రణ్వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రంపై సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మహేశ్ బాబు, అల్లు అర్జున్ తర్వాత

ఇప్పటికే టాలీవుడ్ స్టార్స్ మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రవితేజ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాను కొనియాడగా.. తాజాగా బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ధురంధర్ 2పై రివ్యూ ఇచ్చారు. తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ చిత్రంపై సుదీర్ఘమైన రివ్యూ రాసుకొచ్చారు.
రణ్వీర్.. నువ్వు ఒక లెజెండ్వి!
సినిమా చూసిన అనుభూతి నుంచి తాను ఇంకా బయటకు రాలేకపోతున్నానని కాజల్ పేర్కొన్నారు. "ధురంధర్: ది రివెంజ్.. ఆ పేరు వింటేనే ఏదో తెలియని అనుభూతి కలుగుతోంది. రణ్వీర్, నువ్వు చేసిన పనికి నేను ఫిదా అయిపోయాను. ఆ ఎమోషన్, ఆ తీవ్రత, ఆ సహజత్వం.. ఆ పాత్ర వెనుక ఉన్న నీ కష్టం ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తోంది. జస్కీరాత్, హమ్జా పాత్రలు మా గుండెల్లో ఎప్పటికీ ఉండిపోతాయి. నువ్వు నిజంగానే ఈ కాలపు గొప్ప నటుడివి" అని కాజల్ అగర్వాల్ ప్రశంసించారు.
మ్యాడీ నుంచి యామీ దాకా.. అందరూ అద్భుతం!
కేవలం హీరో మాత్రమే కాకుండా, ధురంధర్ 2 చిత్రంలోని ఇతర నటీనటుల గురించి కూడా కాజల్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. "మాధవన్ సార్.. ఆ నిశ్శబ్దమైన బలం, ఆ గంభీరమైన అధికారం అద్భుతం. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో మీరు దేశభక్తిని రగిలించారు" అని కాజల్ చెప్పుకొచ్చారు.
రెండో భాగం అంతకుమించి ఉంది
{{/usCountry}}కేవలం హీరో మాత్రమే కాకుండా, ధురంధర్ 2 చిత్రంలోని ఇతర నటీనటుల గురించి కూడా కాజల్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. "మాధవన్ సార్.. ఆ నిశ్శబ్దమైన బలం, ఆ గంభీరమైన అధికారం అద్భుతం. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో మీరు దేశభక్తిని రగిలించారు" అని కాజల్ చెప్పుకొచ్చారు.
రెండో భాగం అంతకుమించి ఉంది
{{/usCountry}}"ఆదిత్య ధర్, ఇది కేవలం సినిమా కాదు.. ఒక వెండితెర విందు. మొదటి భాగం మర్చిపోలేనిది అయితే, రెండో భాగం అంతకు మించి ఉంది. ఇక యామీ గౌతమ్ తన నటనతో ఎప్పటిలాగే మెరిసిపోగా, సారా అర్జున్ తన పాత్రలో ఎంతో ముచ్చటగా కనిపించింది" అని ప్రతి ఒక్కరి గురించి చెబుతూ కాజల్ రివ్యూ రాసుకొచ్చారు.
సంగీతంపై కాజల్
ధురంధర్ 2 సినిమాలోని సంగీతం గురించి చెబుతూ.. "శశ్వత్ సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. మొదటి భాగంలోని పంజాబీ జానపదాల నుంచి ఇప్పుడు రెండో భాగంలో వినిపించిన సంగీతం వరకు ప్రతిదీ అద్భుతం" అని టీమ్ మొత్తానికి కంగ్రాట్స్ చెప్పారు చందమామ కాజల్ అగర్వాల్.
అసలు ఏంటి ఈ 'ధురంధర్ 2' కథ?
పాకిస్థాన్లోని కరాచీలో ఉన్న ప్రమాదకరమైన 'ల్యారీ' ప్రాంతం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. గతంలో జరిగిన కందహార్ హైజాక్, పార్లమెంట్ దాడి, 26/11 ముంబై దాడుల వంటి కీలక ఘట్టాల వెనుక గూఢచారి వ్యవస్థ ఎలా పనిచేసింది అనే కోణంలో ఈ కథను రూపొందించారు.
రణ్వీర్ సింగ్ ఒక సాధారణ యువకుడు జస్కీరాత్ సింగ్ రంగీ నుంచి కరాచీ అండర్వరల్డ్ను శాసించే హమ్జా అలీ మజారీగా ఎలా మారాడు అనే ప్రయాణమే ఈ సినిమా. మొత్తానికి 'ధురంధర్ 2' కేవలం రికార్డులనే కాదు, సెలబ్రిటీల మనసులను కూడా గెలుచుకుంటూ బాక్సాఫీస్ వద్ద రారాజులా దూసుకుపోతోంది.