బుల్లితెర యాంకర్గా సూపర్ క్రేజ్ అందుకున్న ఉదయ భాను వెండితెరపై కూడా తనదైన ముద్ర వేసింది. లీడర్ మూవీలో రాజశేఖర అనే పాటలో నర్తించిన ఉదయ భాను చాలా కాలం గ్యాప్ తర్వాత త్రిబాణధారి బార్బరిక్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.
ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన సిరీస్

ఇప్పుడు ఉదయ భాను ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన తెలుగు వెబ్ సిరీస్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ఓటీటీ సిరీస్లో రాజీవ్ కనకాల, ఉదయ భాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ మెయిన్ లీడ్ రోల్స్ చేశారు.
కృష్ణ పోలూరు దర్శకత్వం వహించిన డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు ఓటీటీ స్ట్రీమింగ్ నేపథ్యంలో రీసెంట్గా ప్రివ్యూ షో వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో ఉదయ భాను ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
ఓటీటీ రిలీజ్ కోసం
ఉదయ భాను మాట్లాడుతూ .. "డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ఓటీటీ రిలీజ్ కోసం నేను ఎంతో ఎదురుచూస్తున్నాను. చాలా వేగంగా ఈ ఓటీటీ సిరీస్ షూటింగ్ పూర్తి చేశాం. నేను ఇందులోని కథకు, కారెక్టర్కు ఎంతో కనెక్ట్ అయ్యాను" అని అన్నారు.
"నా తొలి రోజుల్లో జీ తెలుగు ఛానెల్ ఎంతో సపోర్ట్ చేసింది. ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన జయంత్ గారికి థాంక్స్. జీవితంలో ఎలాంటి సమస్య వచ్చిన శ్రీరామ్ సలహాలు తీసుకుంటూ ఉంటాను. శ్రీరామ్తో ఎన్నో ఏళ్ల నుంచి గొప్ప స్నేహబంధం ఉంది" అని ఉదయభాను తెలిపారు.
ఇప్పుడున్న సమాజానికి అవసరం
"పోలీస్ ఆఫీసర్ రోల్ చేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉండేది. ఓ తల్లిగా ఈ పాత్రకు ఎంతో కనెక్ట్ అయ్యాను. ప్రతీ కుటుంబం, ప్రతీ పేరెంట్, ప్రతీ కూతురు చూడాల్సిన ఓటీటీ సిరీస్ ఇది. ఇప్పుడున్న సమాజానికి ఈ సిరీస్ ఎంతో అవసరం" అని ఉదయభాను పేర్కొన్నారు.
{{/usCountry}}"పోలీస్ ఆఫీసర్ రోల్ చేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉండేది. ఓ తల్లిగా ఈ పాత్రకు ఎంతో కనెక్ట్ అయ్యాను. ప్రతీ కుటుంబం, ప్రతీ పేరెంట్, ప్రతీ కూతురు చూడాల్సిన ఓటీటీ సిరీస్ ఇది. ఇప్పుడున్న సమాజానికి ఈ సిరీస్ ఎంతో అవసరం" అని ఉదయభాను పేర్కొన్నారు.
{{/usCountry}}"రాజీవ్ కనకాల నాకు మంచి మిత్రుడు. వాసంతిక మంచి నటి. ఈ కథను గొప్పగా మలిచిన, తెరకెక్కించిన కృష్ణ గారికి హ్యాట్సాఫ్. ఫిబ్రవరి 27 నుంచి జీ5లో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు ఓటీటీ స్ట్రీమింగ్ కాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి" అని ఉద భాను కోరారు.
జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్
దర్శకుడు కృష్ణ పోలూరు మాట్లాడుతూ .. "డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు చాలా బాగుంటుంది. నా దగ్గర ముందు ఓ లైన్ మాత్రమే ఉండేది. అది జయంత్ గారి దగ్గరకు వెళ్లడంతో పూర్తి కథగా మారింది. అనురాధ మేడం వల్లే ఈ ప్రాజెక్ట్ ఇక్కడకు వరకు వచ్చింది" అని చెప్పారు.
"‘రెక్కి’ తరువాత నేను ఈ కథనే రాశాను. ఈ స్టోరీ మొత్తం రాయడానికి నాకు రెండేళ్లు పట్టింది. ఫిబ్రవరి 27 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది. తప్పకుండా చూడండి" అని వెల్లడించారు ఓటీటీ సిరీస్ డైరెక్టర్ కృష్ణ పోలూరు.