సినిమా రంగంలో గంటల తరబడి షూటింగ్లు చేయడం, విశ్రాంతి లేకుండా పని చేయడం అనే సంస్కృతిపై ఇప్పుడు తారలు గొంతు విప్పుతున్నారు. ఇంతకుముందు దీపికా పదుకొణె లాంగ్ షిఫ్టుల విషయంలో తన అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం పెద్ద కాంట్రవర్సీగా మారిన విషయం తెలిసిందే.

ఇప్పుడు దీపికా పదుకొణె బాటలో మరో హీరోయిన్, విలక్షణ నటి రాధిక ఆప్టే పయనిస్తున్నారు. తెలుగులో బాలకృష్ణతో లెజెండ్, లయన్ సినిమాల్లో హీరోయిన్గా చేసిన రాధిక ఆప్టే పని గంటల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు.
పిల్లలను చూడకుండా వారం మొత్తం ఎలా పని చేస్తారు?
తాజాగా ఫిల్మ్ఫేర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధిక ఆప్టే సినిమా ఇండస్ట్రీలోని పని వాతావరణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "సినిమా రంగంలో తల్లిదండ్రులకు అనుకూలమైన వాతావరణం ఉండాలి. వారం మొత్తం తన బిడ్డను చూడకుండా ఎవరైనా ఎలా పని చేయగలరు? నేను లాంగ్ షిఫ్టులు చేయనని చెప్పినప్పుడు చాలామందితో వాదించాల్సి వచ్చింది. బేబీని చూసుకోవడానికి నానీని (ఆయమ్మను) సెట్కు తీసుకురమ్మని కొందరు సలహా ఇస్తారు. కానీ, అది సరైన పరిష్కారం కాదు" అని రాధిక ఆప్టే పేర్కొన్నారు.
నా రూల్స్ ఇవే.. నో కాంప్రమైజ్!
సినిమా ఒప్పుకునే ముందే రాధిక ఆప్టే తన నిబంధనలను స్పష్టంగా వివరిస్తున్నారు. "నా ప్రయాణం, మేకప్, షూటింగ్ అంతా కలిపి రోజుకు 12 గంటలు మాత్రమే పని చేస్తాను. అంతకు మించి ఒక్క నిమిషం కూడా ఉండను" అని రాధిక ఆప్టే డిమాండ్ చేస్తోంది.
"వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేయాలని, కచ్చితంగా వీక్లీ ఆఫ్ ఉండాలని నేను పట్టుబడుతున్నాను. నా ఈ నిర్ణయం చాలామందికి నచ్చడం లేదు. చిన్న సినిమాల విషయంలో కొన్ని మినహాయింపులు ఉండొచ్చు. కానీ, సాధారణంగా మాత్రం నా రూల్స్ ఇవే" అని రాధికా ఆప్టే స్పష్టం చేశారు.
వ్యక్తిగత జీవితం
{{/usCountry}}"వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేయాలని, కచ్చితంగా వీక్లీ ఆఫ్ ఉండాలని నేను పట్టుబడుతున్నాను. నా ఈ నిర్ణయం చాలామందికి నచ్చడం లేదు. చిన్న సినిమాల విషయంలో కొన్ని మినహాయింపులు ఉండొచ్చు. కానీ, సాధారణంగా మాత్రం నా రూల్స్ ఇవే" అని రాధికా ఆప్టే స్పష్టం చేశారు.
వ్యక్తిగత జీవితం
{{/usCountry}}ఇదిలా ఉంటే, రాధికా ఆప్టే 2012లో బెనెడిక్ట్ టేలర్ను వివాహం చేసుకున్నారు. 2024 డిసెంబర్లో ఈ దంపతులకు తొలి సంతానం జన్మించింది. బెనెడిక్ట్ లండన్లో, రాధిక ముంబైలో ఉంటూ తమ మధ్య సమయాన్ని పంచుకుంటూ కెరీర్ను బ్యాలెన్స్ చేస్తున్నారు.
కాగా, ఇటీవలే రాధిక ఆప్టే తిస్కా చోప్రా దర్శకత్వంలో వచ్చిన 'సాలీ మొహబ్బత్' (Saali Mohabbat) అనే మిస్టరీ థ్రిల్లర్లో నటించారు. ఇది 2025 డిసెంబర్లో జీ5లో ఓటీటీ రిలీజ్ అయి మంచి ఆదరణ పొందింది. అలాగే నెట్ఫ్లిక్స్ ఓటీటీ సిరీస్ 'రాత్ అకేలీ హై: ది బన్సల్ మర్డర్స్'లో కూడా రాధిక ఆప్టే అతిథి పాత్రలో మెరిశారు.