మిషన్ ఏంటి అనే విషయాలు పూర్తిగా మర్చిపోతాడు.

తనతో పాటు ఆ స్పేస్‌షిప్‌లో ఉన్న మిగతా వ్యోమగాములంతా అప్పటికే చనిపోయి ఉంటారు. అలాంటి విపత్కర పరిస్థితిలో, శూన్యంలో చిక్కుకుపోయిన ఆ టీచర్ అక్కడి నుంచి సురక్షితంగా భూమికి ఎలా తిరిగి చేరాడనేదే ఈ సినిమా క్లైమాక్స్.

పరాయి గ్రహం స్నేహితుడితో ఎమోషనల్ జర్నీ

అంతరిక్షంలో ఒంటరిగా మిగిలిపోయిన ఆ సైన్స్ టీచర్‌కు ఒక వింత అనుభవం ఎదురవుతుంది. వేరే గ్రహానికి చెందిన ఒక వింత ప్రాణి అతనికి స్నేహితుడిగా మారుతుంది. ఆ పరాయి గ్రహం మిత్రుడు మన హీరోను తిరిగి తన ఇంటికి పంపించడానికి రకరకాలుగా సహాయం చేస్తాడు.

ఓటీటీ ట్రెండింగ్‌లో

విభిన్న గ్రహాలకు చెందిన ఈ ఇద్దరి మధ్య సాగే స్నేహం, వారి మధ్య ఏర్పడే ఎమోషనల్ బాండింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తెలుగులో మంచి సైన్స్ ఫిక్షన్ డ్రామాను ఎంజాయ్ చేయాలనుకునేవారు అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ప్రాజెక్ట్ హెయిల్ మేరీ మూవీపై ఓ లుక్కేయవచ్చు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks