బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా తన జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. గతేడాది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన పరిణీతి చోప్రా ఇప్పుడు తల్లుల సమస్యలు, వారి మనోభావాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు 'మామ్ టాక్స్' (Mom Talks) అనే సరికొత్త టాక్ షోను ముందుకు తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన మామ్ టాక్స్ టీజర్ను ఆమె తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ప్రముఖ సెలబ్రిటీలతో మనసు విప్పే సంభాషణలు

ఈ షోలో మాతృత్వం, పితృత్వంపై మనసుకు హత్తుకునే చర్చలు ఉండనున్నాయి. నేహా ధూపియా, విక్రాంత్ మాస్సే-శీతల్ ఠాకూర్ జంట, ఇమ్రాన్ ఖాన్, గౌహర్ ఖాన్-జైద్ దర్బార్, దిశా పర్మార్ వంటి సినీ సెలబ్రిటీలు ఈ వేదికపై తమ వ్యక్తిగత అనుభవాలను పంచుకోనున్నారు. పిల్లల పెంపకంలో ఎదురయ్యే సామాజిక ఒత్తిళ్లు, అపోహలపై పరిణీతి వీరితో కలిసి లోతుగా చర్చించనున్నారు.
ఈ కొత్త ప్రయత్నాన్ని చూసి గర్వపడుతున్నట్లు పరిణీతి చోప్రా భర్త, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పేర్కొన్నారు. "నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది! అభినందనలు. నేను ఎప్పుడూ నీకు మద్దతుగా ఉంటాను" అని రాఘవ్ చద్దా కామెంట్ సెక్షన్లో తన ప్రేమను చాటుకున్నారు.
రాజకీయాల్లో 'గాయపడ్డ సింహం'లా రాఘవ్ చద్దా
మరోవైపు, గత కొద్దిరోజులుగా రాఘవ్ చద్దా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారారు. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) డిప్యూటీ లీడర్ పదవి నుంచి ఆయన్ని అనూహ్యంగా తొలగించి, అశోక్ మిట్టల్ను నియమించింది. ఈ నిర్ణయంపై రాఘవ్ స్పందిస్తూ.. తనను మౌనంగా ఉంచగలరేమో కానీ ఓడించలేరని ధీమా వ్యక్తం చేశారు.
తాజాగా పరిణీతి చోప్రా 'ధురంధర్' సినిమా స్టైల్లో ప్రత్యర్థులకు కౌంటర్ ఇచ్చారు. "నేను గాయపడ్డాను.. అందుకే మరింత ప్రమాదకరంగా మారాను" (ఘాయల్ హూ, ఇస్లియే ఘాతక్ హూ) అంటూ ధురంధర్ సినిమాలోని రణ్వీర్ సింగ్ డైలాగ్తో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
{{/usCountry}}తాజాగా పరిణీతి చోప్రా 'ధురంధర్' సినిమా స్టైల్లో ప్రత్యర్థులకు కౌంటర్ ఇచ్చారు. "నేను గాయపడ్డాను.. అందుకే మరింత ప్రమాదకరంగా మారాను" (ఘాయల్ హూ, ఇస్లియే ఘాతక్ హూ) అంటూ ధురంధర్ సినిమాలోని రణ్వీర్ సింగ్ డైలాగ్తో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
{{/usCountry}}తనపై జరుగుతున్నది ఒక ప్రణాళికాబద్ధమైన దాడి అని, అందరూ ఒకే తరహా విమర్శలు చేయడం వెనుక కుట్ర ఉందని రాఘవ్ చద్దా ఆరోపించారు. కాగా, గతంలో పార్లమెంటులో తండ్రులకు కూడా సెలవులు (Paternal Leave) కావాలని రాఘవ్ చద్దా గొంతు వినిపించగా, పరిణీతి ఆయనకు మద్దతు తెలపడం విశేషం.
ఉదయ్పూర్ వేదికగా వైభవంగా పెళ్లి..
పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా 2023 మే నెలలో ఉదయ్పూర్లోని లీలా ప్యాలెస్లో అట్టహాసంగా వివాహం చేసుకున్నారు. వివాహబంధంలోకి అడుగుపెట్టిన రెండేళ్ల తర్వాత, అంటే 2025 అక్టోబర్ 19న ఈ దంపతులకు 'నీర్' అనే కుమారుడు జన్మించాడు. ఇప్పుడు తన కుమారుడి రాకతో కలిగిన అనుభవాలను ఈ షో ద్వారా పంచుకోవడానికి పరిణీతి సిద్ధమయ్యారు.
మామ్ టాక్స్ ఓటీటీ స్ట్రీమింగ్
ఇకపోతే పరిణీతి చోప్రా హోస్ట్గా వ్యవహరిస్తున్న మామ్ టాక్స్ ఓటీటీలోకి ఇవాళ (ఏప్రిల్ 5) వచ్చేసింది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ జీ5లో మామ్ టాక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి ఎపిసోడ్లో బాలీవుడ్ ప్రముఖ నటుడు విక్రాంత్ మాస్సే, ఆయన భార్య శీతల్ అతిథిగా హాజరయ్యారు.