Vanda Devullu OTT Release Date: బిచ్చగాడు సినిమాతో హీరోగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోనీ. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు తెలుగులో కూడా మంచి బజ్ క్రియేట్ అవుతోంది. అలాంటి విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ మూవీనే నూరు సామి (Nooru Saami).
జోడీగా స్వాసిక విజయన్

తమిళంలో సోషల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన నూరు సామిని తెలుగులో వంద దేవుళ్లు (Vanda Devullu)గా డబ్ చేశారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోనీకి జోడీగా మలయాళ బ్యూటిఫుల్ హీరోయిన్ స్వాసిక విజయన్ నటించింది. వీరితోపాటు అజయ్ దిశన్, లిజోమోల్ జోస్, కరుణాకరన్, మునిష్కాంత్, బాలాజీ శక్తివేల్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
డైరెక్టర్ శశి దర్శకత్వం వహించిన వంద దేవుళ్లు సినిమాను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, శరవంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్స్ నిర్మించాయి. జూన్ 19న థియేటర్లలో విడుదలైన వంద దేవుళ్లు సినిమా బాగానే ఆకట్టుకుంటుంది. ఫలితంగా ఐఎమ్డీబీ నుంచి పదికి 7.7 రేటింగ్ కూడా సాధించింది.
40 దాటిన తల్లికి మళ్లీ పెళ్లి
నిజ సంఘటనల ఆధారంగా రూపొందిన వంద దేవుళ్లు చిత్రం వింతతువు, ఆమె ఇద్దరి కొడుకుల చుట్టూ తిరుగుతుంది. నలభై దాటడం, మధ్య వయస్సుకి వచ్చిన అమ్మని మళ్లీ పెళ్లి చేయాలని కొడుకు అనుకోవడం, ఆ తల్లి సైతం తోడును వెతుక్కోవాలని ఆలోచించినప్పుడు, ఆమె నిర్ణయం బంధువులు, గ్రామస్తులు, మొత్తం సమాజం నుంచి ప్రతిఘటనను ఎదుర్కొంటుంది.
తల్లి, కొడుకుల మధ్య ఉండే అందమైన బంధమే ఈ కథకు ప్రధాన ఆకర్షణ. ఒక తల్లి తన జీవితాంతం చేసే లెక్కలేనన్ని త్యాగాలను హైలైట్ చేస్తుంది ఈ చిత్రం. ఒక కొడుకు తన తల్లి కష్టాలను, త్యాగాలను చూసి, గుర్తించడమే కాకుండా, సామాజిక విమర్శలను ఎదుర్కొని కూడా తన సంతోషాన్ని తనే ఎంచుకునేలా ఆమెను ప్రోత్సహించడం ఈ మూవీలోని కోర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.
మహిళల అణచివేతపై
{{/usCountry}}తల్లి, కొడుకుల మధ్య ఉండే అందమైన బంధమే ఈ కథకు ప్రధాన ఆకర్షణ. ఒక తల్లి తన జీవితాంతం చేసే లెక్కలేనన్ని త్యాగాలను హైలైట్ చేస్తుంది ఈ చిత్రం. ఒక కొడుకు తన తల్లి కష్టాలను, త్యాగాలను చూసి, గుర్తించడమే కాకుండా, సామాజిక విమర్శలను ఎదుర్కొని కూడా తన సంతోషాన్ని తనే ఎంచుకునేలా ఆమెను ప్రోత్సహించడం ఈ మూవీలోని కోర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.
మహిళల అణచివేతపై
{{/usCountry}}తల్లీకొడుకుల అద్భుతమైన బంధాన్ని తెరపై అంతే అద్బుతంగా చూపించారు. 'వంద దేవుళ్లు' ఒక ఒంటరి తల్లి కథను చెబుతున్నప్పటికీ దానిలోని భావోద్వేగాలు కేవలం ఒక మహిళ ప్రయాణానికే పరిమితం కావు. ఈ చిత్రం వివాహం, మాతృత్వం, త్యాగం, సహచర్యం, మహిళలపై అణచివేతను చూపిస్తుంది. అన్ని తరాల తల్లులు, వివాహిత మహిళలు తమకు తాము అన్వయించుకోగలిగే కథగా నిలుస్తుంది.
ఈ చిత్రం థియేటర్లలో కూడా మంచి వసూళ్లను సాధించింది. ఇందులోని సహజమైన భావోద్వేగాలు, నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నేటి ప్రేక్షకులు కేవలం వినోదాన్ని అందించడమే కాకుండా, చర్చలను రేకెత్తించి, మారుతున్న సామాజిక వాస్తవాలను ప్రతిబింబించే కథల కోసం ఎదురుచూస్తున్నారని మేము నమ్ముతున్నామని మేకర్స్ తెలిపారు.
జీ5 ఓటీటీలో
'వంద దేవుళ్లు' మూవీ మన మూలాల్లోని కథనాన్ని, ప్రగతిశీల, ఆలోచింపజేసే ఇతివృత్తంతో మేళవించి, భావోద్వేగభరితంగా అందరికీ చేరువయ్యేలా చేస్తుందని వారు చెప్పుకొచ్చారు. ఇలాంటి వంద దేవుళ్లు ఓటీటీ ప్రీమియర్ను తాజాగా నిన్న (జూలై 24) ప్రకటించారు.
హీరో విజయ్ ఆంటోనీ బర్త్ డే సందర్భంగా వంద దేవుళ్లు ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలను అధికారికంగా అనౌన్స్ చేశారు మేకర్స్. జీ5లో వంద దేవుళ్లు ఓటీటీ రిలీజ్ కానుంది. ఆగస్టు నెలలో జీ5లో తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం వంటి నాలుగు భాషల్లో వంద దేవుళ్లు ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది. అయితే, ఇప్పటికీ వంద దేవుళ్లు ఓటీటీ రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు.