కొత్త వారం రాగానే ఓటీటీలోకి సరికొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతూ సందడి చేస్తుంటాయి. ఈ క్రమంలోనే ఇవాళ (జనవరి 15) తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఆ సినిమానే ఇట్లు మీ ఎదవ. వెయ్యేళ్లు ధర్మంగా వర్ధిళ్లు అనేది సినిమా క్యాప్షన్.
హీరో, డైరెక్టర్ ఒక్కరే

డిఫరెంట్ టైటిల్తో తెరకెక్కిన ఈ సినిమాలో త్రినాధ్ కఠారి హీరోగా చేయడంతోపాటు స్వీయ దర్శకత్వం వహించారు. అంటే హీరో, డైరెక్టర్ రెండు త్రినాధ్ కఠారి ఒక్కరే నిర్వర్తించారు. ఈ సినిమాలో త్రినాధ్కు జోడీగా సాహితీ అవాంచ హీరోయిన్గా చేసింది.
అలాగే, ఇట్లు మీ ఎదవ సినిమాలో గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, తనికెళ్ల భరణి, నవీన్ నేని, సురభి ప్రభావతి, మధుమణి కీలక పాత్రలు పోషించారు. వీరితోపాటు తాగుబోతు రమేష్, చలాకీ చంటి, జబర్దస్త్ నూకరాజు, జెమినీ సురేష్, డీడీ శ్రీనివాస్, రామజగన్ తదితరులు ఇతర పాత్రలు చేశారు.
ఐఎమ్డీబీలో 9.7 రేటింగ్
ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించిన ఇట్లు మీ ఎదవ సినిమా గతేడాది నవంబర్ 21న థియేటర్లలో విడుదలైంది. తొలి రోజు నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. రొటీన్ టెంప్లెట్లో సినిమా సాగిన కామెడీ ట్రాక్ బాగుందని, హీరోను ఎదవగా చూపించే సీన్స్ ఆకట్టుకున్నాయని పాజిటివిటీ వచ్చింది.
కానీ, ఐఎమ్డీబీలో మాత్రం పదికి ఏకంగా 9.7 రేటింగ్ సాధించుకుని ఇట్లు మీ ఎదవ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా చాలా బాగుందని చెబుతూ 9.7 రేటింగ్ను ఐఎమ్డీబీలో సుమారుగా 2, 201 మంది ఓట్ వేశారు. అందుకే ఇట్లు మీ ఎదవ చిత్రానికి ఏకంగా 9.7 రేటింగ్ దక్కింది.
2 నెలల తర్వాత ఓటీటీలోకి
ఇంతటి రేటింగ్ సాధించిన ఇట్లు మీ ఎదవ ఓటీటీలోకి ఇవాళ (జనవరి 15) వచ్చేసింది. సుమారు 2 నెలల తర్వాత ఓటీటీకి వచ్చేసింది ఈ సినిమా. ప్రముఖ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ ఈటీవీ విన్లో ఇట్లు మీ ఎదవ ఓటీటీ రిలీజ్ అయింది.
{{/usCountry}}ఇంతటి రేటింగ్ సాధించిన ఇట్లు మీ ఎదవ ఓటీటీలోకి ఇవాళ (జనవరి 15) వచ్చేసింది. సుమారు 2 నెలల తర్వాత ఓటీటీకి వచ్చేసింది ఈ సినిమా. ప్రముఖ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ ఈటీవీ విన్లో ఇట్లు మీ ఎదవ ఓటీటీ రిలీజ్ అయింది.
{{/usCountry}}ఇట్లు మీ ఎదవ కథ విషయానికొస్తే.. ఆవారాగా తిరిగే శ్రీను (త్రినాధ్ కఠారి) ఆరేళ్లుగా పీజీ చేస్తూనే ఉంటాడు. తన కాలేజీలో జాయిన్ అయిన మనస్విని (సాహితీ అవాంచ)ను చూసి లవ్లో పడతాడు. చివరికి మనస్వినిని కూడా ప్రేమలే పడేస్తాడు శ్రీను.
ఎదవ అని తెలిసి
కొడుకు మార్పు చూసిన శ్రీను తండ్రి (గోపరాజు రమణ) ప్రేమించిన అమ్మాయితోనే పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. అందుకు మనస్విని తండ్రి (దేవి ప్రసాద్)తో సంబంధం మాట్లాడేందుకు శ్రీను తండ్రి వెళ్తాడు. అక్కడ శ్రీను ఎదవ ప్రవర్తన తెలిసి తిరస్కరిస్తాడు మనస్విని తండ్రి.
ఆ తర్వాత ఏమైంది కూతురును ఇచ్చి పెళ్లి చేసేందుకు శ్రీను లవర్ తండ్రి చేసిన 30 రోజుల ఛాలెంజ్ ఏంటీ? ఆ ఛాలెంజ్కు శ్రీను ఒప్పుకున్నాడా? మనస్విని శ్రీను పెళ్లాడాడ? వంటి అంశాలతో ఇట్లు మీ ఎదవ సాగుతుంది.
ఈటీవీ విన్ ఓటీటీలో
సేమ్ బొమ్మరిల్లు టైపులో ఇట్లు మీ ఎదవ ఉంటుందని కామెంట్స్ వినిపించాయి. ఇకపోతే థియేటర్లలో మిస్ అయిన వాళ్లు ఈటీవీ విన్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఇట్లు మీ ఎదవను ఎంచక్కా చూసేయొచ్చు.