...
...
Next Story

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌లో ఏఐ చిప్, ల్యాబ్‌కు పంపండి.. పాకిస్థాన్ క్రికెట్ నిపుణుడి ఆరోపణలు!

Vaibhav Sooryavanshi Accused Of AI Chip In Bat: 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో సెంచరీలతో విరుచుకుపడుతున్న బీహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ప్రతిభను చూసి ఓర్వలేక పాకిస్థాన్ క్రికెట్ విశ్లేషకుడు నౌమన్ నియాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైభవ్ బ్యాట్‌లో పవర్ జనరేట్ చేసే ఏఐ చిప్ ఉందని ఆయన ఆరోపించారు.

Published on: Apr 27, 2026, 15:37:08 IST
Advertisement

Vaibhav Sooryavanshi Accused Of Using AI Chip In Bat: భారత క్రికెట్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా వైభవ్ సూర్యవంశీ పేరే వినిపిస్తోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే అగ్రశ్రేణి బౌలర్లను చీల్చిచెండాడుతున్న ఈ కుర్రాడి ఆటతీరుపై పాకిస్థాన్ క్రికెట్ నిపుణుడు నౌమన్ నియాజ్ తీవ్ర ఆరోపణలు చేశారు.

ఏఐ చిప్ వాడుతున్నాడు

వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌లో ఏఐ చిప్, ల్యాబ్‌కు పంపండి.. పాకిస్థాన్ క్రికెట్ నిపుణుడి ఆరోపణలు! (PTI)
వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌లో ఏఐ చిప్, ల్యాబ్‌కు పంపండి.. పాకిస్థాన్ క్రికెట్ నిపుణుడి ఆరోపణలు! (PTI)

'స్మాష్ హిట్' అనే కార్యక్రమంలో నౌమన్ నియాజ్ మాట్లాడుతూ.. "ఈ పిల్లాడి (వైభవ్ సూర్యవంశీ) బ్యాట్‌ను ఒకసారి చెక్ చేయండి. వాడా (WADA) ఎలాగైతే డోప్ టెస్టులు చేస్తుందో, అలాగే ఇతడి బ్యాట్‌ను ల్యాబ్‌కు పంపాలి. బహుశా ఇతడు తన బ్యాట్‌లో ఏఐ (AI) చిప్‌ను వాడుతున్నాడేమో. 18 ఏళ్ల వయసు వస్తే తప్ప శరీరంలో కండరాలు, బలం రావు. కానీ 16 ఏళ్ల లోపు ఉన్న ఇతడు ఇంత పవర్ ఎలా జనరేట్ చేస్తున్నాడు? విరాట్ కోహ్లీ వరల్డ్ ఛాంపియన్ అయినప్పుడు పుట్టిన ఈ పిల్లాడు 360 డిగ్రీల్లో ఆడుతుంటే నమ్మలేకపోతున్నాను" అంటూ విడ్డూరపు ఆరోపణలు చేశారు.

రికార్డుల వేటలో వైభవ్

నౌమన్ నియాజ్ ఆరోపణలు ఎలా ఉన్నా, వైభవ్ సూర్యవంశీ మాత్రం మైదానంలో పరుగుల వరద పారిస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కేవలం 26 బంతుల్లో 78 పరుగులు చేసి తృటిలో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును మిస్ చేసుకున్న వైభవ్ శనివారం (ఏప్రిల్ 25) సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై మాత్రం కనికరించలేదు.

కేవలం 37 బంతుల్లోనే మెరుపు సెంచరీ బాది తన సత్తా చాటాడు వైభవ్ సూర్యవంశీ. మధ్యలో కొన్ని మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లకే పరిమితమైనా, కీలక సమయంలో సెంచరీతో చెలరేగి విమర్శకుల నోళ్లు మూయించాడు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్-19లో ఈ కుర్రాడి జోరు చూస్తుంటే భారత క్రికెట్ భవిష్యత్తు ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు.

ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ లేపుతున్నాడు

కేఎల్ రాహుల్ (3వ స్థానం), శుభ్‌మన్ గిల్ (5వ స్థానం), విరాట్ కోహ్లీ (6వ స్థానం) వంటి సీనియర్లను వెనక్కి నెట్టి వైభవ్ దూసుకుపోతున్నాడు. టాప్-10లో హెన్రిచ్ క్లాసెన్ మినహా మిగిలిన వారంతా భారతీయులే ఉండటం గమనార్హం.

"వైభవ్ ఆటతీరు అద్భుతం. అతని టెక్నిక్, రిస్ట్ వర్క్ అమోఘం. కేవలం పవర్ మీదే కాకుండా టైమింగ్‌తో బంతులను బౌండరీలకు పంపుతున్నాడు" అని భారత క్రికెట్ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.

టీమ్ ఇండియా పిలుపు ఎప్పుడంటే?

గత ఏడాది కాలంగా వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన అనితరసాధ్యంగా ఉంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా గడ్డలపై సెంచరీలు బాదడమే కాకుండా ఈ ఏడాది జనవరిలో జరిగిన అండర్-19 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టులో కీలక పాత్ర పోషించాడు.

బీసీసీఐ సెలక్టర్ల కన్ను

ఈ క్రమంలోనే బీసీసీఐ సెలక్టర్ల కన్ను ఇతనిపై పడింది. అన్నీ అనుకూలిస్తే వచ్చే జూన్ నాటికి ఈ 15 ఏళ్ల వండర్ కిడ్ భారత జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బ్రెయిన్ లారా లాంటి లెజెండరీ ఆటగాళ్ల తరహాలో వైభవ్‌ను కూడా జాగ్రత్తగా తీర్చిదిద్దాలని మాజీలు సూచిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe