సినిమా రంగంలో రికార్డులు తిరగరాయడం అంటే బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సాధించడమే కాదు.. సోషల్ మీడియాలో, సెర్చ్ ఇంజిన్లలో ఎంత ప్రభావం చూపారనేది కూడా కీలకమే. గతేడాది డిసెంబర్లో విడుదలై సుమారు రూ. 1300 కోట్ల భారీ వసూళ్లను సాధించిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ (Dhurandhar) ఇప్పుడు (ఐఎమ్డీబీ) IMDb ర్యాంకింగ్స్లోనూ సరికొత్త రికార్డులను సృష్టించింది.
షారుఖ్, ఐశ్వర్యరాయ్లను వెనక్కి నెట్టిన సారా అర్జున్

తాజాగా విడుదలైన ఐఎమ్డీబీ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో ‘ధురంధర్’ నటీనటులు ఆధిపత్యం ప్రదర్శించారు. ముఖ్యంగా రణ్వీర్ సింగ్ సరసన నటించిన యువ నటి, ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.
జనవరి 30న నెట్ఫ్లిక్స్లో ధురంధర్ ఓటీటీ రిలీజ్ అయినప్పటి నుంచి సారా అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే సారా అర్జున్ బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ (#8), ఐశ్వర్య రాయ్ బచ్చన్ (#10) వంటి దిగ్గజాలను సైతం వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది. ఇక రణ్వీర్ సింగ్ రెండో స్థానంలో నిలిచి తన సత్తా చాటారు.
లిస్టులో ‘ధురంధర్’ టీమ్ సందడి
ఈ వారం టాప్ 10 జాబితాలో దర్శకుడు ఆదిత్య ధర్ (#6), నటుడు అక్షయ్ ఖన్నా (#7) కూడా చోటు సంపాదించుకున్నారు. వీరే కాకుండా ఆర్. మాధవన్ (#17), అర్జున్ రాంపాల్ (#21), సంజయ్ దత్ (#35), రాకేష్ బేడీ (#64) కూడా మొదటి టాప్ 100 మందిలో నిలిచారు. ఒకే సినిమా నుంచి ఏకంగా ఎనిమిది మంది సెలబ్రిటీలు ఈ స్థాయిలో ట్రెండింగ్లో ఉండటం అరుదైన విషయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇతర ట్రెండింగ్ సెలబ్రిటీలు
'బార్డర్ 2' విజయంతో సన్నీ డియోల్ మూడో స్థానంలో నిలవగా, 'మర్దాని 3'లో తన నటనతో మెప్పించిన మల్లికా ప్రసాద్ తొమ్మిదో స్థానాన్ని దక్కించుకున్నారు. జోయా అఫ్రోజ్ (#4), సమారా తిజోరి (#5) కూడా తమ వెబ్ సిరీస్ల ప్రభావంతో టాప్ 5లో నిలిచారు.
{{/usCountry}}'బార్డర్ 2' విజయంతో సన్నీ డియోల్ మూడో స్థానంలో నిలవగా, 'మర్దాని 3'లో తన నటనతో మెప్పించిన మల్లికా ప్రసాద్ తొమ్మిదో స్థానాన్ని దక్కించుకున్నారు. జోయా అఫ్రోజ్ (#4), సమారా తిజోరి (#5) కూడా తమ వెబ్ సిరీస్ల ప్రభావంతో టాప్ 5లో నిలిచారు.
{{/usCountry}}ఇదిలా ఉంటే, యదార్థ సంఘటనల ఆధారంగా, పాకిస్థాన్లోని ల్యారీలో జరిగిన రహస్య ఆపరేషన్ నేపథ్యంలో రూపొందిన ‘ధురంధర్’.. గల్ఫ్ దేశాలు, పాకిస్థాన్లో నిషేధానికి గురైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించింది.
త్వరలో ‘ధురంధర్: ది రివెంజ్’
ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్గా ‘ధురంధర్: ది రివెంజ్’ (Dhurandhar: The Revenge) సిద్ధమవుతోంది. దురంధర్ 2 మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది. బాక్సాఫీస్ వద్ద రూ. 1300 కోట్లు కొల్లగొట్టిన మొదటి భాగం కంటే, రెండో భాగం మరిన్ని రికార్డులను సృష్టిస్తుందని సినీ వర్గాలు ఆశిస్తున్నాయి.