బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ బిపాసా బసు చాలా కాలం తర్వాత తన కుటుంబంతో కలిసి బయట కనిపించారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్, కుమార్తె దేవితో కలిసి ఒక అరుదైన అవుటింగ్లో బిపాసా సందడి చేశారు. అయితే ఈ క్రమంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.
“ఎవరు మీరు?” అంటూ బిపాసా ప్రశ్న

గురువారం (జనవరి 22) నాడు బాంద్రాలో కారు దిగుతున్న సమయంలో బిపాసాను, తన చిన్నారి దేవిని ఫొటోగ్రాఫర్లు క్లిక్ చేసేందుకు ప్రయత్నించారు. తన కుమార్తె దేవిని ఎత్తుకున్న బిపాసా, వెంటనే అప్రమత్తమై పాప ముఖాన్ని తన చేతులతో కవర్ చేశారు.
కరణ్ సింగ్ గ్రోవర్ బ్యాగ్ తగిలించుకుని వారి వెంటే నడిచారు. ప్యాపరాజీలు (ఫొటోగ్రాఫర్స్) తన కూతురు దేవి ముఖాన్ని ఫొటో తీయడానికి ప్రయత్నిస్తుండటంతో బిపాసా తీవ్ర అసహనానికి గురయ్యారు. బిల్డింగ్లోకి వెళ్తున్న సమయంలో కోపంగా ఒక ఫొటోగ్రాఫర్ వైపు చూస్తూ “అసలు ఎవరు మీరు?” (కౌన్ హో ఆప్?) అని ప్రశ్నిస్తూ లోపలికి వెళ్లిపోయారు.
విరుచుకుపడటంతో
ఫోటోగ్రాఫ్లపై బిపాసా బసు విరుచుకుపడటంతో సెలబ్రిటీలు తమ పిల్లల ప్రైవసీ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో ఈ బోల్డ్ బ్యూటీ ప్రవర్తన మరోసారి నిరూపించింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం బిపాసా తన కూతురితో గడిపిన సరదా క్షణాలను అప్పుడప్పుడు షేర్ చేస్తూనే ఉంటారు. రీసెంట్గా ఈ జంట తమ గారాల పట్టి దేవితో కలిసి వెకేషన్కు వెళ్లిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
పదేళ్ల బంధం.. ముచ్చటైన కుటుంబం
బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ల ప్రేమకథ ‘ఎలోన్’ (2015) సినిమా సెట్స్లో మొదలైంది. ఈ సినిమాలో వారి కెమిస్ట్రీ చూసి అంతా ఫిదా అయ్యారు. ఏడాది పాటు ప్రేమలో ఉన్న ఈ జంట, ఏప్రిల్ 2016లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. దాదాపు పదేళ్లుగా అన్యోన్యంగా ఉంటున్న ఈ దంపతులకు 2022, నవంబర్ 12న దేవి జన్మించింది.
కెరీర్ విషయానికొస్తే..
{{/usCountry}}బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ల ప్రేమకథ ‘ఎలోన్’ (2015) సినిమా సెట్స్లో మొదలైంది. ఈ సినిమాలో వారి కెమిస్ట్రీ చూసి అంతా ఫిదా అయ్యారు. ఏడాది పాటు ప్రేమలో ఉన్న ఈ జంట, ఏప్రిల్ 2016లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. దాదాపు పదేళ్లుగా అన్యోన్యంగా ఉంటున్న ఈ దంపతులకు 2022, నవంబర్ 12న దేవి జన్మించింది.
కెరీర్ విషయానికొస్తే..
{{/usCountry}}ఇక బిపాసా బసు చివరిగా ‘డేంజరస్’ అనే ఓటీటీ సిరీస్లో కనిపించారు. ఎంఎక్స్ ప్లేయర్లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ ద్వారా బిపాసా బసు ఓటీటీలోకి అడుగుపెట్టారు. తెలుగులో మహేశ్ బాబు సరసన టక్కరి దొంగ మూవీలో హీరోయిన్గా కూడా చేసింది బిపాసా బసు. చాలా కాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నారు.
మరోవైపు కరణ్ సింగ్ గ్రోవర్ గతేడాది ‘ఫైటర్’ సినిమాలో నటించారు. హృతిక్ రోషన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 358 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది.